Omicron Death : భారత్లో తొలి ఓమిక్రాన్ మరణం.. హై అలెర్ట్..!
దేశంలో తొలి ఓమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్థాన్ లోని ఉదయపూర్ కు చెందిన ఓ 73 ఏళ్ల వృద్ధుడు ఓమిక్రాన్ బారిన పడి కన్ను మూసినట్లు వైద్యాధికారులు అధికారికంగా ప్రకటించారు. మహమ్మారి బారిన పడి ఆసుపత్రిలో చేరిన ఈ బాధితుడు బిపీ, డయాబెటిస్ వంటి వ్యాధులను కలిగి ఉన్నాడని తెలిపారు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర లో కూడా ఓ వ్యక్తి ఒమిక్రాన్ తో మృతి చెందినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నెల 28నే ఓమిక్రాన్ […]
దేశంలో తొలి ఓమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్థాన్ లోని ఉదయపూర్ కు చెందిన ఓ 73 ఏళ్ల వృద్ధుడు ఓమిక్రాన్ బారిన పడి కన్ను మూసినట్లు వైద్యాధికారులు అధికారికంగా ప్రకటించారు. మహమ్మారి బారిన పడి ఆసుపత్రిలో చేరిన ఈ బాధితుడు బిపీ, డయాబెటిస్ వంటి వ్యాధులను కలిగి ఉన్నాడని తెలిపారు.
ఇదిలా ఉండగా మహారాష్ట్ర లో కూడా ఓ వ్యక్తి ఒమిక్రాన్ తో మృతి చెందినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నెల 28నే ఓమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి మరణించాడని ఒక జాతీయ వార్త సంస్థ తెలిపింది. ఇటీవల నైజీరియా నుంచి మహారాష్ట్రకు తిరిగి వచ్చిన ఓ వ్యక్తి హార్ట్ అటాక్ తో మరణించినట్లు చూపించారని, కానీ వాస్తవానికి ఆ వ్యక్తి ఓమిక్రాన్..
సోకి చనిపోయినా మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా మరణం కాకుండా ఇతర కారణాలతో అతడు మరణించాడని రిపోర్ట్ చేసినట్లు పుకార్లు వస్తున్నాయి. ఇక దేశంలో మళ్ళీ విజృంభిస్తున్న కోవిడ్ మహమ్మారి భారతీయుల గుండెల్లో మళ్ళీ వణుకు పుట్టిస్తోంది.