Ysrcp : అర్నాబ్ గోస్వామి.. టీవీ డిబేట్స్ చూసే వాళ్ళకి ఈ పేరు బాగా సుపరిచితం. డిబేట్స్ లో పెద్ద పెద్దగా అరుస్తూ, వచ్చిన ప్యానల్ సభ్యులను ఒకరకమైన భయబ్రాంతులకు గురిచేసే నైజం ఆయనది. అలాంటి అర్నాబ్ తాజాగా వైసీపీ మీద సంచలన కామెంట్స్ చేశాడు . పెద్ద పెద్ద ఆర్థిక అవకతవకలు జరిగాయని, పార్టీలో తిరుగుబాటుఅంటూ రకరకాలుగా చెబుతున్నారు. ఈ కథనాలు వైసీపీలోనూ గందరగోళం రేపుతున్నాయి. దీంతో సజ్జల లాంటి వారు మీడియా ముందుకు వచ్చి ఖండించాల్సి వస్తోంది.
రిపబ్లిక్ టీవీ అంటేనే బీజేపీ భజన టీవీ అనే పేరు ఉంది. ఒక్క బీజేపీ కి మాత్రమే కాకుండా, బీజేపీ తో సన్నహితంగా ఉండే పార్టీల పట్ల కూడా రిపబ్లిక్ టీవీ సానుకూలంగా ఉంటుంది. ఆయా పార్టీల గురించి వ్యతిరేక కధనాలు ప్రచారం చేయదు. వైసీపీ మీద కానీ జగన్ మీద ఇంత వరకు వ్యతిరేకంగా ఎప్పుడు కథనాలు ప్రసారం చేయలేదు. కానీ వ్యతిరేకం అంటే.. ఆషామాషీకాదు. వైసీపీలో కంగారెత్తించేంతగా ఆ కథనాలు ఉంటున్నాయి.
ఆర్థిక అవకతవకలపై విదేశీయులు ఫిర్యాదు చేశారంటూ.. రిపబ్లిక్ టీవీ కథనం ప్రసారం చేసింది. ఆ తర్వాత తిరుగుబాటు అనే వార్త చెప్పింది. ఆ కథనం ఎలా ఉందంటే.. ప్రభుత్వంలో పదవులు ఇచ్చి… వారికి తెలియకుండా వారి పేరు ద్వారా హవాలా రాకెట్ నడుపుతున్నారని…ఆ విషయం తెలిసి వారు తిరుగుబాటుకు సిద్ధమయ్యారన్నట్లుగా.. పరోక్షంగా రిపబ్లిక్ టీవీ సందేశాన్ని పంపింది.
దీనితో ఉలిక్కిపడ్డ వైసీపీ పార్టీ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. జగన్ కంటే ఎక్కువగా మీడియా ముందుకు వచ్చే సజ్జల రామకృష్ణ రిపబ్లిక్ టీవీ కథనాలను ఖండిస్తూ, అదే సమయంలో అర్నాబ్ మీద తిట్ల దండకం అందుకున్నాడు. అలవాటయిన వ్యూహం… ఏం జరిగినా అనుసరించే పక్కా వ్యూహం.. చంద్రబాబు కు లింక్ పెట్టడం. అది కూడా చేసేశారు. చంద్రబాబు చెబితే కథనం వేశారన్నట్లుగా మాట్లాడారు. అంతే కాదు.. జర్నలిజం పాఠాలు కూడా ఆర్నాబ్కు చెప్పారు. ఎలాంటి కథనాలు వేయాలో కూడా ఆర్నాబ్కు సూచించారు.
సాధారణంగా రాజకీయ పార్టీల్లో జరిగే అంతర్గత కుమ్ములాటలు పార్టీ ఆఫీసుల్లో జరగవు. బయటపడేదేకా.. సైలెంట్గానే ఉంటాయి. అయితే వైసీపీలో ఇప్పటికిప్పుడు జగన్పై అసంతృప్తితో ఉన్న నేతలు తిరగబడే అవకాశం లేదనేది రాజకీయవర్గాల గట్టి అంచనా. సజ్జల కూడా తన తొందరపాటుకి సమాధానం చెప్పకుండా.. మీరే చూస్తున్నారుగా పార్టీ ఎంత కామ్ గా ఉందొ అంటూ కవర్ చేసే ప్రయత్నాలు చేశాడు .
ఇంతకాలం బీజేపీతో చెలిమి చేస్తున్న వైసీపీ మీద రిపబ్లిక్ టీవీ ఇలాంటి కథనాలు ప్రసారం చేసిందంటే బహుశా బీజేపీకి వైసీపీ మధ్య దూరం పెరిగిందా..? వైసీపీ మీద ఆగ్రహంతో ఉన్న నేతలకు రాబోయే రోజుల్లో బీజేపీ మద్దతు ఇవ్వబోతుందా..? అదే కనుక జరిగితే అర్నాబ్ చెప్పినట్లు రివోల్ట్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.