
ap govt targets ramoji rao margadarsi chit fund company
Ramoji Rao – YS Jagan : చాలా రోజుల నుంచి మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీపై దాడులు జరుగుతున్నాయి. ఆ కంపెనీ ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావుది. అయితే.. ఈ కంపెనీ రామోజీ రావుది కాదని.. మార్గదర్శి కంపెనీ యాజమాన్యం వేరే అంటూ రామోజీ రావు మార్గదర్శి స్కామ్ నుంచి బయట పడాలని కూడా చూశారు. అయినా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్ స్కామ్ పై దృష్టి సారించింది. అందుకే.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీలపై దాడులు చేశారు.
అందులో భాగంగానే మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆఫీసులపై కూడా దాడులు నిర్వహించారు. ఏపీలోని వైజాగ్, విజయవాడ లాంటి ప్రాంతాల్లో 8 మార్గదర్శి ఆఫీసులపై అధికారులు దాడులు చేశారట. నిజానికి.. రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ మొత్తం మార్గదర్శి చిట్ ఫండ్స్ మీదే ఉందట. దాని మీద దాడి చేయడం కోసమే. కావాలని అన్ని చిట్ ఫండ్స్ కంపెనీల మీద దాడులు చేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు రామోజీ రావు తన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై, ఏపీ సీఎం వైఎస్ జగన్ పై పలు కథనాలు వండి వార్చుతున్నారు. జగన్ మార్గదర్శి మీద దృష్టి పెడితే.. రామోజీ మాత్రం.. జగన్ మీద దృష్టి పెట్టారు. నిజానికి.. మార్గదర్శి కేసు ఇప్పటిది కాదు..
ap govt targets ramoji rao margadarsi chit fund company
చాలా ఏళ్ల నుంచి అది నడుస్తూనే ఉంది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి నిధులు సేకరిస్తోందంటూ కేసు ఫైల్ అయింది. ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. చాలా ఏళ్ల నుంచి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆయనకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసుపై సీరియస్ గా ఉంది. ఒకవేళ రామోజీ రావు చేసిన ఆర్థిక నేరం కనుక కోర్టులో రుజువు అయితే.. దాదాపుగా రూ.6 వేల కోట్ల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అలాగే జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది అని ఉండవల్లి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రామోజీ రావు తదుపరి స్టెప్ ఏంటో.. ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.