Categories: ExclusiveNationalNews

Jamili Elections : వస్తే ఎన్నికలు.. జమిలిపై రాష్ట్రపతికి కోవింద్‌ కమిటీ నివేదిక..!

Advertisement
Published by
Advertisement

Jamili Elections : దేశంలో పార్లమెంట్‌ నుంచి పంచాయతీ వరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు రూపొందించిన 18,626 పేజీల నివేదకను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గురువారం అందజేశారు. ఇందులో అనేక ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. రెండు దశల్లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఏకకాల ఎన్నికల పునరుద్ధరణ కోసం లోక్‌సభతోపాటే రాష్ట్రాల అసెంబ్లిలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఒకవేళ ఎవరికీ స్పష్టమైన మెజారిటీ లభించక హంగ్‌ పరిస్థితులు తలెత్తితే లేదా అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులు అనివార్యమైతే కొత్త సభను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం మిగతా కాలానికి ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. లోక్‌సభ, అసెంబ్లి ఎన్నికలు ముగిశాక, వంద రోజుల వ్యవధిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహంచాలని ఈ కమిటీ తన సిఫార్సులలో పేర్కొంది. తొలిసారి జరిగే జమిలి ఎన్నికలకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లిల కాల పరిమితి లోక్‌సభ ఎన్నికల తేదీ నాటికే ముగుస్తుందని రిపోర్టులో తెలిపారు. జమిలి నిర్వహణపై కమిటీ ఏకాభిప్రాయాన్ని వ్యక్తంచేసిందని, 2029 నుంచే జమిలీ ఎన్నికలు నిర్వ#హంచాలని రిపోర్టులో కోరారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఏకకాలంలో ఎన్నికలు జరిగిన విధానాన్ని కమిటీ ప్రస్తావించింది. ఏకకాల ఎన్నికల వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపింది. ఏటేటా ఎన్నికలు వల్ల ప్రభుత్వం, వ్యాపారాలు, కార్మికులు, కోర్టులు, రాజకీయ పార్టీలు, పౌర సమాజంతోపాటు వివిధ భాగస్వామ్య పక్షాలపై గణనీయమైన భారం పడుతోందని తెలిపింది. ఏకకాల ఎన్నికలతో అభివృద్ధితోపాటు, సామాజిక ఐక్యతకు బాటలు పడతాయని పేర్కొంది. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంతోపాటు భారత పౌరుల ఆకాంక్షలను సాకారం చేయడంలో ఈ విధానం దోహదపడుతుందని కోవింద్‌ కమిటీ అభిప్రాయపడింది.

Advertisement

– జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు ప్లానింగ్‌ ఉండాలని, ఎన్నికలకు అవసరమైన ఎక్విప్మెంట్స్‌, సిబ్బంది, భద్రతా బలగాలను మో#హరించాల్సి ఉంటుందని రిపోర్టులో పేర్కొన్నారు. సింగిల్‌ ఎన్నికల రోల్‌ను ఈసీ తయారు చేయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల అధికారులతో కలిసి లోక్‌సభ, అసెంబ్లి, స్థానిక సంస్థల ఎన్నికలకు చెందిన ఓటరు ఐడీ కార్డులను రూపొందించాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికల నిర్వ#హణ ద్వారా పారదర్శకత పెరుగుతుందని కోవింద్‌ ప్యానెల్‌ రిపోర్టులో చెప్పింది. వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ ద్వారా భారతీయుల ఆశలు నిజం అవుతాయని పేర్కొన్నారు.
– ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానం అమల్లోకి తేవాలంటే ఆర్టికల్‌ 83 (పార్లమెంట్‌ కాలవ్యవధి), ఆర్టికల్‌ 172 (అసెంబ్లిdల గడువు)కి రాజ్యాంగ సవరణ చేపట్టాలి. ఇందుకోసం రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. మున్సిపాలిటీ, పంచాయతీలకు ఏకకాల ఎన్నికల నిర్వహణ కోసం ఆర్టికల్‌ 324ఎని సవరించాలి. అలాగే ఓటర్ల జాబితా, గుర్తింపు కార్డుల కోసం ఆర్టికల్‌ 325లో మార్పులు చేయాల్సి ఉంది. ఇందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం తప్పనిసరి.

