
nirmala sitharaman urges for 8th cpc about da rate
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు రానున్న రోజులలో పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. ఏడవ పే కమిషన్ సూచనలు మేరకు కరువు భత్యం (డీఏ) 4 శాతం మేర పెరగబోతోందని, స్థూలంగా మూలవేతనంలో డీఏ 38 శాతానికి చేరుకుంటుందని, ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగుల భారీగా జీతాలు పెరుగుతాయని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెండుసార్లు డీఏ పెంచుతుంది. జనవరిలో ఓసారి, జూలైలో మరోసారి డీఏ పెరుగుతుంది. జూలై 1న డీఏ పెరుగుతుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూశారు.
కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.ఆగస్టులో డీఏ పెంపు ప్రకటన వెలువడితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నెల బకాయి కూడా ఉంటుంది. దీని ప్రకారం జీతం భారీగానే పెరిగే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు ద ఆలిండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) మే నెల గణాంకాలు కూడా డీఏ పెంపును సూచిస్తున్నాయి. సాధారణంగా ఆర్బీఐ పేర్కొనే ప్రామాణిక గణాంకం 2-6కన్నా చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల డీఏ కూడా భారీగానే పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత మార్చిలో 3 శాతం డీఏ పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. జనవరి 1నుంచి వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. దాంతో డీఏ మూలవేతనంలో 34 శాతానికి పెరిగింది.
7th pay commission increased 4 percent
ఇప్పుడు మరో 4 శాతం డీఏ పెరిగే సూచనలున్నాయి. 4 శాతం పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 38 శాతానికి చేరుతుంది. రూ.18,000 బేసిక్ జీతం కోసం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ప్రస్తుతం 34 శాతం ఆధారంగా నెలకు రూ.6120 డీఏగా పొందుతున్నారు. కొత్తగా ప్రకటించే డీఏతో అది 6840 రూపాయలు అవుతుంది. అంటే నెలవారీ డీఏ రూ.720 పెంపు, కాగా ఏడాదికి రూ.8,640 అవుతుంది . గరిష్టంగా రూ.56,000 వేతనం ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ప్రస్తుతం నెలవారీ రూ.19,346 పొందుతున్నారు. పెంపుతో ఈ మొత్తం నెలకు రూ.2,276 పెరిగి రూ.21,622కి చేరుకుంటుంది. అంటే ఏటా రూ.27,312 పెరుగుతుందన్నమాట.
Bengal Elections 2026 : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు పెను ప్రకంపనలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైన…
Gold Silver Rate 4th April 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం…
Karthika Deepam 2 April 4th 2026 Today Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ సీరియల్ 'కార్తీక…
Coconut Water : ప్రకృతి మనకు ప్రసాదించిన అత్యంత స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన పానీయాలలో కొబ్బరి నీళ్లు మొదటి వరుసలో…
Chanakyaniti : ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప వ్యూహకర్త మరియు అర్థశాస్త్ర కోవిదుడు. ఆయన రాసిన చాణక్య నీతి నేటి…
Telangana Farmers : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక శుభవార్త…
Gas Cylinder Offer: వ్యాపారం అన్నాక లాభనష్టాలు సహజం. కానీ ఆ వ్యాపారాన్ని నడపడానికి అవసరమైన ముడిసరుకులే దొరకకపోతే ఆ…
Ys Sharmila And YS Jagan : రాజకీయాల్లో కాలం ఎప్పుడు ఎవరికి కలిసి వస్తుందో చెప్పలేం. ఇప్పుడు ఏపీ…
Pakistan And India Issue: భారత్ పాకిస్థాన్ మధ్య ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టు కనిపిస్తున్నాయి. భారత్…
Raghav Chadha : జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీలో Aam Aadmi Party ఇప్పుడు సంచలన పరిణామాలు…
Indiramma Indlu Phase 2 తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు, సొంతిల్లు లేని వారికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం…
Chandrababu and KCR : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం ఇప్పుడు…
This website uses cookies.