7th Pay Commission : 7వ వేతన సంఘంకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తుంది. డీఏ పెంపు సహా మరో రెండు నిర్ణయాలు త్వరలో తీసుకోబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. గత కొద్ది రోజులుగా డియర్నెస్ అలవెన్స్ పెంపు కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుతో పాటు డీఏ బకాయిల విడుదలపైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అంతేకాదు… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ కూడా పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం 31 శాతం డీఏ పొందుతున్నారు. మరో 3 శాతం డీఏ పెరగనుందని అంచనా.2022 జనవరికి సంబంధించిన డీఏ ఇది కాగా, డీఏ 3 శాతం పెరిగితే ఇక ఉద్యోగులకు 34 శాతం డీఏ లభించనుంది.
డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెండు సార్లు ఉద్యోగులకు డీఏ పెంచుతుంది. ఉద్యోగులకు డీఏ పెరిగినప్పుడు పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ అంటే డీఆర్ కూడా పెరుగుతుంది. డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటాను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ డేటా ప్రకారం 3 శాతం లేదా 4 శాతం డీఏ పెంచుతుంది.2021 జూలైలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం, 18 శాతం, 9 శాతం చొప్పున హౌజ్ రెంట్ అలవెన్స్ ప్రకటించింది ప్రభుత్వం. ఈ శ్లాబ్స్ ఉద్యోగులు నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. ఉద్యోగులకు డీఏ పెరిగితే అందుకు తగ్గట్టుగా హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
డీఏ బకాయిల విడుదలపైనా కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం రూ.34,402 కోట్ల బకాయిలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో జమ కానున్నాయి.లెవెల్ 1 ఉద్యోగులకు రూ.11,880 నుంచి రూ.37,554 మధ్య, లెవెల్ 13 ఉద్యోగులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 మధ్య డీఏ బకాయిలు విడుదలవుతాయి. దీనిపై కేబినెట్ సెక్రటరీతో చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వ్యయ శాఖ వార్షిక నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 48 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, దాదాపు 60 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.