
ap govt announced new 26 districts in state
CM Ys Jagan : తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) పాలక మండలి పదవీ కాలం ముగిసి వారం రోజులు కావొస్తోంది. కానీ కొత్త బోర్డును ఇంకా ఏర్పాటు చేయలేదు. నూతన పాలక మండలి నియామకం కోసం కొంత ఎక్సర్ సైజ్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటుచేశారు. ఆ కసరత్తు సైతం పూర్తికావొచ్చినట్లు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ సహా బోర్డు మెంబర్స్ గా కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నట్లు చెబుతున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొనే సీఎం జగన్ స్టడీ చేయించినట్లు తెలుస్తోంది.
Ysrcp
ప్రస్తుతం ఖాళీగా ఉన్న టీటీడీ చైర్మన్ పదవిని భర్తీ చేసే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తున్నారని సమాచారం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ గా కనుమూరి బాపిరాజును నియమించిన సంగతి తెలిసిందే. కనుమూరి బాపిరాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కాబట్టి మళ్లీ అదే సామాజిక వర్గానికి టీటీడీ చైర్మన్ పోస్టును ఇవ్వాలని జగన్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో ఎక్కువ పదవులను రెడ్డి కులస్తులకే ఇస్తున్నారనే అపవాదును వైఎస్సార్సీపీ ప్రభుత్వం మోస్తోంది. అందుకే దాన్నుంచి బయటపడటానికి సీఎం వైఎస్ జగన్ చివరికి తన బాబాయి వైవీ సుబ్బారెడ్డిని కూడా పక్కన పెట్టినట్లు అర్థంచేసుకోవచ్చు.
ys-jagan-ap-cm-ys-jagan-sketch-for-second-time-victory
టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డినే కొనసాగిస్తారని లేదా గతంలో ఒకసారి పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి ఛాన్స్ ఇస్తారని రకరకాలుగా ప్రచారం జరిగింది. కానీ అవేవీ నిజం కాలేదు. వైవీ సుబ్బారెడ్డిని ప్రస్తుతం పక్కన పెట్టినా ఆయనకు తగిన పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. పార్లమెంటులోని పెద్దల సభకు వెళ్లాలనుకుంటే కొన్నాళ్లు వెయిట్ చేయాలని వైవీ సుబ్బారెడ్డికి ముందే చెప్పారని అంటున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు శ్రీశైలం దేవస్థాన పాలక మండలి, ఇతర నామినేటెడ్ పోస్టులను పార్టీ నాయకులకు అప్పగించేందుకు అధినాయకుడు వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ సీనియర్ నేతలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. వాళ్ల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కొంత మంది పేర్లను రికమెండ్ చేసిందని అంటున్నారు. అసలే ఇప్పుడు కమలం పార్టీకి, వైఎస్సార్సీపీకి మధ్య బంధం బలపడుతోంది. అందుకే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో టీటీడీతోపాటు ఇతర ఆలయాల పాలకమండళ్లలో మార్పులు చేర్పులకు రంగం సిద్ధం చేస్తున్నారు.
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
This website uses cookies.