Advertisement

1) 2029 నుంచి లోక్‌సభ, అసెంబ్లిdలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సరవరణలు చేయాలి
2) పదేపదే మోడల్‌ ప్రవర్తనా నియమావళిని వర్తింపజేస్తున్నందున, ఆర్థిక వృద్ధిపై దాని ప్రతికూల ప్రభావం కారణంగా ఏర్పడే పాలనాపరమైన అంతరాయాలను జమిలి ద్వారా తగ్గించవచ్చు.
3) రెండు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలి. మొదటి దశలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లిdలకు. ఆ తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలి.
4) వచ్చే ఐదేళ్లలో శాసనసభల నిబంధనలను మూడు దశల్లో సవరించాలి. హంగ్‌ లేదా అవిశ్వాస తీర్మానం సందర్భాలలో, మిగతా ఐదేళ్ల పదవీకాలానికి తాజాగా ఎన్నికలు నిర్వహించొచ్చు.
5) కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థలు ఇలా భారత ప్రభుత్వంలోని మూడంచెల ఎన్నికలకు ఓటర్ల హక్కుల్ని కాపాడేందుకు ఒకే ఓటర్ల జాబితా, ఒకే ఓటర్ల ఫొటో గుర్తింపు కార్డు ఉండాలి.

Jamili Elections  191 రోజుల అధ్యయనం

కోవింద్‌ కమిటీ జమిలి ప్రాధాన్యత, నిర్వహణ సాధ్యాసాధ్యాలపై విసృత అధ్యయనం జరిపింది. గతేడాది సెప్టెంబర్‌ 2న కమిటీ ఏర్పాటైంది. వివిధ రాజకీయ పార్టీలు, నిపుణులతో భేటీలు, సంప్రదింపులు జరిపింది. వివిధ వాటా దారుల అభిప్రాయాలను సేకరించింది. మొత్తంగా 191 రోజులు జమిలిపై కమిటీ పనిచేసింది. ఈ ప్యానల్‌లో హోంమంత్రి అమిత్‌షా, రాజ్యసభలో మాజీ విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌, మాజీ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ ఎన్‌.సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే తదితరులు సభ్యులుగా ఉన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ మేఘవాల్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నారు. సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభానికి ముందే ఏకకాల ఎన్నికలను సిఫార్సు చేయడానికి నియమించబడిన ప్యానల్‌ ఇందుకు అనుకూలంగా ఉన్నందున అధ్యయనం పేరిట జరిపే కసరత్తు నామ మాత్రమేనని పేర్కొంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి ప్యానల్‌ నుంచి వైదొలగారు.

Jamili Elections  ఎవరెవరు వ్యతిరేకించారు?

సూచనలు, సలహాలు స్వీకరించే క్రమంలో రామ్‌నాథ్‌ కమిటీ పలువురు నిపుణులను సంప్రదించింది. ఈ సందర్భంలో ముగ్గురు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ జమిలిని తీవ్రంగా వ్యతిరేకించారు. రిటైర్డ్‌ హైకోర్టు సీజేలలో తొమ్మిది మంది స్వాగతించగా, ముగ్గురు విభేదించారు. వ్యతిరేకించిన వారిలో జస్టిస్‌ అజిత్‌ ప్రకాష్‌ షా (ఢిల్లిd-హైకోర్టు), గిరీశ్‌ చంద్ర గుప్తా (కలకత్తా హైకోర్టు), సంజీవ్‌ బెనర్జీ (మద్రాస్‌ హైకోర్టు) ఉన్నారు. వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యక్తీకరణను నిరోధించే ప్రమాదం ఉందని, వక్రీకరించిన ఓటింగ్‌ విధానాలు రాష్ట్రస్థాయి రాజకీయాలను మార్చివేసే ప్రమాదం ఉందని జస్టిస్‌ షా పేర్కొన్నారు. ఏకకాల ఎన్నికలు ప్రజాస్వామ్య సూత్రాలకు అనుకూలమైనవి కావని జస్టిస్‌ గుప్తా అభిప్రాయపడ్డారు. ఇవి దేశ సమాఖ్య వ్యవస్థని దెబ్బతీస్తాయని జస్టిస్‌ బెనర్జీ పేర్కొన్నారు. అయితే కమిటీతో సమావేశమైన నలుగురు మాజీ భారత ప్రధాన న్యాయమూర్తులు (దీపక్‌ మిశ్రా, రంజన్‌ గొగోయ్‌, ఎస్‌ఏ బొబ్డే, యూయు లలిత్‌) ఈ ఆలోచనకు మద్దతు పలికారు. మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్ల విషయానికొస్తే నలుగురు జమిలికి జై కొట్టారు. మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్లలో ఏడుగురు ఆమోదముద్ర వేశారు. మార్చి9తో పదవీకాలం ముగిసిన తమిళనాడు ఎన్నికల కమిషనర్‌ పళనికుమార్‌ మాత్రం అభ్యంతరం తెలిపారు. జమిలి సమయంలో స్థానిక అంశాల కంటే జాతీయ అంశాలే విస్తృత ప్రాధాన్యం కలిగివుంటాయని, ఇది ప్రాంతీయ రాజకీయ పార్టీలకు అన్యాయం చేస్తుందన్నది ఆయన వాదన. అలాగే, ఎన్నికల సిబ్బంది కొరత కూడా మరొక తీవ్ర సమస్య అవుతుందని చెప్పారు.

