Family Died : తమిళనాడులోని ఓ కుటుంబం మొత్తం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోయంబత్తూరుకు చెందిన మణి కంఠన్ (36)కు భార్య తార (35), ఇద్దరు పిల్లలు ధరణ్ (10), దహాన్ (1) పెరియార్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. చెన్నై లోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న మణి కంఠన్.. భార్యతో మనస్పర్థల కారణంగా ఆగ్రహానికి గురై క్రికెట్ బ్యాట్తో ఆమెను కొట్టి చంపి..
అనంతరం తన ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను వంటగదిలోకి ఉరి వేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తార తలకు తీవ్ర గాయాలు కనిపించగా, చిన్నారులిద్దరూ పిల్లలు ఊపిరాడక చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. మణి కంఠన్ ఇరుగుపొరుగు వారిని, సహోద్యోగులను విచారించగా వారికి ఊహించని విషయాలు తెలిశాయని చెప్పారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్కు బానిసైన మణికంఠ…
స్నేహితుల నుంచి అప్పుచేశాడని తెలిపారు. భారీ అప్పుల పాలై.. ఉద్యోగానికి సరిగ్గా వెళ్లే వాడు కాదని చెప్పారు. కంప్యూటర్ కు బాగా అలవాటై ఇంట్లోనే ఉంటూ తరచూ భార్యతో గొడవలు పడే వాడని.. ఆ కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చునని ఇరుగుపొరుగు వారు అంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Tirupati Laddu : తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత…
Bigg Boss Telugu 8 : ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నో…
Sleep : మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లివర్…
Free Gas Cylinder : ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుదలతో పని చేస్తోంది. టిడిపి, జనసేన మరియు…
Yoga : ప్రస్తుతం చాలా మంది శారీరక శ్రమ చేసే ఉద్యోగం కంటే ఆఫీసులో ఒకే చోట కూర్చొని పనిచేస్తూ ఎక్కువ…
RRB NTPC Recruitment : RRB రైల్వే నాన్-టెక్నికల్ పాపులర్ (NTPC) కేటగిరీల మొత్తం 11,558 పోస్టుల కోసం రిక్రూట్మెంట్ను…
Zodiac Signs : సెప్టెంబర్ నెల 24, 25వ తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అలాగే అదే రోజు…
Bay Leaf Water : ప్రస్తుత కాలంలో బిర్యానీ నుండి నాన్ వెజ్ వంటకాల వరకు బే ఆకులను ప్రతి…
This website uses cookies.