AP Government Petition On AP Three Capitals In Supreme Court
AP Three Capitals : ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల అంశమే చర్చనీయాంశం అయింది. అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నా.. ఏపీకి మాత్రం సరైన రాజధాని లేదు. ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయిన తెలంగాణకు హైదరాబాద్ రాజధాని ఉంది కానీ.. ఏపీకి మాత్రం రాజధాని లేదు. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని కొత్త రాజధానిగా ప్రకటించారు. కానీ.. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. అమరావతి రాజధానిగా ఉంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు అన్యాయం జరుగుతుందని భావించి.. ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అవసరం అని తేల్చి చెప్పారు. దీంతో అమరావతితో పాటు వైజాగ్, కర్నూలు మూడు రాజధానుల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం చట్టం కూడా చేసింది. కానీ… రాష్ట్ర రాజధానిపై చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది.
మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు మెట్లను ఏపీ ప్రభుత్వం తాజాగా ఎక్కింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. శాసన వ్యవస్థనే నిర్వీర్యం చేసేలా హైకోర్టు తీర్పు ఉందని ఏపీ ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది. మరోసారి విశాఖ పరిపాలనా రాజధానిగా ఉంటుందని సీఎం జగన్ కూడా అసెంబ్లీలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
AP Government Petition On AP Three Capitals In Supreme Court
మూడు రాజధానులపై ఏమాత్రం తగ్గడం లేదు ఏపీ ప్రభుత్వం. సుప్రీంకోర్టులో ఓవైపు పిటిషన్.. మరోవైపు మరోసారి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. వచ్చే ఎన్నికల లోపు ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కావాలని వైఎస్ జగన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇక.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖలో పరిపాలన ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. అలాగే.. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండబోతోంది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదెలా ఉంటే.. ఏపీలోకి ఒకే రాజధాని ఉండాలని, అది అమరావతే కావాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇన్ని నిరసనల మధ్య, హైకోర్టు తీర్పు మధ్య సీఎం జగన్.. మూడు రాజధానులను ఎలా ఏర్పాటు చేస్తారో వేచి చూడాల్సిందే.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.