Chiranjeevi : మెగాస్టార్‌ కు.. మెగా ఫ్యాన్స్ కు బీజేపీ గాలమే ఈ పరామర్శ?

Chiranjeevi  : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. తెలంగాణలో ఒక మోస్తరుగా ఉన్న బీజేపీ ఏపీలో కూడా తమ ఉనికి చాటుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. వివాదంతోనో లేదా మరో విధంగానో ఏపీ రాజకీయాల్లో తమ పాత్ర ఉండాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. బీజేపీ రాజకీయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీపై కూడా పడ్డట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే జనసేన పార్టీ మరియు బీజేపీ లు మిత్ర పక్షాలుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మద్దతుతో ఏపీ మరియు తెలంగాణలో కుమ్మేయాలని బీజేపీ భావిస్తుంది. అందుకోసం ఇంకాస్త పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. జనసేన పార్టీ అధినేత పవన్‌ తమ పక్షాణ ఉండటం వల్ల బలం పెరిగడం ఖాయం. ఇదే సమయంలో మెగాస్టార్‌ మరియు వారి అభిమానులు కూడా బీజేపీని నమ్మాలి.. వెంట రావాలి అని పార్టీ అధినాయకత్వం భావిస్తుంది. అందుకే పరామర్శలు పెట్టినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ను స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించాడు. యాక్సిడెంట్‌ అయ్యి నెలలు గడుస్తున్నాయి.. పూర్తిగా కోలుకుని మళ్లీ షూటింగ్ లకు రెడీ అవుతున్న సాయి ధరమ్‌ తేజ్‌ ను కిషన్ రెడ్డి కలవడం చర్చనీయాంశంగా మారింది. సాయి ధరమ్‌ తేజ్ ను కలవడం వల్ల ఖచ్చితంగా చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ లకు మరింతగా దగ్గర అయ్యే అవకాశం బీజేపీ కి దక్కతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకే మెగాస్టార్‌ చిరంజీవి ని మచ్చిక చేసుకుని న్యూట్రల్‌ గా ఉన్న ఆయన బీజేపీ కి మద్దతుగా మాట్లాడటం లేదా తమ్ముడు జనసేన పార్టీ ద్వారా అయినా బీజేపీకి మద్దతుగా నిలవడం చేస్తాడనే ఉద్దేశ్యంతో బీజేపీ ఈ వ్యూహంను అమలు చేసి ఉంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు.

bjp trying to get support from mega star Chiranjeevi and mega fans

రాజకీయ నాయకులు ఏం చేసినా కూడా రాజకీయం అనడంలో తప్పు లేదు. వారు వేసే ప్రతి అడుగు కూడా రాజకీయంగా ఆలోచించి వేస్తారు. కనుక సాయి ధరమ్‌ తేజ్ ను కలిసి మాట్లాడటం.. పరామర్శించడం ఊరికే అంటే ఇక్కడ నమ్మడానికి ఎవరు సిద్దంగా లేరు. మెగాస్టార్‌ చిరంజీవి మరియు మెగా ఫ్యాన్స్ ను బీజేపీ వైపు మరల్చుకోవడానికి మరియు జనసేనతో మరింత సన్నిహిత్యం పెంచుకోవడానికి బీజేపీ ఇలా వ్యవహరించి ఉంటుంది అనేది కొందరు రాజకీయ విశ్లేషకుల వాదన. తెలంగాణ మరియు ఏపీలో బీజేపీకి చిరు, పవన్‌, మెగా ఫ్యాన్స్ మద్దతు ఉంటే ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకం ఆ పార్టీ వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజంగానే బీజేపీ ఉనికి కాపాడుకోగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఆ ఉద్దేశ్యంతోనే కిషన్‌ రెడ్డి సుప్రీం హీరోను కలిసి ఉంటాడు.

Recent Posts

Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్‌.. బెడ్‌పై అత‌ను.. స్ర‌వంతి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు…

10 minutes ago

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

1 hour ago

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…

2 hours ago

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

3 hours ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

4 hours ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

5 hours ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

6 hours ago

Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు – ఈటెల..!

Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…

7 hours ago