
ap cm ys jagan laid foundation stone for bhogapuram airport
YCP : అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 సీట్లకు ఒక్కటి కూడా తగ్గకూడదు. 175 సీట్లే లక్ష్యంగా ప్రజలతో మమేకం అవ్వాలి.. అంటూ వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసిన దరిమిలా.. ఆ దిశగానే వైసీపీ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. ‘గడప గడపకీ వైఎస్సార్సీ..’, ‘గడప గడపకీ మన ప్రభుత్వం..’ పేర్లతో వైసీపీ ఓ అద్భుతమైన ప్రచార కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే.కొన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి కొంత మేర ప్రతిఘటన ఎదురవుతున్నా, అది ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పన్నిన కుట్రలో భాగమేనని వైసీపీ భావిస్తోంది. ఎక్కడికక్కడ తమకు జనం నీరాజనాలు పలుకుతున్నారన్నది వైసీపీ నేతల వాదనగా కనిపిస్తోంది. విపక్షాలు, దానికి తోడు వైసీపీ వ్యతిరేక మీడియా చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో..
మరింత అప్రమత్తంగా వుండాలన్నది వైసీపీ నేతలకు, అధినేత చేసిన సూచన.తాజాగా వైసీపీ, మంత్రుల బస్సు యాత్రకు ప్లాన్ చేసిన విషయం విదితమే. బస్సులో మంత్రులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తారు. ఇదంతా ఇప్పుడు ఎన్నికల సీజన్ అయితే ఎలా వుంటుంది.? అన్న కోణంలోనే జరగనుంది. ఔను, రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది.ఇంకో రెండేళ్ళ వరకు వైసీపీ ప్రభుత్వానికి అవకాశం వున్నాగానీ, ముందస్తు ఎన్నికలకు వైఎస్ జగన్ వెళితే.?
AP Ministers Bus Tour, YCP Target 175
అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న దరిమిలా, అదొక సన్నాహక కార్యక్రమంగా వైసీపీ భావిస్తున్నట్టుంది. మరింత అగ్రెసివ్గా జనంలోకి వెళుతున్నారు వైసీపీ నేతలు. కాగా, మంత్రుల బస్సు యాత్ర, తమ పార్టీ ఆవిర్భావ వేడుకలకు పోటీగా.. అంటూ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వింత వాదనకు తెరలేపింది. అధికారంలో వున్నప్పుడు చంద్రబాబు అండ్ టీమ్ చేసిన యాత్రలతో పోల్చితే, వైసీపీ చేస్తున్నది ఆక్షేపణీయమేమీ కాదు.ఏదిఏమైనా, నేతలు.. అందునా మంత్రులు కూడా నిత్యం జనంలో వుంటే, తమ పార్టీ 2024లో మరింత ఘనవిజయం సాధిస్తుందన్న వైఎస్ జగన్ ఆలోచన అద్భుతం. 175 సీట్లలో ఎందుకు గెలవం.? అని పట్టుదలతో వున్న వైఎస్ జగన్, అనుకున్నది సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
This website uses cookies.