Old Rickshaw Wala 2.5 Crores lottery : లాటరీలో 2.5 కోట్లు వస్తే ఈ వృద్ధ రిక్షావాలా ఏం చేసాడో చూడండి..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Old Rickshaw Wala 2.5 Crores lottery : లాటరీలో 2.5 కోట్లు వస్తే ఈ వృద్ధ రిక్షావాలా ఏం చేసాడో చూడండి..??

Old rickshaw Wala 2.5 Crores lottery : గురుదేవ్ సింగ్ అనే వృద్ధ రిక్షావాలా లాటరీ గెలుచుకొని కోటీశ్వరుడు అయ్యాడు. 7 నెలల క్రితం మోగాకు చెందిన గురుదేవ్ సింగ్ లాటరీలో 2.5 కోట్లను గెలుచుకున్నాడు. అయినప్పటికీ ఆయన సాదాసీదాగా జీవిస్తున్నారు. లాటరీ లో అంత గెలుచుకున్న గురుదేవ్ సింగ్ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడతారట. అందుకే తన వృత్తి అయిన రిక్షాను తోలుతూ జీవనం సాగిస్తున్నాడు. సాధారణ జీవితం అంటేనే […]

 Authored By jyothi | The Telugu News | Updated on :31 December 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  Old Rickshaw Wala 2.5 Crores lottery : లాటరీలో 2.5 కోట్లు వస్తే ఈ వృద్ధ రిక్షావాలా ఏం చేసాడో చూడండి..??

Old rickshaw Wala 2.5 Crores lottery : గురుదేవ్ సింగ్ అనే వృద్ధ రిక్షావాలా లాటరీ గెలుచుకొని కోటీశ్వరుడు అయ్యాడు. 7 నెలల క్రితం మోగాకు చెందిన గురుదేవ్ సింగ్ లాటరీలో 2.5 కోట్లను గెలుచుకున్నాడు. అయినప్పటికీ ఆయన సాదాసీదాగా జీవిస్తున్నారు. లాటరీ లో అంత గెలుచుకున్న గురుదేవ్ సింగ్ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడతారట. అందుకే తన వృత్తి అయిన రిక్షాను తోలుతూ జీవనం సాగిస్తున్నాడు. సాధారణ జీవితం అంటేనే తనకు ఇష్టమని చెబుతున్నాడు. లాటరీలో గెలుచుకున్న డబ్బుతో గురుదేవ్ తన కొడుకులు, కూతుర్లకు మంచి ఇల్లు కట్టించి వాహనాలు ఇప్పించారట. తన కూతురు అద్దె ఇంట్లో ఉంటుందని ఆమెకు ఇల్లు కట్టించారట. అలాగే కొడుకులకు కూడా మంచి ఇల్లు కట్టించి కార్లు, బైకులు కొనిచ్చారట.

డబ్బును తన పిల్లల కోసం వినియోగించాలని గురుదేవ్ సింగ్ చెప్పుకొచ్చారు. రిక్షా తొక్కడంతో పాటు గురుదేవ్ సింగ్ చాలా సామాజిక పనులను చేస్తుంటారు. ఆయన సామాజిక కార్యక్రమాలకు చాలామంది యువత స్ఫూర్తి పొందుతున్నారు. గతంలో గురుదేవ్ సింగ్ మొక్కలను పెంచుతూ ఉండేవారట. లాటరీ లో అన్ని డబ్బులు వచ్చిన తర్వాత కూడా గురుదేవ్ సింగ్ అదే పనిని కొనసాగిస్తున్నారు. మొక్కలు పెంచడం తనకు సంతృప్తి నిస్తుందని చెబుతున్నారు. అలాగే పప్పు రోటి తింటూ సాదాసీదాగా ఉండడమే తనకు ఇష్టమని గురుదేవ్ సింగ్ చెబుతున్నారు. ఇక ఆయన కొడుకు మాట్లాడుతూ.. ఈరోజుల్లో 100 రూపాయలు గెలిస్తే ప్రవర్తన మారిపోతుంది. కానీ కోట్లు గెలిచిన మా నాన్న సాదాసీదాగా ఉంటారని తెలిపారు. ఆయన అందరికీ స్ఫూర్తిదాయకం అని అన్నారు.

కోట్లు ఉన్నప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు. రిక్షా తొక్కుతూ చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. గతంలో ఆయన రోడ్ల పక్కన చెట్లను పెంచుతూ ఉండేవారు ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు. ఏప్రిల్ లో గురుదేవ్ సింగ్ లాటరీలో రెండున్నర కోట్లు గెలిచాడు. ఆ తర్వాత కూడా ఆయన లాటరీ టికెట్లను కొంటూనే ఉన్నారు. ఇక ఆయన లాటరీ రెండున్నర కోట్లు గెలుచుకున్న సాదాసీదాగా ఉండడం మామూలు విషయం కాదు ఈ రోజుల్లో చేతిలో డబ్బు పడితే మనిషి ప్రవర్తన మారిపోతుంది అలాంటిది గురుదేవ్ సింగ్ కోటీశ్వరుడు అయినప్పటికీ తన పని తాను చేసుకుంటూ చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు అలాగే సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు గురుదేవ్ సింగ్ అందరికీ స్ఫూర్తిదాయకం అని చెప్పాలి.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది