Congress : గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్‌ అన్వేషణ… లోక్‌సభ టిక్కెట్ల కోసం పోటాపోటీ..!

Congress : అసెంబ్లి ఎన్నికల్లో అనూహ్య విజయంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. ఈ దిశగా నియోజకవర్గాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. వివిధ దశలలో అభ్యర్థుల వడపోత ప్రక్రియను చేపట్టింది. మరోవైపు మునుపటికి భిన్నంగా ఈసారి పార్టీ టిక్కెట్‌ ఆశించే అభ్యర్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దీంతో ఎంపిక ప్రక్రియ అగ్రనేతలకు సవాల్‌గా మారింది. దీంతో సర్వేలను ప్రామణికంగా తీసుకుంటూనే సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని పార్టీ భావిస్తోంది. ఇంకొకవైపు టికెట్ల కోసం కొందరు ఆశావహులు ఢిల్లి లోనే మకాంవేశారు. తమ శక్తిమేరకు లాబీయింగ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలావుండగా గతవారం ఏఐసీసీ 39 మందితో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి 4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో మహబూబ్‌నగర్‌ (వంశీచంద్‌ రెడ్డి), జహీరాబాద్‌ ( సురేష్‌ షెట్కర్‌), నల్గొండ (కుందూరు రఘువీర్‌రెడ్డి), మహబూబాబాద్‌ (బలరాంనాయక్‌)లకు చోటు లభించింది. రెండో జాబితా కోసం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఒకటి రొం రోజుల్లో సమావేశం కానుంది. మిగతా 13 పార్లమెంట్‌ నియోజక వర్గాలలో అభ్యర్థులను ఖరారు చేయనుంది.

Congress : సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం..

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో సామాజిక న్యాయానికి పార్టీ ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజక వర్గాలకు గాను 5 నియోజక వర్గాలు రిజర్వుడు కాగా, అందులో ఎస్సీలకు 3 (వరంగల్‌, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌), ఎస్టీలకు రెండు (అదిలాబాద్‌, మహబూబాబాద్‌) కేటాయించ బడ్డాయి. మిగతా 12 నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ హైకమాండ్‌ భావిస్తున్నది. కనీసం 4 స్థానాలకు బీసీలకు కేటాయించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. తొలి జాబితాలో బీసీ వర్గానికి చెందిన సురేష్‌ షెట్కార్‌కు చోటు లభించడంతో మరో ముగ్గురికి అవకాశం ఉంది.సికింద్రాబాద్‌ నుంచి బొంతు రామ్మోహన్‌ పేరు ప్రతిపాదనకు వచ్చినప్పటికీ, కొందరు సీనియర్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తుండగా, అదే స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్‌, సునీల్‌రెడ్డి పోటీపడుతున్నారు. అలాగే, మెదక్‌ నుంచి నీలం మధు ముదిరాజ్‌కు టికెట్‌ దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇక మల్కాజిగిరి నుంచి సీనియర్‌ నేత హరివర్ధన్‌ రెడ్డి టిక్కెట్‌ ఆశిస్తుండగా, సినీ నటుడు అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి రేసులో కొచ్చారు. స్క్రీనింగ్‌ కమిటీలో కంచర్ల పేరునే ఫైనల్‌ చేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక నాయకులు మాత్రం హరివర్దన్‌రెడ్డి లేదంటే మైనంపల్లికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

Congress : ఖమ్మం ఎవరికో?

ఖమ్మం ఎంపీ సీటులో అభ్యర్థి ఎంపిక అత్యంత సంక్లిష్టంగా మారింది. పార్టీ ముఖ్యనేతలు తమ వారసులను ఇక్కడి నుంచి బరిలోకి దించాలని అనుకోవడంతో హైకమాండ్‌ ఎటూ తేల్చుకోలేక పోతున్నది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టితోపాటు మంత్రులు పొంగులేటి, తుమ్మల వారసుnలు ఈ స్థానంపై కన్నేశారు. అలాగే, కరీంనగర్‌ బరిలో ప్రవీణ్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చినప్పటికీ, ఇక్కడ వెలిచల రాజేంద్రరావు నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది.ఎస్సీ రిజర్వుడు సీట్లలో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. మూడింటిలో రెండు మాదిగలు, ఒకటికి మాల సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తున్నది. అయితే పెద్దపల్లి టిక్కెట్‌ను గడ్డం వంశీ ఆశిస్తున్నారు. అయితే, స్థానిక ఎమ్మెల్యేలు నలుగురు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో అధిష్టానం అయోమయంలో పడింది. ఇక, నాగర్‌కర్నూల్‌ టికెట్‌ కోసం మల్లు రవి, సంపత్‌కుమార్‌ పోటీపడుతున్నారు. అదే విధంగా వరంగల్‌ టికెట్‌ను మాదిగ సామాజిక వర్గానికే ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

Congress : ఆదివాసీలకే ప్రాధాన్యం

ఎస్టీ రిజర్వుడులో మహబూబాబాద్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరామ్‌ నాయక్‌కు టికెట్‌ ఖరారైంది. ఇక అదిలాబాద్‌లోనూ అదే వర్గానికి అవకాశం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి బలమైన నేతను చేర్చుకునే ఆలోచన కూడా చేస్తున్నారు.

Recent Posts

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…

8 hours ago

High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!

High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…

9 hours ago

Turmerick Milk : వర్షాకాలంలో… పాలల్లో చిటికెడు ఇది కలుపుకొని తాగారంటే… ఇక సమస్యలన్నీటికి చెక్…?

Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…

10 hours ago

AP : ఏపీలో కొత్త వ్యూహాలు.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెంపు ఏ పార్టీకి కలిసొస్తుందో..?

AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…

11 hours ago

YS Jagan : “కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై కేసులు ఎలా పెడతారు ?” పోలీసుల‌పై హైకోర్టు సీరియ‌స్‌

YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…

12 hours ago

Mother : 90 ఏళ్ల త‌ల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకు.. ఆ త‌ల్లి చేసిన ప‌నికి అమ్మా అని ప‌రుగులు..!

Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయ‌న్న దానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌. ఎంతో కష్టపడి, కన్న…

13 hours ago

Samantha Sreeleela : ఒకే ఫ్రేములో కనిపించిన క్యూట్ భామ‌లు.. క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారుగా..! వీడియో

Samantha Sreeleela : అల్లు అర్జున్ న‌టించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్‌తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…

14 hours ago

Manchu Manoj : మంచు విష్ణుతో వివాదం వేళ క‌న్న‌ప్ప‌కి మంచు మ‌నోజ్ రివ్యూ..!

Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…

15 hours ago