
strict measures taken in telangana govt in awake of covid third wave
Pension for farmers : రాష్ట్రంలోని అన్నదాతలను ఆదుకునేందుకు తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వ్యవసాయం దండగ కాదు పండగ అని ప్రతీరైతు అనుకునేలా వారి బాగుకోసం నెలనెలా పింఛన్ పథకాన్ని తీసుకుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమైనట్టు సమాచారం. రానున్న బడ్జెట్లో రైతులకు పింఛన్ స్కీం అమలు చేస్తే రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుంది. ఈ స్కీమ్ వర్కౌట్ అవుతుందా? లేదా అనే సాధ్యాసాధ్యాలపై ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. కొండపోచమ్మసాగర్ ప్రారంభోత్సవం సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలోనే రైతులకు శుభవార్త చెబుతానని ప్రకటించారు.
ప్రస్తుతం తెలంగాణ సర్కార్ పైన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉపఎన్నికలు వచ్చిన ప్రతీసారి చివరి గింజ వరకు వడ్లను మేము కొంటామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఇప్పుడు మాటమార్చారు. కేంద్రం ధాన్యం కొనడం లేదని అందుకే యాసంగిలో వరి వేయొద్దని సర్కార్ రైతులను బెదిరిస్తున్నది. ధాన్యాన్ని సర్కార్ కొనకపోవడంతో పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రైతుల్లోనే కాకుండా నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలా ప్రతీ ఒక్కరు టీఆర్ఎస్పై వ్యతిరేకత చూపిస్తున్నారు.
cm kcr announce monthly pension scheme to farmers
ఈ నేపథ్యంలోనే పార్టీపై, మంత్రులు, నేతలపై ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ రైతులకు పింఛన్ ఇస్తానని మరో కొత్త నాటకానికి తెరలేపారని అంతా అనుకుంటున్నారు. దళితబంధు మాటలకే పరిమితమైంది. రైతు బంధు కొందరు రైతులకు మాత్రమే వస్తోంది. అందరికీ రావడం లేదు. దీంతో అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారు. వారిని సముదాయించేందుకు కేసీఆర్ నెలనెలా పింఛన్ స్కీం తెచ్చారని, కానీ ఇది అమలుకు నోచుకునేనా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, 47 ఏళ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులు ఆ పథకానికి అర్హులు. వీరికి నెలనెలా రూ.2,016 పింఛన్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో రైతుబంధు పథకం లబ్దిదారులు 67 లక్షల మంది ఉండగా, వీరిలో 47 ఏళ్లు నిండిన వారు ఎంత, 49 ఏళ్లు నిండిన వాళ్లు ఎంతమంది ఉన్నారనే విషయంపై పూర్తి వివరాలను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. 3 నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు పింఛన్ ఇచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
Rythu Bharosa : Telangana రాష్ట్రవ్యాప్తంగా రైతులు ‘రైతు భరోసా’ పథకం కింద ప్రభుత్వం అందించనున్న యాసంగి పెట్టుబడి సాయానికి…
Today Gold Price on January 29th 2026 : బంగారం మరియు వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.…
Brahmamudi Today Episode Jan 29 : బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahma Mudi). కావ్య…
Karthika Deepam 2 Today Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ 'కార్తీకదీపం: ఇది నవ వసంతం'…
Banana Peels: ప్రతిరోజూ వంట చేయడం అనేది ప్రతి ఇంట్లో సాధారణమే. అయితే రోజూ వాడే పాత్రలపై నూనె మొండి…
Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
This website uses cookies.