అవును ఆక్సిజన్ సరిపోవడం లేదు.. ఏపీ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు.. ?

Advertisement
Advertisement

Avanthi srinivas ఏపీలో ప్రస్తుతం కరోనా తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. కరోనా ఏపీలో కోరలు చాచడంతో కరోనాను నియంత్రించడం కోసం ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. కరోనా కట్టడి కోసం ఇప్పటికే మధ్యాహ్నం 12 నుంచి తెల్లారి ఉదయం 6 వరకు ఏపీ వ్యాప్తంగా కర్ఫ్యూను విధించింది. అయినప్పటికీ ఏపీలో కరోనా కేసులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా వైజాగ్ లో 300 పడకల ఆసుపత్రిని మంత్రి అవంతి శ్రీనివాస్ Avanthi srinivas ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా పరిస్థితిపై ఆయన చిరాకుపడ్డారు.

Advertisement

కరోనా పేషెంట్లకు ముఖ్యంగా కావాల్సింది ఆక్సిజన్, వ్యాక్సినేషన్, ఇంజిక్షన్. కానీ విచిత్రం ఏంటంటే.. ఇవన్నీ కేంద్రం చేతుల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసేదేం లేదు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్సిజన్ విషయంలో నిందిస్తే ఎలా? ఏపీలో ఉన్న అన్ని ఆసుపత్రులు కరోనా కేంద్రాలుగా మారాయి. అయినా కూడా బెడ్స్ సరిపోవడం లేదు. దానికి మేం ఏం చేస్తాం.. ప్రభుత్వాన్ని నిందిస్తే ఏం వస్తుంది.. అంటూ మంత్రి అవంతి మండిపడ్డారు.

Advertisement

వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం చాలా చేస్తోంది : Avanthi srinivas

Avanthi srinivas

ఏపీలో వ్యాక్సినేషన్ కొరత ఉన్నది కానీ.. ప్రభుత్వం వ్యాక్సినేషన్ కోసం ఎంతో చేస్తోంది. అయినా కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దేశంలోనే అత్యుత్తమమైన వైద్య సేవలను ఏపీలో సీఎం జగన్ అందిస్తున్నారు. ప్రగతి భారతి ఫౌండేషన్ కూడా బాగా పనిచేస్తోంది. ఏపీ ప్రభుత్వం, ప్రగతి భారతి ఫౌండేషన్ సహకారంతోనే వైజాగ్ లో 300 పడకల కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేశాం. ఏపీలో ఆక్సిజన్ కొరత లేకుండా చేస్తున్నాం. 200 మెట్రిక్ టన్నులు ఉన్న ఆక్సిజన్ సరఫరాను… 600 మెట్రిక్ టన్నులకు పెంచినా కూడా ఆక్సిజన్ సరిపోవడం లేదు.. అంటూ మంత్రి తెలిపారు.

ఏపీలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం బాగానే ప్రయత్నిస్తోంది. ఇఫ్పటికే కేంద్రంతో మాట్లాడి.. వ్యాక్సినేషన్లను కూడా తీసుకొస్తోంది. ఆక్సిజన్ సరఫరాను పెంచింది. కానీ.. చాలామంది కరోనా రోగులు.. హైదరాబాద్ కు చికిత్స కోసం వెళ్తుంటే తెలంగాణ బార్డర్ వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. దానిపై ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది. ఏపీ సీఎం జగన్ కూడా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి.. ఏపీకి చెందిన కరోనా పేషెంట్లను హైదరాబాద్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Recent Posts

Ys Jagan : డిల్లీ పీఠాన్ని కదిలించ‌నున్న‌ జగన్ , సౌత్ ఇండియా లో కొత్త కూటమి..?

Ys Jagan  : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లి వేడుకకు వెళ్తే అది కాస్తా ఇప్పుడు…

2 hours ago

Ram Charan Upasana Twins Names : రామ్ చరణ్ ఉపాసన పిల్లల ‘శివరాం’ , ‘అన్వీరా దేవి’.. పేర్లకు అర్ధాలు తెలుసా..?

Ram Charan Upasana Twins Names : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు సంబంధించి…

3 hours ago

Johnny Master : చిక్రీ సాంగ్‌లో హుక్ స్టెప్ ఐడియా నాది కాదు.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన జానీ మాస్టర్‌

Johnny Master : చిక్రీ సాంగ్‌లో హుక్ స్టెప్ ఐడియా నాది కాదు.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన జానీ మాస్టర్‌…

4 hours ago

Telangana Municipal Results 2026 : మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క ఓటు తో గెలిచిన అభ్యర్థులు వీరే !!

Telangana Municipal Results 2026  : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రతి ఓటు ఎంత విలువైందో చాటిచెప్పే ఆసక్తికర…

5 hours ago

AP Govt Good News : కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికీ ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

AP Govt Good news to New Pensions : ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల అంశంపై శాసనమండలి వేదికగా ప్రభుత్వం మరియు…

5 hours ago

Telangana Municipal Polls 2026 : మున్సిపల్ పోరులో ‘హస్తం’ ప్రభంజనం

Telangana Municipal Polls 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని…

6 hours ago

Rajya Sabha : ఏపీ నుండి రాజస్యభకు వెళ్లే ఎంపీలు వీరేనా ?

Rajya Sabha  : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి సమయం దగ్గరపడుతుండటంతో, అధికార కూటమిలో అభ్యర్థుల…

8 hours ago

Fruits : ఈ పండ్లు అతిగా తింటే ఆమ్లత్వం పెరుగుతుందా? .. వాటిని ఎందుకు తినకూడదో తెలుసా ..!

Fruits : ఆరోగ్యకరమైన ఆహారం అంటే చాలా మంది ముందుగా గుర్తుచేసుకునేది పండ్లే. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే…

9 hours ago