
Avanthi srinivas
Avanthi srinivas ఏపీలో ప్రస్తుతం కరోనా తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. కరోనా ఏపీలో కోరలు చాచడంతో కరోనాను నియంత్రించడం కోసం ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. కరోనా కట్టడి కోసం ఇప్పటికే మధ్యాహ్నం 12 నుంచి తెల్లారి ఉదయం 6 వరకు ఏపీ వ్యాప్తంగా కర్ఫ్యూను విధించింది. అయినప్పటికీ ఏపీలో కరోనా కేసులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా వైజాగ్ లో 300 పడకల ఆసుపత్రిని మంత్రి అవంతి శ్రీనివాస్ Avanthi srinivas ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా పరిస్థితిపై ఆయన చిరాకుపడ్డారు.
కరోనా పేషెంట్లకు ముఖ్యంగా కావాల్సింది ఆక్సిజన్, వ్యాక్సినేషన్, ఇంజిక్షన్. కానీ విచిత్రం ఏంటంటే.. ఇవన్నీ కేంద్రం చేతుల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసేదేం లేదు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్సిజన్ విషయంలో నిందిస్తే ఎలా? ఏపీలో ఉన్న అన్ని ఆసుపత్రులు కరోనా కేంద్రాలుగా మారాయి. అయినా కూడా బెడ్స్ సరిపోవడం లేదు. దానికి మేం ఏం చేస్తాం.. ప్రభుత్వాన్ని నిందిస్తే ఏం వస్తుంది.. అంటూ మంత్రి అవంతి మండిపడ్డారు.
Avanthi srinivas
ఏపీలో వ్యాక్సినేషన్ కొరత ఉన్నది కానీ.. ప్రభుత్వం వ్యాక్సినేషన్ కోసం ఎంతో చేస్తోంది. అయినా కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దేశంలోనే అత్యుత్తమమైన వైద్య సేవలను ఏపీలో సీఎం జగన్ అందిస్తున్నారు. ప్రగతి భారతి ఫౌండేషన్ కూడా బాగా పనిచేస్తోంది. ఏపీ ప్రభుత్వం, ప్రగతి భారతి ఫౌండేషన్ సహకారంతోనే వైజాగ్ లో 300 పడకల కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేశాం. ఏపీలో ఆక్సిజన్ కొరత లేకుండా చేస్తున్నాం. 200 మెట్రిక్ టన్నులు ఉన్న ఆక్సిజన్ సరఫరాను… 600 మెట్రిక్ టన్నులకు పెంచినా కూడా ఆక్సిజన్ సరిపోవడం లేదు.. అంటూ మంత్రి తెలిపారు.
ఏపీలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం బాగానే ప్రయత్నిస్తోంది. ఇఫ్పటికే కేంద్రంతో మాట్లాడి.. వ్యాక్సినేషన్లను కూడా తీసుకొస్తోంది. ఆక్సిజన్ సరఫరాను పెంచింది. కానీ.. చాలామంది కరోనా రోగులు.. హైదరాబాద్ కు చికిత్స కోసం వెళ్తుంటే తెలంగాణ బార్డర్ వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. దానిపై ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది. ఏపీ సీఎం జగన్ కూడా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి.. ఏపీకి చెందిన కరోనా పేషెంట్లను హైదరాబాద్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…
Gold Silver Rate April 11th 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇది ముఖ్యమైన…
Karthika Deepam 2 April 11th 2026 Today Episode : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న…
Onion Majjiga Pulusu Recipe : ఉల్లిపాయ మజ్జిగ పులుసు ఆంధ్ర ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన వంటకం. ముఖ్యంగా…
Watermelon Seeds : వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ వేడిని తట్టుకోవడంలో సహజసిద్ధమైన ఆహారాలు ముఖ్య పాత్ర…
Wealth Temples : జీవితంలో సంపద, స్థిరత్వం ప్రతి ఒక్కరి కల. కానీ ఎంత కష్టపడ్డా డబ్బు నిలవకపోవడం, అప్పులు…
This website uses cookies.