Etela Rajender : మరోసారి తిరగబడ్డ ఈటల రాజేందర్.. వెంటనే క్యాంప్ ఆఫీసుకు పిలిచిన కేసీఆర్.. అసలేం జరుగుతోంది?

Advertisement
Advertisement

Etela Rajender : ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ మధ్య ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా పార్టీ గురించి బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మంత్రి ఈటల రాజేందర్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ పార్టీలో ముసలం ప్రారంభమైంది. సొంత పార్టీ నేతలే పార్టీపై బహిరంగంగా విమర్శలు చేస్తుంటే… పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోందోనని తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది.

Advertisement

etela rajender shocking comments on cm kcr

కట్ చేస్తే.. తాజాగా మరోసారి ఈటల రాజేందర్ తిరగబడ్డారు. మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

కరీంనగర్ జిల్లా వీణవంకను సందర్శించిన ఈటల… అక్కడ హాట్ కామెంట్స్ చేశారు. పేదలను తమ కాళ్లపై నిలబడేలా చేసే పథకాలను ప్రభుత్వం తీసుకురావాలంటూ ఈటల వెల్లడించారు.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పెన్షన్ల వల్ల, కల్యాణ లక్ష్మి లాంటి పథకాల వల్ల ప్రస్తుతం ఉన్న పేదరికం పోదంటూ ఈటల వ్యాఖ్యానించారు.

ఈటల మరోసారి తిరుగుబాటు స్వరం వినిపించగానే… వెంటనే మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాలు ముగియగానే… మంత్రి ఈటలను తన కారులో క్యాంప్ ఆఫీస్ కు తీసుకెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ తో మంత్రి ఈటల భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం జరిగింది? ఈటల, కేసీఆర్ ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు.. అనే విషయంపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొన్నది.

Etela Rajender : మంత్రివర్గ సమావేశంలో మంత్రి ఈటలను పక్కన పెట్టిన కేసీఆర్

అయితే… ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ దూరం పెట్టారు. దీంతో ఈటల రాజేందర్ మరోసారి తిరగబడినట్టు తెలుస్తోంది. ఏకంగా తెలంగాణ సర్కారుపై, సర్కారు ప్రవేశపెట్టిన పథకాలపై ఈటల రాజేందర్ విమర్శలు చేయడంతో సీఎం కేసీఆర్… ఈటలతో భేటీ అయినట్టు తెలుస్తోంది.

దీంతో ప్రస్తుతం వీళ్లిద్దరి సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కేసీఆర్, ఈటల మధ్య జరిగిన సమావేశంలో కేటీఆర్ కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వ వేదిక మీద ప్రభుత్వ పథకాల మీద ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి వ్యతిరేకంగా మాట్లాడటంతో… టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది… అనే విషయంపై సందిగ్ధత నెలకొన్నది.

మరోవైపు ఈటల రాజేందర్ అసెంబ్లీకి వచ్చిన తర్వాత… టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఆయనతో మాట్లాడటానికి సాహసించలేదు. కేవలం మంత్రి కేటీఆర్ మాత్రమే ఈటలతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే.. ఆయనను తన కారులోనే క్యాంప్ ఆఫీసుకు తీసుకెళ్లారు.

Advertisement
Advertisement

Recent Posts

Chicken : చికెన్ వారానికి ఎంత తినాలి? .. ఎక్కువ తింటే ఏమవుతుంది?

Chicken : చికెన్ అంటే చాలామందికి ఇష్టమే. ముఖ్యంగా ఆరోగ్యంపై అవగాహన పెరిగిన తర్వాత ప్రోటీన్ అవసరాల కోసం చికెన్‌ను…

14 minutes ago

Cumin water : అయ్యబాబోయి .. వారం రోజుల పాటు జీలకర్ర నీళ్లు తాగితే ఇన్ని లాభాలున్నాయా?

Cumin water : చిన్నగా కనిపించే జీలకర్ర మన వంటగదిలో తప్పనిసరిగా ఉండే పదార్థం. పోపు వేయాలన్నా, పప్పు లేదా…

1 hour ago

Today Horoscope 11th February 2026 : నేటి రాశి ఫలాలు 11 ఫిబ్రవరి 2026 : ఈ రాశి వారికి అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగొస్తుంది..!

Today Horoscope 11th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి 11, 2026 బుధవారం నాడు ద్వాదశ…

2 hours ago

PAK vs USA: అమెరికా భరతం పట్టిన పాక్ స్పిన్నర్లు.. 32 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం!

PAK vs USA: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…

9 hours ago

Congress Party : మూడుచింతలపల్లి మున్సిపల్ ఎన్నికల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ జోరు ప్ర‌చారం..!

Congress Party  : మున్సిపల్ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా…

10 hours ago

Chandrababu : చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ‘కనిపించని శక్తులు’ ?

Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh  రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి…

11 hours ago

Ram Charan Upasana Twins : ఉపాసన కవలపిల్లల డెలివరీ వెనక జరిగిన అసలు నిజం బయటపడింది

Ram Charan Upasana twins : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ mega power star Ram Charan …

12 hours ago

Ys Jagan : ఒకే ఒక్క ఫోన్ కొంప ముంచింది .. అడ్డంగా దొరికిన జగన్ బాబాయ్..!

Ys Jagan  : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా…

13 hours ago