జిల్లాలో ఉచిత పౌరాణిక నాటక ప్రదర్శనలను బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు జగన్నాటి మస్తానరావు తెలిపారు. మల్లు సుబ్బారెడ్డి సౌజన్యంతో నలువరాణి నాట్యమండలి ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ‘భక్త చింతామణి, గయోపాఖ్యానం, రామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర వారణాసి, కాటిసీను’ నాటకాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మస్తానరావు మాట్లాడుతూ సమాజాన్ని తట్టి లేపే కళను ఆదరించేవారు ఇంకా ఉన్నారని చెప్పారు. నేడు ఆధునిక ప్రపంచ పోకడలు శరవేగంగా సాగుతున్నప్పటికీ ఇంకా ప్రాచీనమైన కళలను ఆదరించేవారున్నారని వివరించారు.
ఇకపోతే పౌరాణిక నాటక ప్రదర్శనలకుగాను హార్థికంగా, ఆర్థికంగా సాయం చేస్తున్న మల్లు సుబ్బారెడ్డిని అభినందించారు. ఉచితంగానే పౌరాణిక నాటక ప్రదర్శనలు వీక్షించొచ్చని, ఈ నేపథ్యంలో ప్రజలు తరలిరావాలని కోరారు. కళాకారులు, కళాభిమానులు, ప్రజలు కళలు ఎక్కడున్నా తమ గుండెల్లో పెట్టుకుంటారని, నాటక ప్రదర్శనలకు వచ్చి వాటిని జయప్రదం చేయాలని కోరారు. పౌరణిక నాటికలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
This website uses cookies.