7th Pay Commission
7th Pay Commission : గత కొద్ది రోజుల నుండి ప్రభుత్వ ఉద్యోగులని ఊరిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు డీఏ పెంచింది. 7వ వేతన సంఘం సిఫార్సులను అనుసరించి ఉద్యోగులకు మరో 3 శాతం డీఏ (డియర్నెస్ అలవెన్స్) పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది జనవరి నుంచే పెంచిన డీఏ వర్తించనుంది. పెరిగిన డిఏ అమలులోకి వస్తే.. బేసిస్ శాలరీలో డీఏ 34 శాతానికి చేరనుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ (డియర్నెస్ రిలీఫ్)ను.. ఆల్ ఇండియా కన్సూమర్ ప్రైజ్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రీయల్ వర్కర్స్ ప్రకారం లెక్కిస్తారు.
దీనిని లేబర్ బ్యూరో ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ విడుదల చేస్తుంది. అంటే ఉద్యోగులకు ద్రవ్యోల్బణం పెరగటం వల్ల కలిగే ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పించే ఉద్దేశంతో డీఏను పెంచుతూ ఉంటుంది ప్రభుత్వం. ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండుసార్లు DA, DRలను సవరిస్తుంది. జనవరి, జూలైలో ఇది జరుగుతుంది. అయితే ఉద్యోగి ఎక్కడ ఉన్నారనే దాని ఆధారంగా ఇది ఉంటుంది. కరోనా కారణంగా ఒకటిన్నర సంవత్సరాలకు పైగా డీఏ, డీఆర్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే జూలై 2021లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం 17 శాతంగా ఉన్న DA, DRలను 28 శాతానికి పెంచింది. అక్టోబర్ 2021లో ఇది మరో 3 శాతం పెరిగింది.
7th pay commission da hiked by 3 check calculation here
దీంతో 31 శాతానికి చేరుకుంది. తాజాగా మరో 3 శాతం డీఏ, డీఆర్ పెంచేేందుకు కేంద్రం ఓకే చెప్పడంతో.. ఇది 34 శాతానికి చేరుకుంది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 34 శాతం డియర్నెస్ అలవెన్స్ను ఉద్యోగి మూల వేతనంతో ప్రస్తుత డీఏ రేటును గుణించడం ద్వారా లెక్కించబడుతుంది. ఈ లెక్కన చూస్తే తాజా డీఏ పెంపుతో స్థూల జీతం రూ.20,000 వరకు పెరగనుంది.3% DA పెంపుదల అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం DA ఇప్పుడు 34% అవుతుంది. దీని ప్రకారం, రూ. 18,000 ప్రాథమిక వేతనం కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వార్షిక డీఏ రూ.73,440 అందుకుంటారు.
దిగువ లెక్కలను గమనించండి..
3% పెంపు తర్వాత కనీస ప్రాథమిక జీతం లెక్కింపు
– ప్రాథమిక వేతనం: రూ. 18,000
– పెంపు తర్వాత DA (34%) రూ. 6120/నెలకు
– పెంపుకు ముందు DA (31%) రూ. 5580/నెలకు
– డీఏ పెంపు – 6120- 5580 = రూ. 540/నెలకు
– వార్షిక వేతనం పెంపు – 540X12 = రూ.6,480
3% పెంపు తర్వాత గరిష్ట ప్రాథమిక జీతం లెక్కింపు
– ప్రాథమిక వేతనం: రూ. 56900
– పెంపు తర్వాత DA (34%) రూ 19346 / నెల
– పెంపుకు ముందు డీఏ (31%) రూ. 17639/నెలకు
– పెరిగిన తర్వాత ఎంత DA – 19346-17639 = 1,707 రూ/నెలకు
– వార్షిక వేతనంలో పెంపు – 1,707 X12 = రూ. 20,484
డీఏ పెంచిన తర్వాత దాదాపు 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
This website uses cookies.