Ramoji Rao – YS Jagan : చాలా రోజుల నుంచి మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీపై దాడులు జరుగుతున్నాయి. ఆ కంపెనీ ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావుది. అయితే.. ఈ కంపెనీ రామోజీ రావుది కాదని.. మార్గదర్శి కంపెనీ యాజమాన్యం వేరే అంటూ రామోజీ రావు మార్గదర్శి స్కామ్ నుంచి బయట పడాలని కూడా చూశారు. అయినా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్ స్కామ్ పై దృష్టి సారించింది. అందుకే.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీలపై దాడులు చేశారు.
అందులో భాగంగానే మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆఫీసులపై కూడా దాడులు నిర్వహించారు. ఏపీలోని వైజాగ్, విజయవాడ లాంటి ప్రాంతాల్లో 8 మార్గదర్శి ఆఫీసులపై అధికారులు దాడులు చేశారట. నిజానికి.. రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ మొత్తం మార్గదర్శి చిట్ ఫండ్స్ మీదే ఉందట. దాని మీద దాడి చేయడం కోసమే. కావాలని అన్ని చిట్ ఫండ్స్ కంపెనీల మీద దాడులు చేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు రామోజీ రావు తన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై, ఏపీ సీఎం వైఎస్ జగన్ పై పలు కథనాలు వండి వార్చుతున్నారు. జగన్ మార్గదర్శి మీద దృష్టి పెడితే.. రామోజీ మాత్రం.. జగన్ మీద దృష్టి పెట్టారు. నిజానికి.. మార్గదర్శి కేసు ఇప్పటిది కాదు..
చాలా ఏళ్ల నుంచి అది నడుస్తూనే ఉంది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి నిధులు సేకరిస్తోందంటూ కేసు ఫైల్ అయింది. ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. చాలా ఏళ్ల నుంచి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆయనకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసుపై సీరియస్ గా ఉంది. ఒకవేళ రామోజీ రావు చేసిన ఆర్థిక నేరం కనుక కోర్టులో రుజువు అయితే.. దాదాపుగా రూ.6 వేల కోట్ల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అలాగే జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది అని ఉండవల్లి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రామోజీ రావు తదుపరి స్టెప్ ఏంటో.. ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.