
BJP : ఢిల్లీలో చక్రం తిప్పిన వైయస్ జగన్.. టీడీపీ తో బీజేపీ పొత్తు క్యాన్సిల్..!
BJP : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫీవర్ కొనసాగుతుంది.గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పొత్తు లేకుండా సింగిల్ గా బరిలోకి దిగుతున్నారు.ఇక తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలవాలంటే నరేంద్ర మోడీ సపోర్ట్, పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉండాలని జనసేన, బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. గతంలో నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు నానా మాటలు అన్న సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా అన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో పోటీ చేసిన సందర్భం ఉంది. ఇవన్నీ నరేంద్ర మోడీ మర్చిపోయినట్టుగా లేరు. పొత్తు కుదిరిందన్న సంతోషం లేకుండా కొన్ని రకాల పరిస్థితులను క్రియేట్ చేసుకుంటూ వెళుతున్నారు. ముఖ్యంగా కీలకమైన ఎంపీ స్థానాలను బీజేపీ చాలా గట్టిగా కోరుకుంటుంది.
కీలక ఎంపీ స్థానాలైనా రాజమండ్రి, తిరుపతి, విజయవాడ వెస్ట్ లను టీడీపీ వదులుకున్నట్లుగా తెలుస్తుంది. ఎంతో కీలకమైన ఈ మూడు స్థానాలను బీజేపీ పోటీ చేయబోతుందని విశ్వసనీయ సమాచారం. దీనిపైన రెండు మూడు రోజుల్లో అధికార ప్రకటన రాబోతుంది. దీంతో నరేంద్ర మోడీ గతంలో చంద్రబాబు చెప్పినట్లుగా వినే పరిస్థితిలో లేరు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు బీజేపీకి లొంగి ఉండాల్సిందే అన్నట్లుగా ఉంది. అయితే ఎవరు మీద ఉన్న కేసులు వాళ్ళు బయటికి రాకుండా నరేంద్ర మోడీ సపోర్ట్ కోసం చూస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివేకానంద హత్య కేసు ఇలా కొన్ని కేసులు బయటికి రాకుండా ఉండాలంటే నరేంద్ర మోడీ సపోర్ట్ ఉండాలని వీరు పరితపిస్తున్నారని అందుకే చంద్రబాబు నాయుడు పొత్తు కోసం ఎగబడ్డారని అంటున్నారు.
అయితే ఉమ్మడి సభ నిర్వహించాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని కోరారు. అయితే నరేంద్ర మోడీ ఈ సభకు రానని కరాకండిగా చెప్పారట. అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఉమ్మడి సభకు నరేంద్ర మోడీ రాకపోవడం చంద్రబాబు నాయుడు పెద్ద షాక్ అని అంటున్నారు. ఒకవేళ నరేంద్ర మోడీ వస్తే అది వైయస్ జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ న్యూస్ అవుతుంది. ఇక ఉమ్మడి సభ మార్చి 17న జరగనుందని సమాచారం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ సభను నిర్వహించనున్నాయి. ఒకే వేదికపై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఉంటే 2014 మళ్ళీ రిపీట్ అవుతుందని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ సభకు రానని కరాకండిగా చెప్పారని సమాచారం. ఇది నిజంగా చంద్రబాబు నాయుడుకి బ్యాడ్ న్యూస్ అని అంటున్నారు. పొత్తు కోసం పరితపించిన చంద్రబాబు నాయుడుకి నరేంద్ర మోడీ రానని చెప్పడం పెద్ద బ్యాడ్ న్యూస్ అని అంటున్నారు.
Summer Drinks : ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ఈ కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.…
Ajwain Water : మన వంటింట్లో ఉండే సాధారణ పోపు దినుసుల్లో వాముకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం నుంచి…
Curry Leaves : మన వంటగదిలో కరివేపాకు లేకుండా వంట పూర్తి కావడం కష్టం. ప్రతి కూరలోనూ, పప్పులోనూ ఇది…
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
This website uses cookies.