crores of rupees in farmers accounts
Farmer : ఆదిలాబాద్ జిల్లాలోని ముగ్గురు పేద రైతుల ఖాతాల్లో రూ.కోట్లు జమయ్యాయి. కానీ ఈ విషయంలో వారు అమాయకంగా ఉండటంతో వారి ఏటీఎం కార్డుల నుంచి కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకుడు రూ.కోటి 28 లక్షలు డ్రా చేశాడు. దీంతో తమ బ్రాంచ్ నుంచి డబ్బులు భారీగా డ్రా అయ్యాయనే విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు.. రైతుల వద్దకు వెళ్లి వాటిని రికవరీ చేససేందుకు ట్రై చేశారు. దీంతో అసలు విషయంబయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ పంచాయతీలోని సల్పలగూడ గ్రామానికి చెందిన రైతులకు ఆదిలాబాద్ పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి.
వాటిలో రైతులు భీంరావు, రాంబాయి, గంగాదేవికి కిసాన్ క్రెడిట్ కార్డులున్నాయి. వాటి నుంచి రూ.1,28,78,000 డ్రా అయినట్లు ఇటీవల బ్యాంక్ అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ కార్డు ద్వారా సుమారు రూ.2 లక్షల వరకే పరిమితి ఉంటుంది.విత్డ్రా అయిన డబ్బులను రికవరీ చేసేందుకు చీఫ్ మేనేజర్ తన సిబ్బందితో కలిసి ఇటీవల రైతుల వద్దకు వెళ్లారు. వారిన ఆరా తీయగా ఆ డబ్బులు తాము డ్రా చేయలేదని వారు చెప్పారు. అంత డబ్బు తాము డ్రా చేయలేదని మామిడిగూడ సీఎస్పీ నిర్వాహకుడు నుంచి విడతల వారీగా మొత్తం రూ.16.20 లక్షలు తీసుకున్నట్టు చెప్పారు.
crores of rupees in farmers accounts
మిగిలిన రూ.1,12,58,000 సీఎస్పీ నిర్వాహకుడు రైతుల పేరుతో డ్రా చేసుకున్నాడని బ్యాంకు మేనేజర్ వెల్లడించారు. ఈ మొత్తం నాలుగు నెలలుగా డ్రా చేయడంతో తాము ఏ ఖాతా నుంచి డబ్బులు డ్రా అవుతున్నాయో తెలుసుకోలేకపోయినట్లు వెల్లడించారు. ఇక సీఎస్పీ నుంచి ఇప్పటికే రూ.30 లక్షలు రికవరీ చేసిన అధికారులు.. రైతుల కిసాన్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మిగతా డబ్బులను చెల్లించేందుకు రైతులు అంగీకరించడంతో పోసులకు ఫిర్యాదు చేయలేదని మేనేజర్ తెలిపారు. అయితే డబ్బులు ఆ ఖాతాల్లోకి ఎలా జమయ్యయనే విషయంపై బ్యాంక్ అధికారులు స్పందించలేదు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.