ATM ఏటీఎం నుంచి తరచూ డబ్బులు విత్డ్రా చేసుకునే వారికో షాకింగ్ న్యూస్. ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి కొత్త ఏడాది నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. బ్యాంక్ ఖాతాదారులు నూతన ఏడాది నుంచి ఏటీఎం క్యాష్ విత్డ్రాయెల్స్కు సంబంధించి ఇప్పటినుంచి ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. తాజా నిబంధనల ప్రకారం కస్టమర్ల నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి దాటిన అనంతరం తర్వాత ఈ చార్జీల బాదుడు మొదలవుతుందట. మరో మూడు రోజుల తర్వాత నుంచి ఈ కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్న అంశానికి సంబంధించి ఈ మేరకు ఆయా బ్యాంక్ ల నుంచి వారి కస్టమర్లకు ఇప్పటికే సవరించిన చార్జీల సందేశాలు పంపుతున్నారు.
రిజర్వ్ బ్యాంకు తాజా నిబంధనలకు అనుగుణంగా ఉచిత లావాదేవీల పరిమితి దాటిన అనంతరం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఫీజు రూ.21గా ఉంటుందని ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. దీనికి జీఎస్టీ కూడా అదనంగా ఉండనుంది. ఇకపోతే బ్యాంక్ కస్టమర్లు నెలలో ఏటీఎం నుంచి 5 సార్లు చార్జీలు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి మెట్రో నగరాల్లో 3 సార్లు, నాన్ మెట్రో నగరాల్లో 5 సార్లు చార్జీలు లేకుండా ట్రాన్సాక్షన్లు జరపవచ్చు. వీటి అనంతరం చేసే తదుపరి ట్రాన్సాక్షన్ కు రూ. 21 అదనంగా చెల్లించాల్సిందే.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత జూన్ నెలలోనే చార్జీల పెంపునకు అనుమతి ఇస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది అధిక ఇంటర్ఛేంజ్ ఫీజు నేపథ్యంలో బ్యాంకులకు కొంత ఉపశమనం కలిగించేందుకు 2022 జవనరి 1 నుంచి ఏటీఎం క్యాష్ విత్డ్రాయెల్ చార్జీలను రూ.21కు పెంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నూతన ఏడాది నుంచి ఏటీఎం క్యాష్ విత్డ్రాయెల్స్పై చార్జీల మోత మోగనుంది. అయితే ఈ ఫైన్ ను తప్పించుకోవాలని భావిస్తే.. ఒకేసారి పెద్ద అమౌంట్ ను విత్డ్రాయెల్ చేసుకుని పెట్టుకుంటే మంచిది. చిన్న చిన్న అమౌంట్ కే తరచూ ఏటీఎంలకు వెళ్తూ ఉంటే మాత్రం చార్జీల బాదుడు తప్పదనే చెప్పాలి.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.