Congress : గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్‌ అన్వేషణ… లోక్‌సభ టిక్కెట్ల కోసం పోటాపోటీ..!

Advertisement
Published by
Advertisement

Congress : అసెంబ్లి ఎన్నికల్లో అనూహ్య విజయంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. ఈ దిశగా నియోజకవర్గాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. వివిధ దశలలో అభ్యర్థుల వడపోత ప్రక్రియను చేపట్టింది. మరోవైపు మునుపటికి భిన్నంగా ఈసారి పార్టీ టిక్కెట్‌ ఆశించే అభ్యర్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దీంతో ఎంపిక ప్రక్రియ అగ్రనేతలకు సవాల్‌గా మారింది. దీంతో సర్వేలను ప్రామణికంగా తీసుకుంటూనే సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని పార్టీ భావిస్తోంది. ఇంకొకవైపు టికెట్ల కోసం కొందరు ఆశావహులు ఢిల్లి లోనే మకాంవేశారు. తమ శక్తిమేరకు లాబీయింగ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

ఇదిలావుండగా గతవారం ఏఐసీసీ 39 మందితో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి 4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో మహబూబ్‌నగర్‌ (వంశీచంద్‌ రెడ్డి), జహీరాబాద్‌ ( సురేష్‌ షెట్కర్‌), నల్గొండ (కుందూరు రఘువీర్‌రెడ్డి), మహబూబాబాద్‌ (బలరాంనాయక్‌)లకు చోటు లభించింది. రెండో జాబితా కోసం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఒకటి రొం రోజుల్లో సమావేశం కానుంది. మిగతా 13 పార్లమెంట్‌ నియోజక వర్గాలలో అభ్యర్థులను ఖరారు చేయనుంది.

Advertisement

Congress : సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం..

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో సామాజిక న్యాయానికి పార్టీ ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజక వర్గాలకు గాను 5 నియోజక వర్గాలు రిజర్వుడు కాగా, అందులో ఎస్సీలకు 3 (వరంగల్‌, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌), ఎస్టీలకు రెండు (అదిలాబాద్‌, మహబూబాబాద్‌) కేటాయించ బడ్డాయి. మిగతా 12 నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ హైకమాండ్‌ భావిస్తున్నది. కనీసం 4 స్థానాలకు బీసీలకు కేటాయించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. తొలి జాబితాలో బీసీ వర్గానికి చెందిన సురేష్‌ షెట్కార్‌కు చోటు లభించడంతో మరో ముగ్గురికి అవకాశం ఉంది.సికింద్రాబాద్‌ నుంచి బొంతు రామ్మోహన్‌ పేరు ప్రతిపాదనకు వచ్చినప్పటికీ, కొందరు సీనియర్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తుండగా, అదే స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్‌, సునీల్‌రెడ్డి పోటీపడుతున్నారు. అలాగే, మెదక్‌ నుంచి నీలం మధు ముదిరాజ్‌కు టికెట్‌ దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇక మల్కాజిగిరి నుంచి సీనియర్‌ నేత హరివర్ధన్‌ రెడ్డి టిక్కెట్‌ ఆశిస్తుండగా, సినీ నటుడు అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి రేసులో కొచ్చారు. స్క్రీనింగ్‌ కమిటీలో కంచర్ల పేరునే ఫైనల్‌ చేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక నాయకులు మాత్రం హరివర్దన్‌రెడ్డి లేదంటే మైనంపల్లికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

Congress : ఖమ్మం ఎవరికో?