Advertisement

Recent Posts

Ali Khamenei killed | ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హతం: అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ప్రతీకార ప్రతిజ్ఞ

Ali Khamenei killed | అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్…

10 minutes ago

Gold and Silver Rates 1st March 2026 : ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్.. రాత్రికి రాత్రే భగ్గుమన్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు భారీ షాక్

Gold and Silver Rates 1st March 2026 : పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్‌లో పసిడి ప్రియులకు ఊహించని షాక్…

43 minutes ago

Pepper Chicken Fry : సండే స్పెషల్ .. పెప్పర్ చికెన్ ఫ్రై .. ఇలా కొత్తగా ట్రై చేసి తింటే .. మీరు ఎప్పటికీ మర్చిపోలేరు..!

Pepper Chicken Fry : సాధారణంగా చాలా మంది వారంలో కనీసం ఒకటి రెండు సార్లు అయినా చికెన్ వంటకాలు…

2 hours ago

Bitter Gourd : చేదుగా ఉందని కాకరకాయ తినడం లేదా.. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మిస్సయినట్లే.. !

Bitter Gourd :  మన వంటింటిలో తరచుగా కనిపించే కూరగాయలలో కాకరకాయకు ప్రత్యేక స్థానం ఉంది. చేదు రుచితో ఉన్నప్పటికీ,…

3 hours ago

Good luck : అసలు అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుంది? .. సంపద వచ్చే ముందు ఇంట్లో కనిపించే శుభ సంకేతాలు ఇవేనా .. !

Good luck : అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరించుతుందో ముందుగానే చెప్పడం కష్టం. చాలామంది జీవితంలో ఒక్కసారైనా అదృష్టం…

4 hours ago

Miryalaguda : మిర్యాలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

Miryalaguda : ప్రభుత్వ ఉన్నత పాఠశాల మిర్యాలగూడలో వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను నేడు ఘనంగా…

13 hours ago

YS Jagan : కాపు ఓట్ల కోసం పెద్ద స్కెచ్ వేసిన జగన్ కి చావు దెబ్బ

YS Jagan : ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో…

14 hours ago

Nara Lokesh : CMగా లోకేష్ పట్టాభిషేకం , పవన్ కి ఇబ్బంది లేకుండా బంపర్ ఆఫర్.. కానీ..!

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

15 hours ago

Kalvakuntla Kavitha : కంట్లో నీళ్ళతో కెసిఆర్ ఇంటికి బయలుదేరిన కల్వకుంట్ల కవిత !

Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ లభించడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు…

16 hours ago

Athadu Movie Re Release : అతడు రీరిలీజ్ ఆపండి .. రగిలిపోతున్న మహేష్ ఫ్యాన్స్

Athadu Movie Re Release : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. పాత…

17 hours ago

Anganwadi : అంగన్‌వాడీ చిన్నారులకు గుడ్‌న్యూస్ .. ఇక పై వారి కోసం సరికొత్త పథకం అమలు ..!

Anganwadi : తెలంగాణలో అంగన్‌వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…

18 hours ago

HPV vaccine : హెచ్‌పీవీ టీకాను ప్రారంభించిన ప్రధాని మోడీ .. హెచ్‌పివి టీకా అంటే ఏమిటి .. అది ఏవ‌రికి ప్ర‌యోజ‌నం ..?

HPV vaccine : బాలికల్లో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…

19 hours ago