
7th Pay Commission
7th Pay Commission : మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. అయితే ఈ మధ్యనే జీతాల పెంపుతో లబ్ధి పొందిన ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మార్చి నెలలో వీరికి డియర్ నెస్ అలవెన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈసారి డీఏ పెంపు ఎంతవరకు ఉండవచ్చు అనే అంశాలపై అనేక రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ నాలుగు శాతం పెంచే అవకాశం ఉన్నట్లు తాజాగా ఎకనామిక్ టైమ్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు అధికార ప్రకటన మాత్రం రాలేదు.ఇక ఈ డిఏ పెంపు విషయంలో ఆమోదం లభిస్తే మాత్రం… 2024 జనవరి 1 నుండి ఇంక్రిమెంట్ అమలు అవుతుందని చెప్పాలి. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మార్చిలో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక 2023 జూలై 1 నుండి అమలులోకి వచ్చిన నాలుగు శాతం మరియు ప్రస్తుతం డియర్ నెస్ అలవెన్స్ మొత్తం కలిపి 46 శాతంగా ఉంది. ఇక ఇప్పుడు వినిపిస్తున్న అంచనాలు నిజమైతే మరో నాలుగు శాతం పెంపుతో మొత్తం డిఏ 50% కి చేరుతుందని చెప్పాలి.
డియర్ నెస్ అలవెన్స్ అనేది ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో కీలకమైన అంశమని చెప్పాలి. ఈ డియర్ నెస్ అలవెన్స్ అనేది ద్రవ్యోల్బణం ప్రభావాలను ఎదుర్కోవడానికి రూపొందించడం జరిగింది. అయితే ఈ అలవెన్స్ ను సాధారణంగా ఏడాదికి రెండుసార్లు సవరణ చేస్తారు. ఏడాదిలో మార్చి మరియు సెప్టెంబర్ లో దీనిని సవరిస్తారు. ఇక ఇది పెరుగుతున్న జీవన వ్యయాన్ని తట్టుకునే విధంగా ఉద్యోగి జీతం పెంచడానికి సహాయం పడుతుంది.అయితే డిఎ కాలిక్యులేషన్ ఫార్ములా 2006లో సవరించడం జరిగింది. ఇక దీనిని ఏడాదిలో 12 నెలల సగటు పెరుగుదల శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. అయితే డియో పెంపుతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం హౌస్ రెంట్ అలవెన్స్ కూడా పెంచే దిశగా ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అద్దె ఇంట్లో నివసించేవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉంటే వారు హెచ్ఆర్ఏ ప్రయోజనాలను పొందుతారు. ఇక ఈ అమౌంట్ అనేది వారు నివసించే నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
అయితే సిటీ కేటగిరీల ఆధారంగా హెచ్ఆర్ఏ ను X , Y , Z వంటి మూడు క్యాటగిరీలు విభజించడం జరిగింది. జనాభాను దృష్టిలో ఉంచుకొని ఈ విభజన చేపట్టారు. అంటే 50 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన X కేటగిరి నగరాలుగా ఇక్కడ నివసించే ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ శాలరీ లో 24% హెచ్ఆర్ఏ పొందుతారు.అదే విధంగా 5 లక్షల నుంచి 50 లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతాలలో ప్రభుత్వ ఉద్యోగులు నివసిస్తే Y వర్గంలోకి వస్తారు . ఇక వీరికి 16% హెచ్ఆర్ఏ వస్తుంది. ఇక Z కేటగిరీలో 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలు ఉంటాయి. ఇక్కడ నివసించే ఉద్యోగులకు 8% హెచ్ఆర్ఏ వర్తిస్తుంది.
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలన వార్త హల్చల్ చేస్తోంది. గత ఐదేళ్లుగా…
Lunar Eclipse : 2026 సంవత్సరం మార్చి 3న సంభవించనున్న చంద్రగ్రహణం భక్తులకు, జ్యోతిష్య విశ్వాసాలను అనుసరించే వారికి ప్రత్యేక…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి సాధించిన ఓటు…
Holi Festival : అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలసి సంతోషంగా జీవించాలనే ఐక్యతా భావాన్ని పంచే రంగుల పండుగ హోలీ…
BR Naidu Video : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు కర్మ సిద్ధాంతం చుట్టూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.…
Revanth Reddy : తెలంగాణ Telangana లో పరిపాలన వేగం పెంచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Cm Revanth reddy…
Bangalore : కర్ణాటక రాజధాని బెంగళూరులో సంచలనానికి దారి తీసిన హత్యా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టెలివిజన్ రంగానికి…
Successful Farmer : చాలా మంది యువత ఉద్యోగాల కోసం మహానగరాల వైపు పరుగులు తీస్తుంటారు. స్థిరమైన జీతం, సౌకర్యవంతమైన…
IRCTC Agent : ఇంట్లో ఖాళీగా ఉంటూ అదనపు ఆదాయం సంపాదించాలని భావిస్తున్నారా? లేక తక్కువ పెట్టుబడితో పార్ట్ టైమ్…
LIC Bima Sakhi : స్వయంగా సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకునే మహిళల కోసం భారత ప్రభుత్వ రంగ బీమా…
Farmers : తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఇక పై పంట పొలాల్లో పురుగుమందుల పిచికారీ…
Lunar Eclipse : మార్చి 3వ (ఈరోజు) తేదీన అరుదైన చంద్రగ్రహణం సంభవించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహణం…
This website uses cookies.