Ys Jagan : మరికొద్ది రోజుల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించబోతున్న సంగత తెలిసిందే. అయితే కేబినెట్లోకి కొత్తవారిని తీసుకుంటానని.. మాజీమంత్రులు పార్టీ కోసం పని చేయాలని ఆయన ఇప్పటికే నేతలకు సూచించారు. అయితే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయనే విషయమై పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.ఆంధ్రప్రదేశ్లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్పై విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి తొలి విడతలోనే మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని భావించినా ఆయన నిరాశ మిగిలింది.
ఈసారి మంత్రివర్గంలోకి స్థానం దక్కుతుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి భావిస్తున్నారు. కాగా ఆళ్ల వైసీపీలో సీనియర్ నేత. పైగా జగన్ కు నమ్మకమైన లీడర్. నారా లోకేష్ ను ఓడించి మరి మంగళగిరిలో రికార్డు సృష్టించారు. కాగా 2014లో పార్టీ అధికారంలోకి రాకపోయినా వైసీపీ నుంచి న్యాయస్థానంలో పోరాడి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును ముప్పుతిప్పలు పెట్టారు.దీంతో 2019లో చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ ను మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పై పోటీకి దింపారు. అయినా కూడా ఆళ్ల ప్రజా మద్దతుతో విజయం సాధించగలిగారు.
ఎన్నికల ప్రచారంలో జగన్ రామకృష్ణ రెడ్డి కి మంత్రి పదవి ఇస్తానని హామీ కూడా ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవి ఆళ్లకు దక్కలేదు. అయినా ఆయన ఎక్కడ అసంతృప్తికి గురి కాకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్లారు.కాగా తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను దృష్టిలో ఉంచుకుని జగన్ మంత్రి పదవి ఇవ్వడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెలలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అని చర్చ జరుగుతోంది.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.