
What If Chiranjeevi Support BJP
Chiranjeevi : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. తెలంగాణలో ఒక మోస్తరుగా ఉన్న బీజేపీ ఏపీలో కూడా తమ ఉనికి చాటుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. వివాదంతోనో లేదా మరో విధంగానో ఏపీ రాజకీయాల్లో తమ పాత్ర ఉండాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. బీజేపీ రాజకీయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీపై కూడా పడ్డట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే జనసేన పార్టీ మరియు బీజేపీ లు మిత్ర పక్షాలుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మద్దతుతో ఏపీ మరియు తెలంగాణలో కుమ్మేయాలని బీజేపీ భావిస్తుంది. అందుకోసం ఇంకాస్త పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. జనసేన పార్టీ అధినేత పవన్ తమ పక్షాణ ఉండటం వల్ల బలం పెరిగడం ఖాయం. ఇదే సమయంలో మెగాస్టార్ మరియు వారి అభిమానులు కూడా బీజేపీని నమ్మాలి.. వెంట రావాలి అని పార్టీ అధినాయకత్వం భావిస్తుంది. అందుకే పరామర్శలు పెట్టినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ను స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించాడు. యాక్సిడెంట్ అయ్యి నెలలు గడుస్తున్నాయి.. పూర్తిగా కోలుకుని మళ్లీ షూటింగ్ లకు రెడీ అవుతున్న సాయి ధరమ్ తేజ్ ను కిషన్ రెడ్డి కలవడం చర్చనీయాంశంగా మారింది. సాయి ధరమ్ తేజ్ ను కలవడం వల్ల ఖచ్చితంగా చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ లకు మరింతగా దగ్గర అయ్యే అవకాశం బీజేపీ కి దక్కతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకే మెగాస్టార్ చిరంజీవి ని మచ్చిక చేసుకుని న్యూట్రల్ గా ఉన్న ఆయన బీజేపీ కి మద్దతుగా మాట్లాడటం లేదా తమ్ముడు జనసేన పార్టీ ద్వారా అయినా బీజేపీకి మద్దతుగా నిలవడం చేస్తాడనే ఉద్దేశ్యంతో బీజేపీ ఈ వ్యూహంను అమలు చేసి ఉంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు.
bjp trying to get support from mega star Chiranjeevi and mega fans
రాజకీయ నాయకులు ఏం చేసినా కూడా రాజకీయం అనడంలో తప్పు లేదు. వారు వేసే ప్రతి అడుగు కూడా రాజకీయంగా ఆలోచించి వేస్తారు. కనుక సాయి ధరమ్ తేజ్ ను కలిసి మాట్లాడటం.. పరామర్శించడం ఊరికే అంటే ఇక్కడ నమ్మడానికి ఎవరు సిద్దంగా లేరు. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా ఫ్యాన్స్ ను బీజేపీ వైపు మరల్చుకోవడానికి మరియు జనసేనతో మరింత సన్నిహిత్యం పెంచుకోవడానికి బీజేపీ ఇలా వ్యవహరించి ఉంటుంది అనేది కొందరు రాజకీయ విశ్లేషకుల వాదన. తెలంగాణ మరియు ఏపీలో బీజేపీకి చిరు, పవన్, మెగా ఫ్యాన్స్ మద్దతు ఉంటే ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకం ఆ పార్టీ వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజంగానే బీజేపీ ఉనికి కాపాడుకోగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఆ ఉద్దేశ్యంతోనే కిషన్ రెడ్డి సుప్రీం హీరోను కలిసి ఉంటాడు.
YS Jagan Tour : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం…
Virosh Wedding Photos టాలీవుడ్లో Tollywood అభిమానులు ఎంతోకాలంగా “ఆన్ స్క్రీన్ మోస్ట్ వాంటెడ్ కపుల్” Vijay Devarakonda విజయ్…
Balakrishna Nagababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి…
YS Bharathi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు నందిపల్లి నందీశ్వర ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం పెద్ద చర్చకు దారితీసింది. వేంపల్లె…
Real Life Beggar : సినిమాల్లో తల్లి ఆరోగ్యం కోసం కోటీశ్వరుడైన కుమారుడు భిక్షాటన చేసే కథలు మనం చూసి…
SHANMUKH JASWANTH : సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక సంచలనం సృష్టిస్తూ ఉండే షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు మరోసారి…
Tallest Gandhi statue : హైదరాబాద్లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న…
Kethireddy : ధర్మవరం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తనదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. పార్టీలు…
Success Story of Woman - Bharti Pohorkar వ్యవసాయం దండగ అనే రోజుల్లో, సరైన శాస్త్రీయ విధానాలు పాటిస్తే…
Rythu Bharosa : తెలంగాణలో రైతు భరోసా నిధుల పంపిణీలో జరుగుతున్న జాప్యంపై అన్నదాతల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.…
Ind Vs Zim T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో గురువారం రెండు…
Sweepers : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు. ప్రత్యేకంగా…
This website uses cookies.