7th Pay Commission
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ బొనాంజా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డియర్నెస్ అలవెన్స్ 5 నుంచి 6 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది కేంద్ర ఉద్యోగులు, పింఛనుదారులు డీఏ ప్రయోజనం పొందవచ్చు. ఒకటిన్నర సంవత్సరాల కు పైగా డిఏ బకాయిలు కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తాజా నిర్ణయం పెద్ద ఉపశమనాన్ని కలిగించింది. ఆగస్టు 3న జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏ పెరగుదలపై నిర్ణయం రానుంది.
ఇంతకుముందు ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ను సుమారు 5 శాతం పెంచవచ్చని భావించారు. అయితే అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ పెరుగుదల 5 శాతానికి బదులుగా 6 శాతం ఉండే అవకాశం ఉంది. బకాయిలపై ఉద్యోగులు, పెన్షనర్లు మోడీ ప్రభుత్వానికి లేఖ రాశారు. త్వరగా తమ బకాయిలు చెల్లించాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 3న జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు 34 శాతం డీఏ ఇస్తోంది. 2021 నుంచి ప్రభుత్వం డీఏను మొత్తం 11 శాతం పెంచింది. అంటే మార్చి 2022లో 31 శాతం నుండి 34 శాతానికి పెంచింది. ఇప్పుడు 5 శాతం పెంచితే డీఏ 39 శాతానికి చేరుకుంటుంది.
7th pay commission modi government employees will get hike in DA is likely to increase by 6 percent
ఈ ప్రయోజనం 47 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు చేకూరనుంది.దేశంలో ద్రవ్యోల్బణం ఆర్బీఐ అంచనాల కంటే ఎక్కువగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ స్థాయి 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం డేటా 7 శాతం పైన ఉండగా, టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 15 శాతం కంటే ఎక్కువగానే ఉంది. ఇక ఈ అప్రైజల్ అసెస్మెంట్ ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పినట్టయ్యింది.
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
This website uses cookies.