TRS : అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు తమకు తోచిన సాయం చేసి.. రామమందిర నిర్మాణంలో పాలు పంచుకోవాలని బీజేపీ కోరింది. అందుకే.. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు చందాలు వసూలు చేస్తున్నారు. దీనిపై తెలంగాణలో చాలా గొడవలే జరిగాయి. టీఆర్ఎస్ కు చెందిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.. రామమందిరంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత తను క్షమాపణలు చెప్పడంతో అంతా సద్దుమణిగింది. ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల సీఎం కేసీఆర్ కు కూడా ఇబ్బందులు తలెత్తాయి.
తాజాగా టీఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేసి అడ్డంగా బుక్కయ్యారు. రాముడి పవిత్రతనే బీజేపీ అపవిత్రం చేస్తోంది.. అంటూ పర్కాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు.
ఆయన హన్మకొండలో నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి.. దాడికి యత్నించారు. ఆయన ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. వందల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు ధర్మారెడ్డి ఇంటికి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నది.
రాముడి పవిత్రతను అపవిత్రం చేయడమే కాకుండా.. బీజేపీ నాయకులు ఇష్టమున్నట్టు చందాలు వసూలు చేస్తున్నారని.. ధర్మారెడ్డి.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. అసలు.. వీళ్లు వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయో? అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇలా చందాల పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం ఏంటి? అంటూ ప్రశ్నించడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడికి తెగబడ్డారు.
అయితే.. ఇప్పటికే విద్యాసాగర్ రావు.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి మళ్లీ క్షమాపణ చెప్పి తప్పించుకున్నారు. మళ్లీ.. మరో ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో.. కేసీఆర్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదట. పార్టీ పరువును కొందరు నాయకులు బజారుకీడుస్తున్నారని తన సన్నిహితుల వద్ద కేసీఆర్ వాపోయారట. ఇప్పటికే పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న నేపథ్యంలో పార్టీ నేతలు ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో.. కేసీఆర్ కు కొత్త తలనొప్పి వచ్చి చేరిందంటూ వార్తలు వస్తున్నాయి. మరి.. ఇలాంటి వాళ్లు పార్టీ పరువును గంగలో కలపకుండా ఉండటానికి కేసీఆర్ ఏం చేస్తారో వేచి చూడాలి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.