
Electorol Bond : ఎలక్టోరల్ బాండ్స్ ( Electorol bonds ) అంటే ఏంటి... సుప్రీం కోర్టు దీనిని ఎందుకు రద్దు చేసింది...!
Electorol Bond : అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి..?దానిని సుప్రీంకోర్టు ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకుంది..?ఎలక్టోరల్ బాండ్స్ వెనుక దేశానికి జరుగుతున్నటువంటి నష్టం ఏంటిి లాభం ఏంటి అనే సందేహాలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి.అయితే దీని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… అయితే ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఒక ప్రాంసరీ నోట్ లాంటివి అని చెప్పాలి. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అందుబాటులో రాకముందు విషయం గురించి మాట్లాడుకుంటే…ఒక రాజకీయ పార్టీకి ఒక బిజినెస్ మాన్ లేదా సామాన్యులు డబ్బులు ఇస్తారు. ఇలాంటి లెక్కలు అన్నీ కూడా లిమిట్ ప్రకారం ఉండాలి. ఇచ్చిన తర్వాత ప్రతి దానికి కచ్చితంగా ఒక లెక్క ఉండాలి. అలాగే ఎంతమంది, ఎంతవరకు ,ఎంత ఇవ్వాలి అని చాలా రకాల రూల్స్ ఉండేవి.
ఈ క్రమంలోనే రాజకీయ నాయకులు ఒక వంద రూపాయలు తీసుకుంటే దానిలో 5 రూపాయలు మనకోసం వినియోగించి మిగిలిన 95 రూపాయలను వారి వెనుక వేసుకుంటారని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ నాయకులు చేసే రాజకీయాలలో ఇది ఒక పద్ధతి అని చెప్పాలి. ఇక ఇది కాకుండా మరో పద్ధతి ఏమైనా ఉందా అంటే…ఏదైనా పెద్ద కార్పొరేట్ కంపెనీల నుండి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఏదైనా మంచి చేయడం వంటివి చేస్తుంటారు. అందుకే చాలా సందర్భాలలో కార్పొరేట్ కంపెనీలు పార్టీలకు ఫండ్స్ రూపం లో మనీ ఇస్తూ ఉంటాయి. ఇలా కార్పొరేట్ కంపెనీలు పార్టీలకు ఇస్తున్నటువంటి క్రమంలో లిమిట్ పెట్టడం జరిగింది. దీంతో ఈ లిమిట్ ను కనిపించకుండా చేసే ఉద్దేశంతో ఎలక్టోరల్ బాండ్స్ అనే కొత్త అంశాన్ని రాజకీయ నాయకులు తెర మీదకు తీసుకొచ్చారు.
అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఎస్బిఐ బ్యాంక్స్ లో దొరుకుతాయి. ఇక ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ ఉపయోగించి ఒక పార్టీకి ఫండ్స్ రూపంలో ఇస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఇచ్చే వారి వివరాలను బయట పెట్టకుండా ఒక చట్టం రూపొందించుకున్నారు. అంటే ఆ పార్టీకి ఎవరు ఎంత ఇస్తున్నారు అనే విషయాలను అస్సలు బయట పెట్టరు అన్నమాట. దీంతో పెద్ద ఎత్తున దేశంలో బ్లాక్ మనీ చేతులు మారుతున్నాయని తెలుస్తోంది.ఇక ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న కొందరు ఇది కర్రెక్ట్ పద్దతి కాదని కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీంతో ఈ కేసు పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇది సరైన పద్ధతి కాదంటూ తీర్పును వెలువరించింది. అంతేకాక ఎవరెవరు ఏమేమి తీసుకున్నారు ఎంత ఇచ్చారు అనే విషయాలను కూడా బయట పెట్టాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అందుకే సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రాజకీయ నాయకులు దీనికి ప్రత్యామ్నాయంగా మరో పద్ధతిని ఎంచుకుంటారని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాత్రం ఎవరు పెద్దగా పట్టించుకోరు, పాటించరని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులకు కావాల్సింది డబ్బు. ఆ డబ్బు కోసం ఇలాంటి కొత్త చట్టాలను ఎన్నైనా తీసుకొస్తారు అంటూ కొందరు విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
Indiramma Illu : తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయడానికి చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ‘రైతు భరోసా’…
Chicken skin : నాన్వెజ్ ప్రియుల్లో చాలామంది చికెన్ను చర్మంతో కలిపి తినడానికి ఆసక్తి చూపుతారు. ప్రత్యేకంగా ఫ్రైడ్ లేదా…
Coconut Water : వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొబ్బరి నీళ్లు ఉత్తమమైన సహజ పానీయం. ఇవి దాహాన్ని…
Summer Diet : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం అవసరం అవుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల…
Tamil Nadu Elections : తమిళనాడులో ఇప్పుడు ఎన్నికల వేడి మామూలుగా లేదు. అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని డీఎంకే, ఏఐడీఎంకే…
Vijay Deverakonda : సాధారణంగా టయర్ 2 హీరోలకు వరుసగా కొన్ని ఫ్లాపులు పడితే, నిర్మాతలు బడ్జెట్ తగ్గించేసి రిస్క్…
Telangana : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే, కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత…
Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో…
Modi : రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ…
Gold : భారతీయుల జీవితంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు అది సంప్రదాయం, భద్రత, భవిష్యత్తుకు సంకేతం.…
This website uses cookies.