
KCR
TRS : అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు తమకు తోచిన సాయం చేసి.. రామమందిర నిర్మాణంలో పాలు పంచుకోవాలని బీజేపీ కోరింది. అందుకే.. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు చందాలు వసూలు చేస్తున్నారు. దీనిపై తెలంగాణలో చాలా గొడవలే జరిగాయి. టీఆర్ఎస్ కు చెందిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.. రామమందిరంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత తను క్షమాపణలు చెప్పడంతో అంతా సద్దుమణిగింది. ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల సీఎం కేసీఆర్ కు కూడా ఇబ్బందులు తలెత్తాయి.
bjp workers attack parkal mla challa dharma reddy house in hanmakonda
తాజాగా టీఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేసి అడ్డంగా బుక్కయ్యారు. రాముడి పవిత్రతనే బీజేపీ అపవిత్రం చేస్తోంది.. అంటూ పర్కాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు.
ఆయన హన్మకొండలో నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి.. దాడికి యత్నించారు. ఆయన ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. వందల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు ధర్మారెడ్డి ఇంటికి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నది.
రాముడి పవిత్రతను అపవిత్రం చేయడమే కాకుండా.. బీజేపీ నాయకులు ఇష్టమున్నట్టు చందాలు వసూలు చేస్తున్నారని.. ధర్మారెడ్డి.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. అసలు.. వీళ్లు వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయో? అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇలా చందాల పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం ఏంటి? అంటూ ప్రశ్నించడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడికి తెగబడ్డారు.
అయితే.. ఇప్పటికే విద్యాసాగర్ రావు.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి మళ్లీ క్షమాపణ చెప్పి తప్పించుకున్నారు. మళ్లీ.. మరో ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో.. కేసీఆర్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదట. పార్టీ పరువును కొందరు నాయకులు బజారుకీడుస్తున్నారని తన సన్నిహితుల వద్ద కేసీఆర్ వాపోయారట. ఇప్పటికే పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న నేపథ్యంలో పార్టీ నేతలు ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో.. కేసీఆర్ కు కొత్త తలనొప్పి వచ్చి చేరిందంటూ వార్తలు వస్తున్నాయి. మరి.. ఇలాంటి వాళ్లు పార్టీ పరువును గంగలో కలపకుండా ఉండటానికి కేసీఆర్ ఏం చేస్తారో వేచి చూడాలి.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
Husband : గుజరాత్లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
Vivo S60 : స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
RCB Vs GT Final : ఐపీఎల్ 2026 సీజన్కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…
This website uses cookies.