Houses : పేదలకు రాజీవ్ గాంధీ ఉచిత ఇండ్ల ద‌ర‌ఖాస్తుకు ఆహ్వానం… అర్హులు వీరే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Houses : పేదలకు రాజీవ్ గాంధీ ఉచిత ఇండ్ల ద‌ర‌ఖాస్తుకు ఆహ్వానం… అర్హులు వీరే..!

Houses కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక రకాల హామీలను ఇచ్చింది. వివిధ రకాల పథకాల ద్వారా ప్రజలకు మేలు చేసేలా వాటిని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కర్నాటక ప్రభుత్వం ఇప్పుడు రాజీవ్ గాంధీ గృహ నిర్మాణ పథకం అమలు చేస్తోంది. త్వరలోనే దీన్ని తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే దీన్ని పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టు చెబుతున్నారు. రాజీవ్ గాంధీ రూరల్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ప్రధాన మంత్రి ఆవాస్ (అర్బన్) […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 May 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Houses : పేదలకు రాజీవ్ గాంధీ ఉచిత ఇండ్ల ద‌ర‌ఖాస్తుకు ఆహ్వానం... అర్హులు వీరే..!

Houses కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక రకాల హామీలను ఇచ్చింది. వివిధ రకాల పథకాల ద్వారా ప్రజలకు మేలు చేసేలా వాటిని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కర్నాటక ప్రభుత్వం ఇప్పుడు రాజీవ్ గాంధీ గృహ నిర్మాణ పథకం అమలు చేస్తోంది. త్వరలోనే దీన్ని తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే దీన్ని పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టు చెబుతున్నారు. రాజీవ్ గాంధీ రూరల్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ప్రధాన మంత్రి ఆవాస్ (అర్బన్) హౌసింగ్ పథకం కింద 52,189 ఇళ్లను నిర్మిస్తున్నారు.

Houses కేంద్ర ప్రభుత్వ సాయంతో..

ఈ పథకం కింద ఇండ్లు లేని నిరుపేదలకు వీటని కట్టిస్తారు. ఎలాంటి ఆస్తులు లేకుండా ఉన్న వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఇంటి నిర్మాణానికి రూ.7.5 లక్షలుగా వెచ్చిస్తున్నారు. ఇందులో 3.5 లక్షలు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు భరిస్తుంది. ఒక లక్ష రూపాయలు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. కాగా దీన్ని కేంద్ర ప్రభుత్వ సాయంతో త్వరలోనే ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. రాజీవ్ గాంధీ హౌసింగ్ స్కీమ్ ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మించుకోవడానికి సహాయం చేస్తుంది.

Houses పేదలకు రాజీవ్ గాంధీ ఉచిత ఇండ్ల ద‌ర‌ఖాస్తుకు ఆహ్వానం అర్హులు వీరే

Houses : పేదలకు రాజీవ్ గాంధీ ఉచిత ఇండ్ల ద‌ర‌ఖాస్తుకు ఆహ్వానం… అర్హులు వీరే..!

ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ కావాల్సి ఉంటుంది. వీటన్నింటినీ జతచేసిన తర్వాత రాజీవ్ గాంధృ హౌసింగ్ స్కీమ్ కోసం అప్లై చేసుకోవాలి. అయితే దాన్ని మీ సేవలో లేదా ఏదైనా ఆన్ లైన్ సెంటర్లలో కూడా అప్లై చేసుకోవచ్చు. రాజీవ్ గాంధీ హౌసింగ్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి https://www.pcmcindia.gov.in/ ఈ వెబ్ సైట్ ను సంప్రదిస్తే చాలు. ఇందులో మీ జిల్లా, మీ తాలూకా మరియు మీ హోబ్లీని ఎంచుకోవడానికి మీకు ఎంపికలు వస్తాయి. దాంతో పాటు ఎలా అప్లై చేసుకోవాలో అందులో స్టెప్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయి అప్లై చేసుకుంటే సరిపోతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది