Home » News » Ap Budget 2024 Good News For People Farmers And Woman
News

Farmers And Woman : అన్నదాతలు, ఆడబిడ్డలకు ఏపీ సర్కార్ శుభవార్త.. రైతుల ఖాతాల్లో డబ్బులు..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: November 13, 2024, 12:00 pm
Advertisement

Farmers And Woman : ఏపీ ప్రభుత్వం బడ్జెట్ లో రైతులు, మహిళలు, పిల్లల సంక్షేమానికి సంబందించి గణనీయమైన కేటాయింపులు ఇచ్చింది. ఈ ఏడాది బడ్జెట్ లో వ్యవసాయానికి మద్దతు, సామాజిక సంక్షేమం పై ఋష్టి సారించే సూపర్ సిక్స్ పథకాల్లో రెండు కాలక కార్యక్రమాలకు నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమంలో రైతులను ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవ పథకం, ఆడపిల్లలకు తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తో అదనపు ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు మంత్రి కొలుసు పార్ధసారధి వెల్లడించారు.

Advertisement

Farmers And Woman ఏపీ బడ్జెట్ ముఖ్యాంశాలు

రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం.. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి 4500 కోట్లు కేటాయించింది. రైతులకు నేరుగా ఆర్ధిక సహాయం అందించేలా చూస్తున్నారు. 2025 సంక్రాంతి నుంచి ప్రభుత్వ 20000 రూ అర్హులైన రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సహాయంగా అందిస్తుంది. ఈ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనకు అనుబంధంగా ఉంటుంది. 6000 రూ.;ఉ కేంద్ర నుంచి వస్తే అదనంగా రాష్ట్రం నుంచి 14000 ఏపీ రైతులౌ ప్రతి ఏడాది 20000 అందిస్తారు. ఈ నిధులు వ్యవసాయ ఖర్చులు పంట ఉత్పాదకత మెరుగుపరచేందుకు ఇస్తున్నారు.

Farmers And Woman ఆడపిల్లల కోసం తల్లికి వందనం పథకం

ఆడపిల్లల సంక్షేమం కోసం ఇంకా వారి విద్యను ప్రోత్సహించడం కోసం తల్లికి వందనం పథకానికి మద్దతుగా ఏపీ బడ్జెట్‌లో నిధులు కేటాయించింది . దీని వలన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా వారి కుమార్తెల విద్య కోసం పెట్టడం సులభం చేయడం జరుగుతుంది.

Advertisement

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Farmers And Woman : అన్నదాతలు, ఆడబిడ్డలకు ఏపీ సర్కార్ శుభవార్త.. రైతుల ఖాతాల్లో డబ్బులు..!

ఇదే క్రమంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూడా ఈ ఏడాది ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర మహిళలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం, వారిని మరింత బలోపేతం చేయడం అవుతుంది. ఉచిత బస్సు వల్ల ఏపీ అంతటా మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.రాష్ట్రంలో ఆర్థిక అవరోధాలున్నప్పటికీ హామీలను నెరవేర్చడంతోపాటు ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆదుకోవడంపై దృష్టి పెడుతుందని అన్నారు. గత పరిపాలన వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింద్ని అన్నారు పార్ధసారధి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి