
Breaking New Districts in Andhra Pradesh
Andhra Pradesh : 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మిగిలి ఉంది. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇటీవల 13 జిల్లాల ఏపీని 26 జిల్లాలుగా మార్చడం తెలిసిందే. అదనంగా 13 జిల్లాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త జిల్లా ఏర్పడే అవకాశం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనకు అనువుగా మరో జిల్లా ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. గిరిజనులకు పాలన అందుబాటులో ఉండేందుకు సీఎం జగన్ అరకు పార్లమెంటరీను రెండు జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది.
Breaking New Districts in Andhra Pradesh
అయితే త్వరలో మూడో జిల్లా కూడా ఏర్పడే అవకాశం ఉందని… దీనిపై సీఎం జగన్ ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడి ఏడాది కావటంతో ఆవిర్భావ వేడుకలలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లా కి ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని తెలియజేశారు. జిల్లాలో నూతన కలెక్టరేట్ మరియు వైద్య కళాశాల నిర్మాణానికి అవసరమైన భూములను గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. వైద్య కళాశాల నిర్మాణం
నిమిత్తం 600 కోట్ల రూపాయలు మంజూరైనట్లు త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష కార్యక్రమం కింద 21,353 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అందువల్లే రాష్ట్రవ్యాప్తంగా 306 రైతు బరోస కేంద్రాల ద్వారా వేల మంది రైతులకు విత్తనాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే రైతు భరోసా ద్వారా 1.34 లక్షల మంది రైతులకు రూ.185 కోట్లు చెల్లించామన్నారు. పూర్తిస్థాయిలో అభివృద్ధికి కొంత సమయం పడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర వ్యాఖ్యానించారు.
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
This website uses cookies.