EPFO : పిఎఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్… ఇప్పుడు ఈ సదుపాయం రెట్టింపు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 15 July 2022, 8:00 pm

EPFO : పిఎఫ్ ఖాతాదారులకు చక్కటి అవకాశం వచ్చింది. EPFO ఉద్యోగుల భవిష్య నిధి వేతన జీవులకి అత్యవసర సమయాలలో బాగా ఉపయోగపడుతుంది. పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం ఆన్లైన్ సౌకర్యం కల్పించినప్పటి నుంచి సామాన్యులు ఎంతో ఉపశమనం పొందుతున్నారు. గతంలో అయితే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయాలంటే చాలా రోజులు వేచి ఉండాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు మాత్రం కొన్ని గంటల్లోనే అకౌంట్ లోకి డబ్బులు వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు అలా కాదు పిఎఫ్ నుంచి రెట్టింపు మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు కరోనా పెరుగుతున్న దృష్ట్యా ఉద్యోగులు తమ పిఎఫ్ అకౌంట్ నుంచి రెట్టింపు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.

ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది నిజానికి ఇంతకుముందు ఈపీఎఫ్ ఉద్యోగులకు తిరిగి చెల్లించని అడ్వాన్స్ కి అనుమతి ఇచ్చింది. అయితే ఈ అవకాశాన్ని రెండుసార్లు కల్పిస్తోంది. కరోనా సమస్య ఉన్న ఉద్యోగి ఈ పంటను రెండుసార్లు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది కానీ గతంలో ఈ సదుపాయం ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉండేది నిజానికి మెడికల్ ఎమర్జెన్సీ కింద గవర్నమెంట్ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది ఏ ఉద్యోగి ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో రెండు సార్లు అడ్వాన్స్ పొందటానికి ఏర్పాటు చేసింది.

Good news for EPFO holders

Good news for EPFO holders

ఇప్పుడు ఈపీఎఫ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం.

1) పిఎఫ్ ప్రాసెస్ కోసం అభ్యర్థులు ఈ సేవ పోర్టల్ https.//unifiedportal-mem epfindia.gov.in/memberinterface/ కి వెళ్లాలి.
2) మీ UAN, పాస్ వర్డ్, క్యాచ్ కోడ్ ను ఎంటర్ చేయడం ద్వారా మీ ఎకౌంటుకు లాగిన్ అవ్వండి.
3) ఇప్పుడు ఆన్లైన్ సేవలకు వెళ్లి అక్కడ మీ క్లెయిమ్ ను ఎంచుకోండి.
4) ఇప్పుడు మీ స్క్రీన్ పై కొత్త వెబ్ పేజీ కనిపిస్తుంది. ఇందులో మీ పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్లోని చివరి 4 అంకెలను నమోదు చేయాలి.
5) ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ను ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయండి.
6) మీ స్క్రీన్ పై పాప్ అప్ కనిపిస్తోంది. సర్టిఫికెట్ ఆఫ్ అండర్ టేకింగ్ అందించమని అడుగుతుంది.
7) డ్రాప్ డౌన్ మెనూ నుంచి పిఎఫ్ అడ్వాన్స్ ఫారం 31 ను ఎంచుకోవాలి.
8) డ్రాప్ డౌన్ మెనూ నుంచి మీరు డబ్బును విత్ డ్రా చేయడానికి పాండమిక్ వ్యాప్తి ఫారంనుఎంచుకోవాలి.
9) అవసరమైన మొత్తాన్ని కౌంటర్ చేయండి. చెక్కు స్కాన్ చేసిన కాపీని అప్లోడ్ చేయండి. ఈ చిరునామాను ఎంటర్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ తో నమోదు చేసుకున్న ఫోన్ నెంబర్ కు OTP వస్తుంది. దానిని ఎంటర్ చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి