Dry Fish Curry : ఎండు చేపలు అంటే చేపలను పట్టిన తర్వాత వాటిని ఎండబెడతారు. ఇలా ఎండబెట్టిన వాటిని ఎండు చేపలు అంటారు. వీటిలో చాలా రకాలు ఉంటాయి. పెద్ద చేపలు, ఉప్పు చేపలు, రొయ్యలు, కడ్డీలు, ఇలా చాలా రకాలు ఉంటాయి. అయితే ఇలాంటి చేపలను కొందరు ఇష్టపడరు, కొందరు మాత్రం చాలా ఇష్టపడుతుంటారు. అయితే మనం ఇప్పుడు అందరూ ఇష్టపడేలా చేసుకుందాం. ఈ చేపల పులుసుని, దీనిని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.దీనికి కావలసిన పదార్థాలు: ఎండు చేపలు, చిక్కుడు గింజలు, వంకాయలు, ములక్కాయలు, కంద ము, పసుపు, కారం, ఉప్పు గరం మసాలా, చింతపండు పులుసు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతులు, ఆవాలు, కొత్తిమీర, ఆయిల్ మొదలైనవి.
దీని తయారీ విధానం: ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకొని దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్, వేసుకొని దానిలో పచ్చిమిర్చి నాలుగు చీలికలు తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు ముక్కలు సన్నగా తరిగినవి, తరువాత ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి వంకాయలు అలాగే ములక్కాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత దీనిలో కంద ముక్కలను, ఒక ఆరు ముక్కలు వేసుకోవాలి. వీటిని ఒక పది నిమిషాలు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. తర్వాత వీటిలో ఒక కప్పు టమాటా ముక్కలను, వేసుకోవాలి. తర్వాత పది నిమిషాల వరకు టమాటాలు మెత్తపడే వరకు ఉడకనివ్వాలి.
తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల కారం, రెండు స్పూన్ల ఉప్పు, వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత దీనిలో చింతపండు రసం పోసుకోవాలి. అలాగే ఒక పావు లీటర్ నీటిని కూడా పోసుకోవాలి. మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తరువాత శుభ్రపరిచిన చేపలను తీసుకొని దానిలో ఒక ఐదు ఆరు వరకు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 15 నిమిషాల వరకు, అంటే నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దింపే ముందు కొత్తిమీర ను చల్లుకొని దింపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చేపల పులుసు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.