Chandra Babu : మొదట ఐఏఎస్ కావాలనుకున్న నారా చంద్రబాబు నాయుడు chandra babu.. తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకొని రాజకీయాల్లోకి వచ్చారు. పాలిటిక్సులో అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు నెలకొల్పారు. మనం ఏ రంగంలో ఉన్నా ఛాన్సులను చేజిక్కించుకోవాలని, వాటిని సక్రమంగా వాడుకొని పైకి రావాలని చంద్రబాబు నాయుడు chandra babu చెబుతుంటారు. అయితే ఆయన మూడోసారి సీఎం అయ్యాక తనకు అందివచ్చిన ఓ సువర్ణావకాశాన్ని చేజార్జుకున్నారు. అందువల్లే ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజనరీ చీఫ్ మినిస్టర్ గా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎందుకు తప్పులో కాలేశారు?.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని హైదరాబాద్ ను తెగ డెవలప్ చేశానని ఒకటికి పది సార్లు డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబు నాయుడు.. విశాఖపట్నాన్ని కూడా భాగ్య నగరానికి ధీటుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. వైజాగ్ ఏపీకి ఆర్థిక, పర్యాటక, కల్చరల్ కేపిటల్ అని చంద్రబాబు నాయుడు చెప్పేవారు. ప్రభుత్వ పరిపాలనకు రాజధానిగా ఎదిగే అన్ని సౌకర్యాలూ విశాఖపట్నానికి ఉన్నాయని అంచనా వేశారు. మరి, విశాఖను విభజిత ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా ఎంపిక చేసే సువర్ణావకాశం 2014లో చంద్రబాబు నాయుడికి వచ్చినా ఎందుకు అమలుచేయలేదు?. అమరావతిని తెర మీదికి తెచ్చి అటూ ఇటూ కాకుండా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వైజాగ్ ను రాజధాని చేయాలనే డిమాండ్ ఆరు దశాబ్దాల నుంచీ వినిపిస్తోంది. 2014లో రాజధాని ఎంపిక విషయం తెర మీదికి వచ్చినప్పుడు కూడా జనం ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు chandra babuకు గుర్తు చేశారు. అయినా ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు. రాజధాని కాగల అన్ని అవకాశాలూ ఉన్న విశాఖపట్నాన్ని వదిలేసి కొత్తగా అమరావతి జపం చేశారు. సరే. జరిగిందేదో జరిగిపోయింది. ఆ పొరపాటును ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరిచేస్తుంటే కోర్టుల్లో కేసులు వేయటం ద్వారా అడ్డుపుల్లలు వేయటం ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడికి సమంజసంగా అనిపిస్తోందా?.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇప్పటికి ఏడేళ్లు. 2014లోనే విశాఖను ఏపీకి రాజధానిగా సెలెక్ట్ చేసుంటే ఇప్పటికే చాలా డెవలప్మెంట్ జరిగేది. తాత్కాలిక రాజధాని నిర్మాణాల పేరుతో అమరావతిలో ఖర్చు చేసిన వేల కోట్ల రూపాయలు వేస్ట్ కాకుండా మిగిలేవి. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు కాకుండా ఒడ్డునే ఉండేది. ఏపీ రాజధాని విషయంలో ఇప్పటికీ ఒక క్లారిటీ రాకపోవటానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబే ముఖ్య కారణం అని, ఆయన ముందుచూపు ప్రదర్శించకపోవటమే ప్రధాన లోపమని చెప్పొచ్చు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.