Tamilnadu 383 years jail term
ఇటీవల కొన్ని కేసుల్లో తీర్పులు చూస్తుంటే వింతగా అనిపిస్తున్నాయి. అయినా కొంచెం ఆనందంగానే ఉంది. ఎందుకంటే బాధితులకు అమలు చేస్తున్న శిక్షలు అలా ఉన్నాయి మరీ. ఓ బస్సు వేలంలో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసు నిందితుడికి 32 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడితే ఆ శిక్ష ఎన్ని సంవత్సరాలు వేశారో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. ఆ నిందితుడికి అక్షరాల 383 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని కోయంబత్తూర్ డివిజన్ బస్సుల వేలంలో అక్రమాలు జరిగాయింటూ కేసు నమోదయింది. అక్రమ పత్రాలు సృష్టించి 1986 నుండి 1988 వరకు 47 బస్సులను విక్రయించేశారు. 28 లక్షల దాకా మోసం చేశారు.
ఆడిట్ నిర్వహించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సిబి సిఐడి 1990లో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసింది. ఆ కేసులో ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ అసిస్టెంట్ కోదండపాణి, డిప్యూటీ మేనేజర్ రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురుగనాథన్, దొరై స్వామి, రంగనాథన్, రాజేంద్రన్ ను అరెస్టు చేశారు. అప్పటినుండి స్థానిక కేసులో ఆ 8 మంది పై విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతుండగానే రామచంద్రన్, నటరాజన్, రంగనాథన్, రాజేంద్రన్ మృతిచెందారు.
Tamilnadu 383 years jail term
తాజాగా విచారణ చేపట్టిన కోయంబత్తూర్ ఫస్ట్ అడిషనల్ సబార్డినేట్ జడ్జి శివకుమార్ తీర్పును వెల్లడించారు. కోదండపాణి తప్ప మిగిలిన ముగ్గుర్ని నిర్థోషులుగా వెల్లడించారు. మూడు సెక్షన్ల కింద 47 నేరాల కింద 4 ఏళ్లు చొప్పున 188 ఏళ్లు, ఫోర్జరీ మోసాల కింద 4 ఏళ్లు చొప్పున 188 ఏళ్లు, ప్రభుత్వ ఆస్తులను దొంగిలించినందుకు 7 సంవత్సరాలు జైలు విధించింది. అంటే 383 సంవత్సరాల జైలు శిక్షను కోదండపాణికి విధించింది. అతడి వయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ శిక్షలను ఏకకాలంలో పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో పాటు రూ. 3.32 కోట్ల జరిమానా విధించింది. అవి చెల్లించకపోతే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.