
7th Pay Commission
7th Pay Commission : ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇంతకీ ఏ రాష్ట్రం అంటారా.. అదేనండి.. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది. కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకే జీతాలు పెంచుతుంటాయి. డీఏ గట్రా పెంచుతుంటాయి. తాజాగా.. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం 4 శాతం డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది.కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇటీవల పెరిగిన డీఏ ఆధారంగానే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డీఏ పెంచింది ఆ రాష్ట్ర సర్కారు. ప్రస్తుతం పెరిగిన డీఏతో కలిపితే 42 శాతం డీఏ పెరిగింది.
దానికి సంబంధించిన ప్రకటనను మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేశారు. దీని వల్ల ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి జీతం కనీసం రూ.1600 నుంచి రూ.6000 వరకు పెరగనుంది.సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు సార్లు డీఏ పెరుగుతుంది. గత మార్చిలో డీఏ పెరిగింది. ఆ తర్వాత మళ్లీ జులైలో పెరిగే అవకాశం ఉంది. 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతంగా అయింది. ఇప్పుడు మళ్లీ డీఏ పెరిగితే అది 46 శాతం కానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల లాగానే.. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏను రెండు సార్లు పెంచుతారు. మార్చి 15న డీఏ ఒకసారి పెరగగా.. మళ్లీ ఈనెల రెండోసారి పెరిగింది.
7th Pay Commission da hike by 4 percent for govt employees
ఇటీవల ఒడిశా ప్రభుత్వం కూడా డీఏ పెంచింది. 4 శాతం డీఏను పెంచింది. 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతం అయింది. గత నెలలో కర్ణాటక ప్రభుత్వం కూడా డీఏను 4 శాతం పెంచింది. పెంచిన డీఏ.. జనవరి 1, 2023 నుంచి అందుబాటులోకి రానున్నట్టు తెలిపింది. కర్ణాటక రాష్ట్రం 31 శాతం నుంచి 35 శాతానికి డీఏను పెంచింది. దానికంటే ముందు జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు కూడా తమ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను పెంచాయి.
Biryani Leaf Benefits : మన వంటింట్లో తరచుగా కనిపించే బిర్యానీ ఆకులు (బే లీవ్స్) కేవలం వంటకాలకు సువాసన,…
Dates vs Almonds : చలికాలంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం సహజం. వాతావరణ మార్పుల కారణంగా జలుబు,…
Today Horoscope 12th February 2026 : నేటి రాశి ఫలాలు (12-02-2026): గ్రహాల సంచారం ఆధారంగా ఈరోజు (గురువారం)…
ENG vs WI T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ICC T20…
Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…
Serilingampalli BRS Party : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…
Ram Charan Upasana Twins : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…
This website uses cookies.