Ys Jagan : జగనన్న కొత్త పథకం.. ఈబీసీ వారికి ఒక వరం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ys Jagan : జగనన్న కొత్త పథకం.. ఈబీసీ వారికి ఒక వరం

Ys Jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదల పాలిట దేవుడిగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఎస్.సి, ఎస్.టి మరియు మైనార్టీలకు అనేక విధాలుగా ఆర్థిక సాయం చేస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ బీసీ వారికి ఆర్థిక చేదోడు ను ఇచ్చేందుకు గాను ఒక పథకాన్ని తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ బీసీ లో ఉన్న పేదల కోసం చిరు వ్యాపారుల కోసం వడ్డీ లేని పది వేల రూపాయల రుణం ఇచ్చేందుకు […]

 Authored By himanshi | The Telugu News | Updated on :28 February 2022,6:00 pm

Ys Jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదల పాలిట దేవుడిగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఎస్.సి, ఎస్.టి మరియు మైనార్టీలకు అనేక విధాలుగా ఆర్థిక సాయం చేస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ బీసీ వారికి ఆర్థిక చేదోడు ను ఇచ్చేందుకు గాను ఒక పథకాన్ని తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ బీసీ లో ఉన్న పేదల కోసం చిరు వ్యాపారుల కోసం వడ్డీ లేని పది వేల రూపాయల రుణం ఇచ్చేందుకు గాను ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వ వర్గాల వారు మరియు అధికారులు అన్ని బ్యాంకుల తో ఈ విషయమై చర్చించినట్లు సమాచారం అందుతోంది.

రైతులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు గా ప్రకటించింది. ఈ ఆర్థిక సాయం తో ఈ బీసీ కి చెందిన పేదలు ప్రయోజనాలను వారు పొందుతారని వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ నుండి వచ్చిన మరో అద్భుతమైన ఆలోచన అంటూ ఆ పార్టీ నాయకులు కితాబిస్తున్నారు. ఈ బీసీ వారు అనేక ఆర్థిక పరమైన పథకాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. దాంతో వారికి సాయం కచ్చితంగా ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్యాంకుల నుండి ఈ బిసి వారు ఈ పది వేల రూపాయల లోను తీసుకోవచ్చు.

cm ys jagan to launch jagananna thodu scheme

cm ys jagan to launch jagananna thodu scheme

ఆ లోను కు సంబంధించిన వడ్డి పూర్తిగా ప్రభుత్వం చెల్లిస్తుంది. తీసుకున్న వారు కొన్నాళ్ల తర్వాత అప్పు అసలు చెల్లిస్తే సరిపోతుంది. సంవత్సరంకి ఒసారి ఈ పథకం ద్వారా రుణా లను ప్రభుత్వం ద్వారా బ్యాంకులో రికవరీ చేసి మళ్ళీ ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఈ పథకం అనేక విధాలుగా ప్రజలకు ఉపయోగదాయకం అంటూ ఆ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న వైకాపా ప్రభుత్వం సరికొత్త పథకం పేదలకు సంతోషాన్ని కలిగించడం ఖాయమంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పట్లాగే ఈ పథకం పై తెలుగు దేశం పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది