Neelam Sahni : చిక్కుల్లో ఏపీ ఎన్నికల కమిషనర్.. జగన్ కు కొత్త తలనొప్పి.. ఆమె పదవికి గండం..?

Advertisement
Advertisement

Neelam Sahni : ఏపీకి ఎన్నికల కమిషనర్ గా ఎవరు ఉన్నా.. వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదివరకు ఏపీ సీఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. చివరకు ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన స్థానంలో స్టేట్ ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్నిని నియమించారు. అయితే.. తన పదవి సమర్థతపై ఇటీవలే హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తన గురించి మాట్లాడిందో లేదో.. ఆమె నియామకమే చట్టవిరుద్ధం అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీంతో.. పిటిషన్ ను విచారించిన కోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Advertisement

ap election commissioner neelam sahni

అయితే.. హైకోర్టుకు పిటిషన్ వేసిన వాళ్లు.. గతంలో ఇటువంటి ఇష్యూపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జతపరచడంతో.. ఆ కేసుకు బలం పెరిగింది. ఎందుకంటే.. నీలం సాహ్ని.. సుప్రీంకోర్టును దిక్కరించినట్టే అవుతుందని.. ఒకవేళ అదే తేలితే.. నీలం సాహ్ని పదవి పోవడం ఖాయమని.. ఏపీ ప్రభుత్వంతో పాటు సీఎం జగన్ కూడా చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

Advertisement

Neelam Sahni : అసలు సుప్రీంకోర్టు ఉత్తర్వులో ఏముంది?

కొన్ని రోజుల కింద గోవాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో రాష్ట్ర న్యాయ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి.. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా ఆదనపు బాధ్యతలు అప్పగిస్తూ గోవా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తికి ఎన్నికల కమిషన్ బాధ్యతలను ఎలా అప్పగిస్తారంటూ హైకోర్టు గోవా ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని.. దానిపై స్టే కూడా ఇచ్చింది. అయితే.. దీనిపై గోవా ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆ కేసును విచారించిన సుప్రీం కూడా అదే మాట చెప్పింది.. ఎన్నికల కమిషన్ కు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వాలు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయని హెచ్చరించింది.

ap election commissioner neelam sahni

ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో రాష్ట్ర కానీ.. కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదని.. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే.. ఆ ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తి అయినా సరే.. ఎన్నికల కమిషన్ లో పనిచేయకూడదు. ఎన్నికల కమిషనర్ గా ఉండే వ్యక్తి.. ఇండిపెండెంట్ గా ఉండాలి.. ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తి అయి ఉండాలి.. అని సుప్రీం స్పష్టం చేసింది.ఈ విషయం నీలం సాహ్నికి కూడా వర్తిస్తుందని.. ఆమెను ఏపీ సీఈసీగా నియమించే సమయంలో కూడా సుప్రీం మార్గదర్శకాలను గవర్నర్ కు కొందరు వెల్లడించినా కూడా ఆమె నియామకం మాత్ర ఆగలేదు. ప్రస్తుతం నీలం సాహ్ని.. సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించారని.. ఎలాగైనా ఆమెను సీఈసీ పదవి నుంచి తొలగించాల్సిందేనని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనికి ఏపీ ప్రభుత్వం ఏ విధమైన కౌంటర్ దాఖలు చేస్తుందో.. ఏం జరుగుతుందో.. నీలం సాహ్ని పదవి ఉంటుందా? పోతుందా? అనే విషయం తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Recent Posts

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

27 mins ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

1 hour ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

This website uses cookies.