Rahul gandhi : రాహుల్ గాంధీ పై విరుచుకుపడుతున్న జనం
ప్రధానాంశాలు:
Rahul Gandhi : రాహుల్ గాంధీ పై విరుచుకుపడుతున్న జనం..!
Rahul Gandhi : రాహుల్ గాంధీ పై విరుచుకుపడుతున్న జనం..!
Rahul Gandhi : గాయకుడి మరణం చుట్టూ రాజకీయాలు
అస్సాం రాష్ట్రంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ గెలుపు కోసం బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ అస్సాం గర్వించదగ్గ ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అస్సాంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జుబిన్ గార్గ్ మరణం వెనుక ఉన్న అసలు శక్తులను వంద రోజుల్లోనే బయటకు తెచ్చి వారిని జైలుకు పంపిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ హామీ అస్సాం ప్రజలకు అస్సలు నచ్చలేదు. అసలు రాజకీయాలతో సంబంధం లేని ఒక కళాకారుడి మరణాన్ని ఇలా ఓట్ల కోసం వాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Rahul Gandhi : అభిమానుల ఆగ్రహానికి కారణం ఇదే
జుబిన్ గార్గ్ అస్సాం రాష్ట్రంలో కేవలం ఒక గాయకుడు మాత్రమే కాదు ఆయన ఒక సంచలనం. మేఘాలయలో పుట్టి అస్సాం కోడలిని వివాహం చేసుకున్న ఆయన ప్రపంచవ్యాప్తంగా తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన తెలుగులో కూడా పాటలు పాడి ఇక్కడి వారిని అలరించారు. గతేడాది సెప్టెంబరులో సింగపూర్లో స్కూబా డైవింగ్ చేస్తూ ఊపిరాడక ఆయన మరణించారు. అప్పట్లో ఆయన మరణం అస్సాం ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఏ కులానికి మతానికి కట్టుబడకుండా మానవత్వమే తన మతం అని నమ్మిన అటువంటి గొప్ప వ్యక్తి మరణాన్ని ఇప్పుడు ఎన్నికల అస్త్రంగా వాడటంపై అభిమానులు మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ ఈ హామీని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రాహుల్ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
జుబిన్ గార్గ్ మరణించి ఆరు నెలలు దాటిన తర్వాత ఇప్పుడు ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీకి ఆయన మరణం గుర్తుకు రావడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు లేని ఆవేదన ఇప్పుడు ఓట్ల కోసం చూపిస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఒక కళాకారుడికి ఉన్న ప్రజాదరణను రాజకీయంగా వాడుకోవాలని చూడటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శిస్తున్నారు. ఓట్ల కోసం మరణించిన వ్యక్తులపై సెంటిమెంట్ను రాజేయడం సరికాదని అస్సాం వాసులు బాహాటంగానే చెబుతున్నారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవ్వడం పక్కన పెడితే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత చూస్తుంటే అది రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. మొత్తం మీద ఒక గాయకుడి మరణం ఎన్నికల హామీగా మారడం దేశ రాజకీయాల్లోనే చర్చనీయాంశంగా మారింది.