
Ys Jagan Sankshema, A Nightmare For
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఆవిష్కరణ జరిగింది. 13 జిల్లాలుగా ఉన్న ఏపీ 26 జిల్లాల రాష్ట్రంగా అవతరించింది. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్లో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ కొత్త జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను ప్రారంభించారు. తొలుత పార్వతీపురం మన్యం జిల్లాను సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించారు. ఆ తర్వాత వరుసగా అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, నంద్యాల జిల్లా, శ్రీసత్యసాయి జిల్లాలను వరుసగా ప్రారంభించారు. అనంతరం మొత్తం 26 జిల్లాలతో కూడిన ఏపీ మ్యాప్ ను సీఎం ఆవిష్కరించారు.
ఈ రోజు నుంచి ఏపీలో కొత్త శకం ప్రారంభం కాబోతోందని సీఎం జగన్ అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణలో తొలి అడుగు ముందుకేశామని అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లాలల కలెక్టర్లు, అధికారులు, ఉద్యోగులకు బాధ్యతలు స్వీకరించారు. పాలనా వికేంద్రీకరణతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో కొన్నింటిని మార్పులు చేశామని, ప్రజల విన్నపాల మేరకు ఈ మార్పులు చేసినట్లు వివరించారు. నేటి నుంచి ప్రతి జిల్లాలో కొత్త కార్యాలయాల ద్వారానే సేవలు కొనసాగుతాయని, ఉద్యోగులు కొత్త కార్యాలయాల నుంచే విధులు నిర్వహిస్తారని సీఎం చెప్పారు.
development with decentralization of governance ys jagan
కాగా కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కూడా చర్చకు రాగా కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటును ప్రస్తావించిన జగన్ తనదైన శైలిలో చెప్పారు. కుప్పం స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు.. 14 ఏళ్లు ఆయన సీఎంగా ఉన్నా.. రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసులేక ప్రభుత్వానికి లేఖ రాశారని, స్థానిక ప్రజల ఆకాంక్షల మేరకు కుప్పంకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశామని సీఎం అన్నారు. చంద్రబాబు చేయలేని పనిని తాము చేశామని జగన్ చెప్పకనే చెప్పారు. చంద్రబాబు చేయలేని పనిని తాము చేసి చూపించామన్నారు.
Mana Shankara Vara Prasad Garu Ccollection : డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్…
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
This website uses cookies.