Munugodu Exit Polls : తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా మునుగోడు ఉపఎన్నిక చర్చనీయాంశం అయింది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మునుగోడును చెప్పుకున్నారు. ఎంతో ఉత్కంఠభరితంగా ఎన్నికలు సాగాయి. మునుగోడు ఉపఎన్నికలు పూర్తికాగానే వెంటనే ఎగ్జిట్ పోల్స్ ను పలు సర్వే సంస్థలు ప్రకటించాయి. పీపుల్స్ పల్స్, ఆత్మ సాక్షి, త్రిశూల్, ధర్డ్ విజన్ లాంటి సంస్థలు మునుగోడు ఉపఎన్నికల్లో సర్వేలు నిర్వహించాయి. ఎన్నికలు పూర్తికాగానే వాటి ఫలితాలను ప్రకటించాయి.
అయితే.. దాదాపు అన్ని సర్వేసంస్థలు టీఆర్ఎస్ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వస్తాయని ప్రకటించాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుస్తారని స్పష్టం చేశాయి. ఆ తర్వాత రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నిలుస్తారని తెలిపాయి.
మొత్తం పోలైన ఓట్లలో ఆత్మసాక్షి సర్వే ప్రకారం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 41 నుంచి 42 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. బీజేపీ పార్టీకి 35 నుంచి 36 శాతం, కాంగ్రెస్ అభ్యర్థికి 16.5 శాతం నుంచి 17.5 శాతం, బీఎస్పీ అభ్యర్థికి 4 నుంచి 5 శాతం వరకు ఓట్లు వస్తాయని ప్రకటించింది. ఇక.. పీపుల్స్ పల్స్ అనే సంస్థ టీఆర్ఎస్ పార్టీకి 44.4 శాతం, బీజేపీ పార్టీకి 37.3 శాతం, కాంగ్రెస్ పార్టీకి 12.5 శాతం, ఇతర పార్టీలకు 5.8 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. థర్డ్ విజన్ సంస్థ సర్వే ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి 48 నుంచి 51 శాతం, బీజేపీకి 31 నుంచి 35 శాతం, కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 15 శాతం, బీఎస్పీకి 5 నుంచి 7 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. అయితే.. కేఏ పాల్ పార్టీ ప్రజా శాంతికి ఒక శాతం ఓట్లు వస్తాయని ధర్డ్ విజన్ సంస్థ తెలిపింది. ఇక.. త్రిశూల్ సంస్థ టీఆర్ఎస్ పార్టీకి 47 శాతం, బీజేపీ పార్టీకి 31 శాతం, కాంగ్రెస్ పార్టీకి 18 శాతం, ఇతర పార్టీలకు 4 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.