nirmala sitharaman urges for 8th cpc about da rate
8th Pay Commission : ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం సిఫారసులను వర్తింపజేస్తున్నారు. అయితే.. త్వరలోనే ఎనిమిదో వేతన సంఘం రాబోతుందా.. 2024 సంవత్సరం ప్రారంభంలో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను రైల్వే సీనియర్ సిటిజన్స్ వెల్ ఫేర్ సొసైటీ(ఆర్ఎస్సీడబ్ల్యూఎస్) నిర్మలా సీతారామన్ కు విన్నవించింది. జనవరి 1, 2024 లోపు కొత్త పే కమిషన్ ఏర్పాటు చేయాలని.. 2019 లో ఉన్న డీఏ, డీఆర్ రేట్లు 2024 వచ్చే సరికి 50 శాతం పెరుగుతాయని.. ఈనేపథ్యంలో కొత్త వేతన సంఘం ఏర్పాటు చేయాలని కోరారు.
ఏడో వేతన సంఘం ప్రకారం కనీసం వేతనం రూ.18 వేలు మాత్రమే. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ కూడా 2.57 మాత్రమే. కానీ.. 3.15 కి ఫిట్ మెంట్ ను పెంచాలని, కనీస వేతనం రూ.26 వేలు చేయాలని అందుకే ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు అనివార్యం అని ఆర్ఎస్సీడబ్ల్యూఎస్ తెలిపింది. ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు అయితే.. డీఏ, డీఆర్ 50 శాతం పెరగాలి. అప్పుడే ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉద్యోగుల జీతాలు ఉంటాయి.
nirmala sitharaman urges for 8th cpc about da rate
2024 ప్రారంభం లోపు ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు కాకపోతే అది ఉద్యోగులను మోసం చేసినట్టే అని చెప్పుకొచ్చారు. భారతదేశ పర్ కాపిటా ఆదాయం కూడా భారీగా పెరిగింది. 2015 -16 లో భారత్ పర్ కాపిటా ఇన్ కమ్ రూ.93,293 కాగా, 2022 – 23 లో అది రూ.1,97,000 గా ఉంది. జనవరి 1, 2016 నుంచి జనవరి 1, 2023 వరకు చూసుకుంటే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 42 శాతం పెరిగాయి. అదే పర్ కాపిటా ఆదాయం చూసుకుంటే.. 111 శాతం పెరిగింది. కాబట్టి ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేసి డీఏ, డీఆర్ ను కూడా పెంచాల్సిన అవసరం ఉందని రైల్వే సొసైటీ రిక్వెస్ట్ చేసింది. దీనిపై కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ అయితే రాలేదు కానీ.. కొత్త పే కమిషన్ ఏర్పాటుపై కేంద్రం కూడా సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
kannappa Movie : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రేపు గ్రాండ్గా విడుదల కానుంది.…
Ram charan : గ్లోబల్ స్టార్ రామ్చరణ్ కుడి చేయికి గాయం అయినట్లు వార్తలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం హైదరాబాద్లోని శిల్పకళా…
Subhanshu Shukla : భారత అంతరిక్ష చరిత్రలో మరొక సువర్ణాధ్యాయం లిఖితమైంది. యాక్సియం-4 (Axiom-4) మిషన్లో భాగంగా భారతీయుడు శుభాంశు…
Father : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…
Daughter : హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…
Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…
Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…
Aloe Vera juice : చాలామంది కలబంద అనగానే ముందుగా గుర్తొచ్చేది చర్మానికి సంరక్షణ ఇవ్వడం కోసం ఉపయోగిస్తారని. కానీ…
This website uses cookies.