Crime News : అల్లుడితో లేచిపోయిన అత్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 Authored By kranthi | The Telugu News | Updated on :3 January 2023,8:30 am

Crime News : అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు.. ఇలా పేరు ఏదైనా ఈ జనరేషన్ లో ఇవి కామన్ అయిపోయాయి. ఈ సంబంధాలే పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. అయితే… వావివరసలు మరిచి మరీ కొందరైతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అసలు జనాలకు ఏమైంది. ఎందుకు అలా జనాలు ఎలా పడితే అలా వ్యవహరిస్తున్నారు అనేది అంతుపట్టడం లేదు. తాజాగా ఓ అల్లుడు.. సొంత అత్తతో కలిసి లేచిపోయాడు. అల్లుడితో కలిసి అత్త లేచిపోవడం ఏంటంటూ… స్థానికంగా అందరూ షాక్ అవుతున్నారు. ఈ ఘటన రాజస్థాన్ లోని సిరోహి జిల్లా సియాకర గ్రామంలో చోటు చేసుకుంది.

mother in law jumped with son in law in rajasthan

mother in law jumped with son in law in rajasthan

రమేశ్ అనే వ్యక్తి తనకు ఉన్న ముగ్గురు కూతుళ్లలో పెద్ద కూతురు కిస్నానికి నారాయణ్ జోగి అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగానే ఉండేవారు. అప్పుడప్పుడు నారాయణ్ జోగి.. అత్తమామల దగ్గరికి వస్తుండేవాడు. ఆ సమయంలోనే తన అత్తపై మోజు పడ్డాడు. ఒకసారి ధైర్యం చేసి అత్తను అడిగేశాడు. దీంతో అత్త కూడా దానికి ఓకే చెప్పేసింది. దీంతో వాళ్ల పంట పండింది. ఇద్దరూ కలిసి బాగా ఎంజాయ్ చేసేవారు. సమయం దొరికినప్పుడల్లా నారాయణ్ కూడా అత్త ఇంటికి వెళ్లేవాడు.

Crime News : అందరినీ వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న అత్త, అల్లుడు

అయితే.. ఎప్పటికైనా ఈ విషయం అందరికీ తెలిసే ప్రమాదం ఉందని.. అందుకే ముందే ఇద్దరం కలిసి లేచిపోదామని నిర్ణయించుకున్నారు అత్త, అల్లుడు. సమయం కోసం వేచి చూస్తున్నారు. ఈనేపథ్యంలో ఒకరోజు తన కూతురు, అల్లుడుకు ఫోన్ చేసి ఇంటికి రావాలంటూ రమేశ్ చెప్పాడు. దీంతో కూతురు, అల్లుడు ఇద్దరూ ఇంటికి వెళ్లారు. రాత్రి తిని అందరూ పడుకున్నాక.. ముందు ప్లాన్ చేసుకున్న ప్రకారం.. అత్త, అల్లుడు ఇద్దరూ లేచిపోయారు. ఉదయం లేచి చూసే సరికి.. అత్త, అల్లుడు ఇద్దరూ కనిపించకపోయేసరికి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. విడ్డూరం కాకపోతే అల్లుడితో లేచిపోవడం ఏంటి అంటూ స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశం అయింది.

kranthi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి