Houses కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక రకాల హామీలను ఇచ్చింది. వివిధ రకాల పథకాల ద్వారా ప్రజలకు మేలు చేసేలా వాటిని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కర్నాటక ప్రభుత్వం ఇప్పుడు రాజీవ్ గాంధీ గృహ నిర్మాణ పథకం అమలు చేస్తోంది. త్వరలోనే దీన్ని తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే దీన్ని పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టు చెబుతున్నారు. రాజీవ్ గాంధీ రూరల్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ప్రధాన మంత్రి ఆవాస్ (అర్బన్) హౌసింగ్ పథకం కింద 52,189 ఇళ్లను నిర్మిస్తున్నారు.
ఈ పథకం కింద ఇండ్లు లేని నిరుపేదలకు వీటని కట్టిస్తారు. ఎలాంటి ఆస్తులు లేకుండా ఉన్న వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఇంటి నిర్మాణానికి రూ.7.5 లక్షలుగా వెచ్చిస్తున్నారు. ఇందులో 3.5 లక్షలు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు భరిస్తుంది. ఒక లక్ష రూపాయలు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. కాగా దీన్ని కేంద్ర ప్రభుత్వ సాయంతో త్వరలోనే ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. రాజీవ్ గాంధీ హౌసింగ్ స్కీమ్ ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మించుకోవడానికి సహాయం చేస్తుంది.
ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ కావాల్సి ఉంటుంది. వీటన్నింటినీ జతచేసిన తర్వాత రాజీవ్ గాంధృ హౌసింగ్ స్కీమ్ కోసం అప్లై చేసుకోవాలి. అయితే దాన్ని మీ సేవలో లేదా ఏదైనా ఆన్ లైన్ సెంటర్లలో కూడా అప్లై చేసుకోవచ్చు. రాజీవ్ గాంధీ హౌసింగ్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి https://www.pcmcindia.gov.in/ ఈ వెబ్ సైట్ ను సంప్రదిస్తే చాలు. ఇందులో మీ జిల్లా, మీ తాలూకా మరియు మీ హోబ్లీని ఎంచుకోవడానికి మీకు ఎంపికలు వస్తాయి. దాంతో పాటు ఎలా అప్లై చేసుకోవాలో అందులో స్టెప్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయి అప్లై చేసుకుంటే సరిపోతుంది.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.