PM KISAN : రైతులకు శుభవార్త.. ఖాతాల్లో రూ.2,000 పడే సమయం వచ్చేసింది.. మీ పేరు ఉందో లేదో నిమిషాల్లో ఇక్కడ చెక్ చేసుకోండి..!

 Authored By sudheer | The Telugu News | Updated on :18 February 2026,12:00 pm

PM-KISAN : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 22వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద 22వ విడత నిధుల విడుదలకు సమయం ఆసన్నమైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ నెల 22వ తేదీన అర్హులైన రైతుల ఖాతాల్లో రూ. 2,000 చొప్పున జమ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల ఆ రోజున నిధులు విడుదల కాకపోతే, ఈ ఫిబ్రవరి నెల చివరి నాటికి (ఫిబ్రవరి 28 లోపు) ఖచ్చితంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు చేరుతుందని అధికారులు యోచిస్తున్నారు. దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

PM KISAN : రైతులకు శుభవార్త.. ఖాతాల్లో రూ.2,000 పడే సమయం వచ్చేసింది.. మీ పేరు ఉందో లేదో నిమిషాల్లో ఇక్కడ చెక్ చేసుకోండి..!

PM KISAN : రైతులకు శుభవార్త.. ఖాతాల్లో రూ.2,000 పడే సమయం వచ్చేసింది.. మీ పేరు ఉందో లేదో నిమిషాల్లో ఇక్కడ చెక్ చేసుకోండి..!

పథకం ఉద్దేశ్యం

దేశవ్యాప్తంగా ఉన్న సాగుదారులకు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో కేంద్రం ఏటా మూడు విడతల్లో మొత్తం రూ. 6,000 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఇప్పటివరకు 21 విడతల నిధులను విజయవంతంగా పంపిణీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు 22వ విడతను అందించడానికి సిద్ధమైంది. ఈ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి (DBT పద్ధతిలో) జమ అవుతాయి. ఈ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు మరియు ఇతర వ్యవసాయ ఖర్చులకు ఎంతో ఆసరా లభిస్తోంది.

ఈ-కేవైసీ (e-KYC) తప్పనిసరి

ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే రైతులు ఖచ్చితంగా ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసి ఉండాలి. ఇప్పటికీ ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు వెంటనే పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి లేదా దగ్గరలోని సీఎస్సీ (CSC) సెంటర్లలో ఆధార్ నంబర్ ద్వారా కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. అలాగే, లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోవడం, బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండేలా చూసుకోవడం ముఖ్యం. కేవైసీ పూర్తి చేయని వారికి ఈ 22వ విడత డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంది.

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి