amaravathi padayatra begins in godavari districts in ap
Amaravathi : ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని.. అది అమరావతి.. అంటూ అమరావతినే రాజధానిగా చేయాలని ఏపీలో రైతులు మహా పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రను అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ, ఇటు కోస్తాంధ్ర అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా చేపడుతున్నారు రైతులు. అయితే.. తాజాగా మహా పాదయాత్ర ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాలను దాటేసి ఉభయ గోదావరి జిల్లాల్లోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు జరిగిన పాదయాత్ర ఒక ఎత్తు అయితే..
ఇప్పుడు జరగబోయే యాత్ర మరో ఎత్తు. ఎందుకంటే.. ఇప్పుడే ఈ యాత్ర గోదావరి జిల్లాల్లోకి ప్రవేశించడంతో అసలు పరీక్ష ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నిజానికి.. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు తగల్లేదు. కానీ.. ఈ జిల్లాల్లోనే అసలు పరీక్ష. అలాగే ఇక్కడి నుంచి ఉత్తరాంధ్రకు వెళ్లేంత వరకు రైతులకు ఎన్ని ఆటంకాలు ఎదురు కానున్నాయో. నిజానికి.. అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న పాదయాత్రలో ఇప్పటి వరకు ఎటువంటి అడ్డంకులు రాలేదు కానీ.. కృష్ణా జిల్లా గుడివాడలో మాత్రం కాస్త ఉద్రిక్తంగానే మారిందని చెప్పుకోవాలి.
amaravathi padayatra begins in godavari districts in ap
అమరావతి ఉద్యమాన్ని చాలాసార్లు చులకన చేస్తూ మాట్లాడిన కొడాలి నాని నియోజకవర్గంలో రైతులు తమ సత్తా చాటాలని అనుకున్నారు. అందుకే అమరావతి రైతులు గుడివాడలో నానిపై సవాల్ విసిరారు. ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లోకి ప్రస్తుతం రైతులు ప్రవేశించారు. ఇక్కడ యాత్రపై వైసీపీ నేతలు పలు ఆరోపణలు చేసే అవకాశం ఉంది. అలాగే వచ్చే నెలలో ఉత్తరాంధ్రలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. అప్పుడు ఇంకెంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయో. నిజానికి ఈ యాత్రకు టీడీపీ, జనసేన నుంచి మద్దతు లభిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన కాస్త బలంగానే ఉన్నాయి. అందుకే అక్కడ రైతులకు మద్దతు ఇస్తూ గోదావరి జిల్లాల ప్రజల ఆదరాభిమానాలు చురగొనాలని టీడీపీ, జనసేన పార్టీలు భావిస్తున్నాయి. చూద్దాం మరి భవిష్యత్తులో ఈ యాత్రలో ఇంకెన్ని అడ్డంకులు వస్తాయో?
New Ration Cards : రేషన్ కార్డు కోసం వేచిచూస్తున్న లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి…
POMIS scheme : మధ్యతరగతి ప్రజలు, నెలవారీ స్థిర ఆదాయాన్ని కోరుకునే ఉద్యోగ విరమణ పొందినవారు తరచూ సురక్షితమైన పెట్టుబడి…
Brother : తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా, అలంగుడి సమీపంలోని పుల్లన్విడుటి గ్రామంలో కుటుంబంలో జరిగిన హత్యాచారం తీవ్ర సంచలనంగా మారింది.…
Pakiza : 1990 దశకంలో కామెడీ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటి పాకీజా గుర్తుండే ఉంటుంది. ‘అసెంబ్లీ రౌడీ’…
Producer : దిల్ రాజు సోదరుడు శిరీష్ తాజాగా మాట్లాడిన మాటలు, బయట పెట్టిన లెక్కలన్నీ కూడా హాట్ టాపిక్గా…
Holidays : వేసవి సెలవులు ముగిసిన తర్వాత విద్యార్థులు బాగా అలసిపోయిన తరుణంలో జూన్ నెల పండగలేమీ లేకపోవడంతో కాస్త…
Jio Electric Bicycle : రిలయన్స్ జియో ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికిల్స్ని మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇప్పుడు 400 కిమీ రేంజ్తో…
Anil Kumar Yadav : ఏపీలో అధికారాన్ని కోల్పోయిన తరువాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస…
This website uses cookies.