ఖమ్మం ఎంపీ సీటులో అభ్యర్థి ఎంపిక అత్యంత సంక్లిష్టంగా మారింది. పార్టీ ముఖ్యనేతలు తమ వారసులను ఇక్కడి నుంచి బరిలోకి దించాలని అనుకోవడంతో హైకమాండ్‌ ఎటూ తేల్చుకోలేక పోతున్నది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టితోపాటు మంత్రులు పొంగులేటి, తుమ్మల వారసుnలు ఈ స్థానంపై కన్నేశారు. అలాగే, కరీంనగర్‌ బరిలో ప్రవీణ్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చినప్పటికీ, ఇక్కడ వెలిచల రాజేంద్రరావు నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది.ఎస్సీ రిజర్వుడు సీట్లలో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. మూడింటిలో రెండు మాదిగలు, ఒకటికి మాల సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తున్నది. అయితే పెద్దపల్లి టిక్కెట్‌ను గడ్డం వంశీ ఆశిస్తున్నారు. అయితే, స్థానిక ఎమ్మెల్యేలు నలుగురు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో అధిష్టానం అయోమయంలో పడింది. ఇక, నాగర్‌కర్నూల్‌ టికెట్‌ కోసం మల్లు రవి, సంపత్‌కుమార్‌ పోటీపడుతున్నారు. అదే విధంగా వరంగల్‌ టికెట్‌ను మాదిగ సామాజిక వర్గానికే ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

Congress : ఆదివాసీలకే ప్రాధాన్యం

ఎస్టీ రిజర్వుడులో మహబూబాబాద్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరామ్‌ నాయక్‌కు టికెట్‌ ఖరారైంది. ఇక అదిలాబాద్‌లోనూ అదే వర్గానికి అవకాశం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి బలమైన నేతను చేర్చుకునే ఆలోచన కూడా చేస్తున్నారు.

Advertisement

Recent Posts

Viral Video : రోడ్డుపై పడ్డ ఆహారమే..ఆమెకు పరమాన్నం ..వైరల్ గా మారిన వీడియో

Viral Video : ఉప్పల్‌ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ చోటుచేసుకున్న ఒక సంఘటన అన్నం విలువను, ఆకలి తీవ్రతను సమాజానికి…

24 minutes ago

YS Jagan : జగన్ వేసిన భయంకరమయిన ట్రాప్ లో ఇరుక్కున్న టీడీపీ

YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒకవైపు…

1 hour ago

Vijay wife Sangeetha : వరుస షాకులతో విజయ్ కి నిద్ర లేకుండా చేస్తున్న భార్య

Vijay wife Sangeetha : తమిళ వెండితెర ‘దళపతి’, ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం (TVK) అధినేతగా రాజకీయాల్లో బిజీగా…

2 hours ago

Womens Day 2026 : మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

Womens Day 2026 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా మరో చారిత్రాత్మక నిర్ణయం…

3 hours ago

Rythu Bharosa : రైతు భరోసా సమాచారం సీఎం రేవంత్ కే తెలియదట ..ఇదెక్కడి విడ్డురం !!

Rythu Bharosa : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రైతు…

4 hours ago

Woman Farmer Success Story : నెట్ హౌస్‌తో అద్భుతం: కొత్తిమీర సాగుతో రూ. 70 వేలు సంపాదిస్తున్న మహిళా రైతు!

Woman Farmer Success Story  : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…

7 hours ago

Gold and silver Price Today 2026 March 7 : పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన గోల్డ్ రేట్స్.. ఈరోజు ధరలివే

Gold and silver Price Today 2026 March 7 : బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన…

7 hours ago

Karthika Deepam 2 Today 07 March 2026 Episode : దీప ప్రాణాలకు ముప్పు? జ్యోత్స్న ప్లాన్ అట్టర్ ఫ్లాప్ – సుమిత్ర ‘చివరి’ మాట!

Karthika Deepam 2 Today 07 March 2026 Episode : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్…

8 hours ago

Tears-Sweet : కన్నీళ్లు – చెమట .. రెండూ ఉప్పే ఎందుకు ఉంటాయి ? .. మన శరీరంలోని అద్భుత రసాయన రహస్యం ఇదేనా..!

Tears-Sweet : మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరిగినా లేదా శారీరకంగా కష్టపడినా చెమట…

9 hours ago

Tea : తిన్న వెంటనే టీ తాగుతున్నారా ?.. అలా తాగడం వల్ల మీ శరీరంలో కలిగే ఆ మార్పులేంటో తెలుసా ..!

Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…

10 hours ago

Chanakya Niti : ఎంత సంపాదించినా డబ్బు ఆదా చేయలేకపోతున్నారా ? .. డబ్బు నిలవాలంటే ఈ విధంగా చేయండి ..!

Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…

11 hours ago

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…

18 hours ago