
ap govt announced new 26 districts in state
CM Ys Jagan : తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) పాలక మండలి పదవీ కాలం ముగిసి వారం రోజులు కావొస్తోంది. కానీ కొత్త బోర్డును ఇంకా ఏర్పాటు చేయలేదు. నూతన పాలక మండలి నియామకం కోసం కొంత ఎక్సర్ సైజ్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటుచేశారు. ఆ కసరత్తు సైతం పూర్తికావొచ్చినట్లు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ సహా బోర్డు మెంబర్స్ గా కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నట్లు చెబుతున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొనే సీఎం జగన్ స్టడీ చేయించినట్లు తెలుస్తోంది.
Ysrcp
ప్రస్తుతం ఖాళీగా ఉన్న టీటీడీ చైర్మన్ పదవిని భర్తీ చేసే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తున్నారని సమాచారం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ గా కనుమూరి బాపిరాజును నియమించిన సంగతి తెలిసిందే. కనుమూరి బాపిరాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కాబట్టి మళ్లీ అదే సామాజిక వర్గానికి టీటీడీ చైర్మన్ పోస్టును ఇవ్వాలని జగన్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో ఎక్కువ పదవులను రెడ్డి కులస్తులకే ఇస్తున్నారనే అపవాదును వైఎస్సార్సీపీ ప్రభుత్వం మోస్తోంది. అందుకే దాన్నుంచి బయటపడటానికి సీఎం వైఎస్ జగన్ చివరికి తన బాబాయి వైవీ సుబ్బారెడ్డిని కూడా పక్కన పెట్టినట్లు అర్థంచేసుకోవచ్చు.
ys-jagan-ap-cm-ys-jagan-sketch-for-second-time-victory
టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డినే కొనసాగిస్తారని లేదా గతంలో ఒకసారి పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి ఛాన్స్ ఇస్తారని రకరకాలుగా ప్రచారం జరిగింది. కానీ అవేవీ నిజం కాలేదు. వైవీ సుబ్బారెడ్డిని ప్రస్తుతం పక్కన పెట్టినా ఆయనకు తగిన పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. పార్లమెంటులోని పెద్దల సభకు వెళ్లాలనుకుంటే కొన్నాళ్లు వెయిట్ చేయాలని వైవీ సుబ్బారెడ్డికి ముందే చెప్పారని అంటున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు శ్రీశైలం దేవస్థాన పాలక మండలి, ఇతర నామినేటెడ్ పోస్టులను పార్టీ నాయకులకు అప్పగించేందుకు అధినాయకుడు వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ సీనియర్ నేతలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. వాళ్ల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కొంత మంది పేర్లను రికమెండ్ చేసిందని అంటున్నారు. అసలే ఇప్పుడు కమలం పార్టీకి, వైఎస్సార్సీపీకి మధ్య బంధం బలపడుతోంది. అందుకే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో టీటీడీతోపాటు ఇతర ఆలయాల పాలకమండళ్లలో మార్పులు చేర్పులకు రంగం సిద్ధం చేస్తున్నారు.
Today Horoscope 14th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శనివారం, ఫిబ్రవరి 14, 2026 నాడు గ్రహాల…
Couple Friendly Movie Review : ప్రముఖ నిర్మాణ సంస్థ UV Creations సమర్పణలో రూపొందిన తాజా యూత్ఫుల్ లవ్…
Seetha Payanam Movie Review : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా Arjun కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా Arjun…
Kalyan - Thanuja : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి రెండు నెలలు కావస్తున్నా, విన్నర్ కళ్యాణ్…
Sreeja : బిగ్బాస్ సీజన్-9 ద్వారా వెలుగులోకి వచ్చిన కామనర్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన…
Ysrcp : 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తో కేవలం 11 సీట్లే సాధించుకున్న వైసీపీ పార్టీ మళ్ళీ ఇప్పుడు…
Ys Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లి వేడుకకు వెళ్తే అది కాస్తా ఇప్పుడు…
Ram Charan Upasana Twins Names : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు సంబంధించి…
This website uses cookies.