good news higher education central govt employees to get incentives
7th Pay Commission : 7వ వేతన సంఘంకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తుంది. డీఏ పెంపు సహా మరో రెండు నిర్ణయాలు త్వరలో తీసుకోబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. గత కొద్ది రోజులుగా డియర్నెస్ అలవెన్స్ పెంపు కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుతో పాటు డీఏ బకాయిల విడుదలపైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అంతేకాదు… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ కూడా పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం 31 శాతం డీఏ పొందుతున్నారు. మరో 3 శాతం డీఏ పెరగనుందని అంచనా.2022 జనవరికి సంబంధించిన డీఏ ఇది కాగా, డీఏ 3 శాతం పెరిగితే ఇక ఉద్యోగులకు 34 శాతం డీఏ లభించనుంది.
డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెండు సార్లు ఉద్యోగులకు డీఏ పెంచుతుంది. ఉద్యోగులకు డీఏ పెరిగినప్పుడు పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ అంటే డీఆర్ కూడా పెరుగుతుంది. డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటాను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ డేటా ప్రకారం 3 శాతం లేదా 4 శాతం డీఏ పెంచుతుంది.2021 జూలైలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం, 18 శాతం, 9 శాతం చొప్పున హౌజ్ రెంట్ అలవెన్స్ ప్రకటించింది ప్రభుత్వం. ఈ శ్లాబ్స్ ఉద్యోగులు నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. ఉద్యోగులకు డీఏ పెరిగితే అందుకు తగ్గట్టుగా హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
central govt employees to get rs 2 lakh as 18 months
డీఏ బకాయిల విడుదలపైనా కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం రూ.34,402 కోట్ల బకాయిలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో జమ కానున్నాయి.లెవెల్ 1 ఉద్యోగులకు రూ.11,880 నుంచి రూ.37,554 మధ్య, లెవెల్ 13 ఉద్యోగులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 మధ్య డీఏ బకాయిలు విడుదలవుతాయి. దీనిపై కేబినెట్ సెక్రటరీతో చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వ్యయ శాఖ వార్షిక నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 48 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, దాదాపు 60 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.