Black Fungus : బ్లాక్ ఫంగస్ సోకిన వాళ్లకు గుడ్ న్యూస్.. ఆయుర్వేద మందు వచ్చేసింది.. వాడే విధానం ఇదే..!

Advertisement
Advertisement

Black Fungus : ప్రస్తుతం కరోనా కంటే కూడా జనాలు ఎక్కువగా భయపడుతున్నారు బ్లాక్ ఫంగస్ వల్ల. అవును.. కరోనా పాజిటివ్ వచ్చి ట్రీట్ మెంట్ తీసుకున్నాక.. నెగెటివ్ వచ్చిన వాళ్ల మీద బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోంది. మామూలుగా ఈ ఫంగస్ సాధారణ వ్యక్తుల జోలికి పోవడం లేదు. కరోనా ట్రీట్ మెంట్ లో ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడిన వాళ్లపై తన ప్రతాపాన్ని బ్లాక్ ఫంగస్ చూపిస్తోంది. దేశమంతా ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ వ్యాపించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు బోలెడు ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా కేసులు ఎక్కువే ఉన్నాయి. బ్లాక్ ఫంగస్ కు ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా చికిత్స అందించడం లేదు. కేవలం హైదరాబాద్ లోని ఈఎన్టీ ఆసుపత్రి, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో మాత్రమే బ్లాక్ ఫంగస్ కు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

Advertisement

నిజానికి.. బ్లాక్ ఫంగస్ కు సరైన ట్రీట్ మెంట్ లేదు. దానికి ట్రీట్ మెంట్ చేయాలన్నీ.. లక్షలతో కూడుకున్న వ్యవహారం. ఇటువంటి సమయంలో ఆయుర్వేద నిపుణులు బ్లాక్ ఫంగస్ కు ఆయుర్వేదంలో ట్రీట్ మెంట్ ఉందని చెబుతున్నారు. ఏపీలో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. బ్లాక్ ఫంగస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. బ్లాక్ ఫంగస్ చికిత్సను ప్రభుత్వం.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది.

Advertisement

Black Fungus

Black Fungus : ఆయుర్వేద ట్రీట్ మెంట్ ఇదే

అయితే.. బ్లాక్ ఫంగస్ కు ఆయుర్వేద ట్రీట్ మెంట్ ఉందని.. దాని కోసం ఏం వాడాలో కూడా ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దానికి రెండు రకాల చికిత్స విధానాలు ఉంటాయని.. మొదటిది.. గంధక రసాయనం మాత్రలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏ ఆయుర్వేద షాపుకు వెళ్లినా గంధక రసాయనం మాత్రలు దొరుకుతాయని.. వాటిని రోజుకు రెండుసార్లు భోం చేసిన తర్వాత వేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాగే… ఖదిరాదివతి మాత్రలను భోజనానికి ముందు రోజుకు రెండు సార్లు వేసుకోవాలని చెబుతున్నారు.అలాగే.. పంచతిక్త గుగ్గులువృతాన్ని కూడా వాడాలట. దాన్ని ఓ 10 గ్రాములు తీసుకొని గోరు వెచ్చని పాలలో తీసుకొని.. రోజుకు రెండు సార్లు భోజనానికి ముందు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే.. మృత్యుంజయ రసాన్ని కూడా రోజుకు రెండు మాత్రల చొప్పున రోజులో మూడు సార్లు తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే.. ఒక గ్రాము శుభ్రభస్మాన్ని కూడా ఒక గ్లాసు నీటిలో తీసుకొని.. రోజూ పుక్కిలించాలని చెబుతున్నారు.

ayurvedic treatment for black fungus in andhra pradesh

అలా కాకుండా.. మరో చికిత్స విధానం కూడా ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యవర్థనీవతి అనే మందును మాత్రల రూపంలో రోజుకు రెండుసార్లు భోజనం చేసిన తర్వాత వేసుకోవాలట. అలాగే.. విషతుందుకవతి రెండు మాత్రం.. రోజుకు మూడు సార్లు భోజనం చేసిన తర్వాత వేసుకోవాలి. ఆ తర్వాత హరిద్రఖండాన్ని 100 గ్రాములు తీసుకొని.. దాంట్లో 10 గ్రాముల మల్లసింధూరాన్ని కలిపి.. తేనె వేసి బాగా కలిపి రోజులో రెండుసార్లు 3 గ్రాముల చొప్పున తీసుకోవాలి. అలాగే టంకణభస్మాన్ని ఒక గ్రాము గ్లాసులో తీసుకొని నీళ్లు పోసి పుక్కిలించి వేయాలి.అయితే.. ఇవి ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నప్పటికీ.. బ్లాక్ ఫంగస్ సోకిన వాళ్లు.. ఒకసారి ఆయుర్వేద నిపుణులను సంప్రదించి.. పై చికిత్స విధానాలను వాడితే ఫలితం ఎక్కువగా ఉంటుంది.

Advertisement

Recent Posts

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

10 mins ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

1 hour ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

2 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

3 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

4 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

5 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

14 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

15 hours ago

This website uses cookies.