Categories: NationalNews

పిల్లలపై కరోనా దారుణమైన ప్రభావం చూపించింది.. నిజాలు బయటపెట్టిన యూనిసెఫ్

corona : ప్రపంచంపై కోవిడ్19 మహమ్మారి చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఎన్నో వ్యవస్థలను కుప్పకూల్చిన కరోనా వైరస్ ప్రభావం ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే కొవిడ్‌ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు, చిన్న పిల్లల ఆరోగ్య, మానసిక, సామాజిక వ్యవస్థలపైన కూడా దారుణమైన ప్రభావం చూపించిందని ‘యునిసెఫ్‌’ తన తాజా నివేదికలో వెల్లడించింది.

ఈ కారణంగా భారత్‌లో 5 కోట్ల మందికిపైగా పిల్లలు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని నివేదించింది. కరోనా ప్రభావంతో పిల్లలు అధిక ఒత్తిడికి లోనయ్యారని యూనిసెఫ్‌ చెబుతోంది. ‘‘ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంరక్షకులు.. పిల్లలకు మానసికంగా, సామాజికంగా సహకారం అందించాలి. బాలలు ఒత్తిడి, భయం, ఆవేదనను తట్టుకునేలా ముమ్మరంగా చర్యలు చేపట్టాలి.

గత ఏడాది కాలంగా పిల్లలపై హింసాత్మక ఘటనలు పెరగటం గుర్తించాలని అంటోంది యునిసెఫ్. పిల్లలు మానసికంగా ఒత్తిడికి లోనైనప్పుడు ఎలా స్పందించాలన్న విషయంపై..పలు విభాగాలకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది యునిసెఫ్.. చైల్డ్‌లైన్, ప్రభుత్వ అధికారులు, జిల్లాల్లో బాలల సంరక్షణ విభాగాలు, పిల్లల రక్షణ సంస్థల్లోని 8వేలకు పైగా సిబ్బంది ఈ రకమైన శిక్షణ పొందారు.

కరోనా సమయంలో ఇచ్చిన ఈ శిక్షణ ద్వారా పిల్లలకు కౌన్సిలింగ్ జరగాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురు పిల్లల్లో ఒకరు.. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా మానసిక అనారోగ్యం బారిన పడినట్లు తేలింది. ఆ సమయంలో 13 కోట్ల మందికిపైగా బాలలు ఇంటికే పరిమితమయ్యారు. మరోపక్క కొవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రపంచంలోని 93 శాతం దేశాల్లో మానసిక వైద్య సేవలు నిలిచిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

కరోనావైరస్‌తో చిన్నారులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకాలేదన్నది వాస్తవం. వారిలో మరణాల సంఖ్య కూడా చాలా తక్కువ. కానీ కోవిడ్‌ కారణంగా అత్యధిక సంఖ్యలో బాధితులుగా మారింది మాత్రం చిన్నపిల్లలే..ఎగిరే పక్షికి రెక్కలు తెగిన చందంగా లాక్‌డౌన్ కాలంలో ఇళ్లలోనే బందీ అయ్యారు. పెద్దవారి వేధింపులు, వారి బాగోగుల‌ను పట్టించుకోలేని స్థితి కారణంగా మానసిక సమస్యలు చిన్నారులను వెంటాడాయి. భావితరాలను కోవిడ్ మహమ్మారి కోలుకోలేని దెబ్బతీసిందని నిపుణులు అంటున్నారు.

స్కూళ్లు మూసివేయడంతో చిన్నారుల చదువులు కుంటుపడ్డాయి. అయితే స్కూళ్లను కేవలం చదువుకునే ప్రదేశాలుగానే చూడలేం. సహజసిద్ధంగా పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి అవి కేంద్రాలుగా ఉంటాయి. కుటుంబాలలోని ఇబ్బందుల కార‌ణంగా.. వారు ఎదుర్కొనే అనేక మానసిక సమస్యల నుంచి బైటపడటానికి స్కూళ్లు ఉపయోగపడతాయి. స్కూళ్లను మూసేయడం ద్వారా పిల్లల జీవితాలనే మూసేయడం జరిగింది. ఒంటరితనం, నిద్రలేమి సహా పిల్లలపై అనేక దుష్ప్రభావాలకు కరోనా మహమ్మారి కారణమైంది.

Recent Posts

Wife : అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్తనే చంపిన భార్య..!

Wife  : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…

6 hours ago

AP Farmers : ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన‌ మంత్రి అచ్చెన్నాయుడు..!

AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…

7 hours ago

Pawan Kalyan : బాలినేని కి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లేనా..?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…

8 hours ago

Roja : బాలకృష్ణ కు అది ఎక్కువ అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు.. వీడియో !

Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…

9 hours ago

KTR : 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్..!

KTR  : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…

10 hours ago

Mallikarjun Kharge : ఎమ్మెల్యేలకు మల్లికార్జున ఖర్గే వార్నింగ్..!

Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…

11 hours ago

Insta Reel : ఇన్‌స్టాగ్రామ్ రీల్ తెచ్చిన తంటా.. వరంగల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. వీడియో

Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…

12 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌కి ప్ర‌భాస్ సాయం.. వార్త‌ల‌పై అస‌లు క్లారిటీ ఇదే..!

Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…

13 hours ago