Chandrababu Naidu : వైజాగ్ బ్రోకర్ విజయసాయిరెడ్డి… వామ్మో చంద్రబాబుకు ఇంత ఆవేశమా..?

Chandrababu Naidu : విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం ఇప్పడు ఆంధ్రాలో హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాసి అఖిలపక్షముతో వచ్చి కలుస్తాము , అవకాశం ఇవ్వండి అంటూ అడగటం జరిగింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రమైన విమర్శలు చేశాడు. ఏ1 ఏ2 విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి పెట్టారు. లేఖల పేరుతో మోసం చేయటం కాదు, జగన్ కి చిత్తశుద్ది ఉంటే రాజీనామా చేయాలి. జగన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, వైజాగ్ బ్రోకర్ విజయసాయిరెడ్డి కలిసి తమ స్వప్రయోజనాల కోసం విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టారు.

vizag broker vijayasaireddy is chandrababu so angry

విధ్వంసానికి మారుపేరైన వైసీపీ నేతలు మొదట ప్రజాధాని అమరావతిపై భస్మాసుర హస్తం మోపారు, ఇప్పుడు విశాఖపట్నాన్ని నాశనం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పై ప్రధానికి లేఖల పేరుతో దొంగనాటకాలాడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ఏ1, ఏ2 ప్రయత్నిస్తున్నారు. జగన్ అబద్దాల కోరు, నెల రోజుల క్రితం కేంద్రానికి లేఖరాసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు మీ దొంగనాటకాల్ని కేంద్రం బట్టబయలు చేయటంతో, ప్రజలకు మీ నిజస్వరూపం తెలియడంతో ఎన్నికల నేపద్యంలో ఇప్పుడు మరో లేఖ రాసి మోసం చేయాలని చూస్తున్నారు.

Chandrababu Naidu : అసలు ఈ లేఖల వల్ల ఉపయోగం ఏంటి?

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కు కోసం ప్రభుత్వంతో ఎటువంటి షరతులు లేకుండా కలసి పనిచేయడానికి సిద్దమని పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ కోసం చేసిన దీక్షకు సంఘీభావం తెలిపినరోజు మేం స్పష్టంగా చెప్పాం. జగన్ లేఖ రాసేబదులు ప్రధానితో నేరుగా పోన్లో ఎందుకు మాట్లాడటం లేదు? మీ కేసుల మాఫీ కోసం ఇచ్చిన ప్రాధాన్యత తెలుగు ప్రజల ఆత్మగౌరవమైన విశాఖ ఉక్కుకి ఇవ్వరా? అంటూ బాబు నిప్పులు చెరిగాడు.

జనవరి 27 నే స్టీల్ ప్లాంట్ పై నిర్ణయం తీసుకున్నామని ఈవిషయం జగన్ ప్రభుత్వానికి తెలిసి కూడా దాచిపెట్టిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్రకటించటం మీ దివాలుకోరుతనానికి నిదర్శనం కాదా? ముఖ్యమంత్రి ప్రమేయం, సహకారంతోనే పోస్కోతో ఒప్పందం జరిగింది వాస్తవం. పిబ్రవరి 6 న ప్రధానికి మెదటి లేఖ రాశావు, అప్పటి నుంచి నెల రోజులలో జగన్ రెడ్డి, 28 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం కాకుండా అడ్డుకునేందుకు ఏం చేశారు?

Chandrababu Naidu : ఈ నెల రోజుల్లో కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి చేశారు?

మీ కేసులపై ఉన్న శ్రద్దలో కనీసం ఒక్క శాతమైన స్టీల్ ప్లాంట్ పై ఉందా? అధికార పార్టీ నేతలు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. వైసీపీ ఎంపీల, ఏపీ ప్రభుత్వ వైఫల్యానికి జగన్ రెడ్డి నైతిక బాద్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. కళ్ల బొల్లి మాటలతో ప్రజలను మోసం చేయటం కాకుండా రాజీనామా చేసి డిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్రమంత్రులను కలవాలి. జగన్ రెడ్డి నియంతలా ప్రవర్తించడం మానేసి తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటకు వచ్చి నిరసనకారులతో భుజం భుజం కలిపి నిలబడాలి.

జగన్ రెడ్డి తన కేసుల కోసం తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు.విశాఖ ప్రజలు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి చేస్తున్న పోరాటానికి భయపడి ప్రజలను మోసం చేయడానికి ఇప్పుడు మరో లేఖ రాశాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను వైసీపీ అవమానించింది. వైసీపీకి తెలుగు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. ముఖ్యమంత్రి రాజీనామా చేసి విశాఖపట్నం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంటూ చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశాడు . మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Recent Posts

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

34 minutes ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

2 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

3 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

4 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

5 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

6 hours ago

Kiwi fruit | ఆరోగ్యానికి వరంగా కివి పండు.. ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…

7 hours ago

Ginger | ఇంటింటి వంటకాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. అల్లం టీ, డీటాక్స్ వాటర్ తో ఫలితాలు ఖచ్చితం!

Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్‌ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…

8 hours ago