Kalisundam Raa | ‘కలిసుందాం రా’ చిత్రాన్ని ఆ హీరో అలా ఎలా మిస్ చేసుకున్నాడు.. 24 ఏళ్ల తర్వాత మళ్లీ చర్చలోకి!

Authored By Sam C | The Telugu News | Published on: September 24, 2025, 8:00 pm

Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం, అప్పట్లో (2000) పొంగ‌ల్ కానుకగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. కానీ, ఈ హిట్ వెనక ఆసక్తికరమైన కథ ఉంది. అసలు ఈ సినిమాలో మొదట నటించాల్సిందిగా డైరెక్టర్ నాగార్జునను సంప్రదించాడట.

#image_title

నాగార్జున రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్

దర్శకుడు ఉదయ్ శంకర్ ‘కలిసుందాం రా’ స్క్రిప్ట్‌ను మొదట అక్కినేని నాగార్జునకు వినిపించారట. కానీ అప్పటికే నాగ్ వరుసగా కుటుంబ కథా చిత్రాల్లో నటించడంతో, మళ్లీ అదే జానర్ తీసుకోవడం ఇష్టం లేకపోవచ్చేమో. పైగా, ‘చంద్రలేఖ’, ‘సీతారామరాజు’ వంటి సినిమాల తర్వాత మరో ఫ్యామిలీ డ్రామా జనాల్లో అలసట రేపుతుందనిపించి, నాగార్జున ఆ స్క్రిప్ట్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

నాగార్జున వెనక్కి తగ్గిన తర్వాత అదే కథను వెంకటేశ్‌కు వినిపించిన ఉదయ్ శంకర్ – వెంటనే వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫలితంగా వెంకటేశ్-సిమ్రాన్ జంటతో తెరకెక్కిన ఈ సినిమా 2000 జనవరి 14న విడుద‌లై ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని పాటలు (‘ఎందుకిలా, యమున తీరానికి..’) అప్పట్లో ప్రేక్షకుల మనసులను కదిలించాయి. అలాగే, వెంకటేశ్ – సిమ్రాన్ మధ్య కెమిస్ట్రీనూ ప్రేక్షకులు ఎంతో ప్రేమగా ఆమోదించారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp