
ap cm ys jagan big shock to ap cec nimmagadda ramesh kumar
ఏపీలో ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది ఇన్నిరోజులు. ఏపీ ప్రభుత్వం, ఏపీ ఎన్నికల కమిషన్ మధ్య జరిగిన యుద్ధం మామూల్ది కాదు. చివరకు ఆ యుద్ధంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమారే గెలిచినట్టు. ఎందుకంటే.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పినట్టుగానే ఏపీలో పంచాయతీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లినా ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది.
ap cm ys jagan big shock to ap cec nimmagadda ramesh kumar
సుప్రీం కోర్టు చెప్పాక చేసేదేం ఉంటుంది. అందుకే.. ఏపీ ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సై అన్నది. ఉద్యోగులు కూడా ఎన్నికలకు సహకరిస్తామని ఎస్ఈసీకి తెలిపారు. అలాగే… ఎన్నికల నిర్వహణకు.. అధికారులంతా సహకరించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ కూడా ఆదేశించారు.
అంతవరకు బాగానే ఉంది. మొత్తం మీద నిమ్మగడ్డ కోరుకున్నట్టే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి కానీ.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. నిమ్మగడ్డ.. ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ కు షాకిస్తే.. రివర్స్ లో జగన్.. ఇప్పుడు నిమ్మగడ్డకు షాకిచ్చారు.
ప్రస్తుతం జరగనున్నది పంచాయతీ ఎన్నికలు. ఒకవేళ గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయితే .. ఆ ఊళ్లో ఎన్నికలు నిర్వహించడం ఏం ఉండదు. అందుకే.. నిమ్మగడ్డను నిలువరించడానికి ఏపీ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. మాగ్జిమం కుదిరినన్ని పంచాయతీల్లో ఏకగ్రీవాలు అయ్యేలా చూడాలని సీఎం జగన్.. నేతలకు సూచించారట. అలాగే.. ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధమయ్యారు. పంచాయతీలు ఏకగ్రీవం అయితే.. ఆ పంచాయతీకి ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది. ఆ ప్రోత్సాహకాలతో తమ ఊరిని బాగు చేసుకోవచ్చు.
ఏకగ్రీవం అయితే.. 2 వేల లోపు జనాభా ఉన్న ఊరికి 5 లక్షల ప్రోత్సాహకాన్ని అందించనుంది ప్రభుత్వం. అలాగే.. 2 నుంచి 5 వేల లోపు జనాభా ఉంటే 10 లక్షలు, 5 వేల నుంచి 10 వేల లోపు ఉంటే 15 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందించనుంది. ఒకవేళ 15 వేల జనాభా దాటితే మాత్రం 20 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందించనుంది.
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
This website uses cookies.