Home » Exclusive » Pm Kisan Samannidhi Amount Increased In Telugu
Exclusive

PM Kisan : రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ బడ్జెట్ పెంపు పై కీలక నిర్ణయం.!!

Authored By
Admin
The Telugu News | Published on: January 31, 2024, 8:00 am
Advertisement

PM Kisan : రైతుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమణయోధ నిధి మొత్తాన్ని పెంచుతామంటూ కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పథకం కింద ఏడాదికి 600 చొప్పున కేంద్రం అందిస్తుంది. ఒక్కో విడత 2000 చొప్పున 3 విడతల్లో ఈ మొత్తాన్ని రైతులు ఖాతాలలో జమ చేస్తున్నారు.. అయితే ప్రస్తుతం పీఎం కిసాన్ 15వ విడత నిధులు అర్హులైన రైతులు ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఇప్పుడు రైతులు 16వ విడత డబ్బులు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో రైతులకు కేంద్రం భారీ శుభవార్త సిద్ధం చేసినప్పుడు తెలుస్తోంది. 2024లో సార్వత్రిక ఎన్నికలు ముందు పీఎం కిసాన్ పథకంలో కొన్ని మార్పులు చేయాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యంతర బడ్జెట్లో రైతులకు గుడ్ న్యూస్ వినిపించాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

Advertisement

పీఎం కిసాన్ పెట్టుబడి భారీగా పెంచాలి అని సన్నాహాలు చేస్తున్నారట. ఈ పథకం కింద రైతులకు లభించే లబ్ధిని 50% పెంచబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. సంవత్సరానికి 6000 నుండి 9000 వరకు పెంచాలని ప్రణాళికలు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ తొమ్మిది వేల రూపాయలు ఎప్పటిలాగే 3 విడతలలో అకౌంట్లో వేస్తారు అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క విడతలో 3000 రూపాయలు ఇవ్వాలని ప్రణాళిక వేస్తున్నారట. దీంతో పాటు జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంపు.. మద్దతు ధర లాంటి వాటిలో కూడా రైతులకు తీపి కబురులు ఉంటాయని కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అదేవిధంగా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లను సందర్శించి లబ్ధిదారుల స్థితిని కూడా తెలుసుకోవచ్చు.

ఇక్కడ మొదటిగా జిల్లా, మీ రాష్ట్రం, ఉపజిల్లా, పంచాయతీ వంటి వివరాలను ఎంటర్ చేసి గేట్ రిపోర్ట్ బటన్ చేస్తే అన్ని వివరాలు వస్తాయి..పీఎం కిసాన్ కి సంబంధించి మీ ఖాతాలలో డబ్బు కానట్లయితే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేయండి. పిఎం కిసాన్ యోజన హెల్ప్ లైన్ నెంబర్ 01123381092,180011526 నెంబర్ కి మీరు ఫిర్యాదు చేయవచ్చు. అయితే పీఎం కిసాన్ 16వ విడత డబ్బును ఫిబ్రవరి చివరిలో కానీ మార్చి నెల మొదటి వారంలో కానీ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ లోగానే అర్హులైన రైతులంతా ఈ కేవైసీ పూర్తి చేయాలి అని ప్రభుత్వం తెలుపుతోంది…

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి