
Electorol Bond : ఎలక్టోరల్ బాండ్స్ ( Electorol bonds ) అంటే ఏంటి... సుప్రీం కోర్టు దీనిని ఎందుకు రద్దు చేసింది...!
Electorol Bond : అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి..?దానిని సుప్రీంకోర్టు ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకుంది..?ఎలక్టోరల్ బాండ్స్ వెనుక దేశానికి జరుగుతున్నటువంటి నష్టం ఏంటిి లాభం ఏంటి అనే సందేహాలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి.అయితే దీని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… అయితే ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఒక ప్రాంసరీ నోట్ లాంటివి అని చెప్పాలి. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అందుబాటులో రాకముందు విషయం గురించి మాట్లాడుకుంటే…ఒక రాజకీయ పార్టీకి ఒక బిజినెస్ మాన్ లేదా సామాన్యులు డబ్బులు ఇస్తారు. ఇలాంటి లెక్కలు అన్నీ కూడా లిమిట్ ప్రకారం ఉండాలి. ఇచ్చిన తర్వాత ప్రతి దానికి కచ్చితంగా ఒక లెక్క ఉండాలి. అలాగే ఎంతమంది, ఎంతవరకు ,ఎంత ఇవ్వాలి అని చాలా రకాల రూల్స్ ఉండేవి.
ఈ క్రమంలోనే రాజకీయ నాయకులు ఒక వంద రూపాయలు తీసుకుంటే దానిలో 5 రూపాయలు మనకోసం వినియోగించి మిగిలిన 95 రూపాయలను వారి వెనుక వేసుకుంటారని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ నాయకులు చేసే రాజకీయాలలో ఇది ఒక పద్ధతి అని చెప్పాలి. ఇక ఇది కాకుండా మరో పద్ధతి ఏమైనా ఉందా అంటే…ఏదైనా పెద్ద కార్పొరేట్ కంపెనీల నుండి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఏదైనా మంచి చేయడం వంటివి చేస్తుంటారు. అందుకే చాలా సందర్భాలలో కార్పొరేట్ కంపెనీలు పార్టీలకు ఫండ్స్ రూపం లో మనీ ఇస్తూ ఉంటాయి. ఇలా కార్పొరేట్ కంపెనీలు పార్టీలకు ఇస్తున్నటువంటి క్రమంలో లిమిట్ పెట్టడం జరిగింది. దీంతో ఈ లిమిట్ ను కనిపించకుండా చేసే ఉద్దేశంతో ఎలక్టోరల్ బాండ్స్ అనే కొత్త అంశాన్ని రాజకీయ నాయకులు తెర మీదకు తీసుకొచ్చారు.
అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఎస్బిఐ బ్యాంక్స్ లో దొరుకుతాయి. ఇక ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ ఉపయోగించి ఒక పార్టీకి ఫండ్స్ రూపంలో ఇస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఇచ్చే వారి వివరాలను బయట పెట్టకుండా ఒక చట్టం రూపొందించుకున్నారు. అంటే ఆ పార్టీకి ఎవరు ఎంత ఇస్తున్నారు అనే విషయాలను అస్సలు బయట పెట్టరు అన్నమాట. దీంతో పెద్ద ఎత్తున దేశంలో బ్లాక్ మనీ చేతులు మారుతున్నాయని తెలుస్తోంది.ఇక ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న కొందరు ఇది కర్రెక్ట్ పద్దతి కాదని కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీంతో ఈ కేసు పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇది సరైన పద్ధతి కాదంటూ తీర్పును వెలువరించింది. అంతేకాక ఎవరెవరు ఏమేమి తీసుకున్నారు ఎంత ఇచ్చారు అనే విషయాలను కూడా బయట పెట్టాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అందుకే సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రాజకీయ నాయకులు దీనికి ప్రత్యామ్నాయంగా మరో పద్ధతిని ఎంచుకుంటారని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాత్రం ఎవరు పెద్దగా పట్టించుకోరు, పాటించరని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులకు కావాల్సింది డబ్బు. ఆ డబ్బు కోసం ఇలాంటి కొత్త చట్టాలను ఎన్నైనా తీసుకొస్తారు అంటూ కొందరు విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.